Profile
About
నమస్తే అండి 🙏🙏
నా పేరు ఇందిరా రావు షబ్నవీస్.
మా వారు శ్రీ వెంకట్ రావు గారు.
మొదటి సారి కాలేజీ లో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి, తరువాత ఒక కథ రాస్తే కాలేజీ మ్యాగజైన్ లో ప్రచురించబడ్డాయి. అలా రాయడం అలవాటు అయింది.
నేను, మా వారు, ఇద్దరం ఒమాన్ ఎయిర్ లో 20 సంవత్సరాలు పని చేశాము.
పోతుకూచి సాంబశివరావు గారి ఒక పేజీ కథల పోటీలో పాల్గొనడం జరిగింది. దానిలో నా కథ కి మొదటి బహుమతి పోరంకి దక్షిణా మూర్తి గారి వద్దనుండి అందుకున్నాను. తెలంగాణ మాండలికం లో వున్న ఆ రచన "నేను రాసినట్టే ఉందమ్మా నీ కథ " అన్న వారి ప్రశంస నాకు పెద్ద కితాబు. తరువాత కొన్ని అప్పటి పత్రిక లలో ప్రచారించబడ్డాయి. ,
రేడియో లో నా ప్రసంగాలు తెలంగాణ తేజోమూర్తులు లో ప్రచారించబడ్డాయి. చాలా విషయాలపై తరుచు రేడియో ప్రసంగాలు, కథలు రేడియో లో ప్రసారమైన్నాయి.
మా వారిని దత్తత తీసుకున్న వారు "శ్రీ షబ్నవిస్ వెంకట రామ నరసింహారావు గారు" నల్గోండకు చెందిన ఒక ప్రసిద్ధ సాహితి వేత్త. నిజాం యుగంలో "నీలగిరి " అనే మొదటి తెలుగు పత్రికను ప్రచురించిన వారు. వారు నల్గొండలో చాలా గ్రంథాలయాలను ప్రారంభించారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు , బుర్గుల రామకృష్ణరావు గారు తదితరులతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
వారిని గురించి మొత్తం సమాచారాన్ని సేకరించి నాలుగు సంవత్సరాల క్రితం త్యాగరాయ గానసభలో "షబ్నవిస్ జీవితం - సాహిత్యం" అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది.
నేను రాసిన కొన్ని కథలకి ప్రత్యేక బహుమతిని అందుకున్నాను. ఇప్పటి వరకు సుమారు ఒక 25/30 కథలు రాసి వుంటాను. అమెరికా పత్రిక లలో కూడా నా కథలు ప్రచురితమైనవి. 2020 న్యూ జెర్సీ వారి దీపావళి కథల పోటీలలో నా కథకి మొదటి బహుమతి లభించింది.
వంటలు, తోటపని, ఇంటి అలంకరణ హాబీస్. వంటల పోటీలలో మస్కట్ లోను, ఇండియా లోను అనేక సార్లు గెలుపొందాను.