top of page

బుజ్జిబాబు.. పెళ్లిపందిరి.. గారెముక్కలు


'Bujjibabu Pellipandiri Garemukkalu' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

బుజ్జిబాబుకు పెళ్లి కాలేదు. సంబంధాలు వస్తున్నాయి. అందుకు ఏమీ లోటు లేదు.

బుజ్జిబాబు అనాకారి కాదు. పెద్ద అందగాడు కాకపోయినా ఓ పిసరంత అందగాడే !

అయితే అతను ఏ అమ్మాయి నైనా హ్యాపీగా పెళ్లి చేసుకోవడం విషయంలో అతనికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.... అది సమస్య కాదు ధర్మసందేహం.... ధర్మసందేహమూ కాదు... అనుమానం...


అనుమానము కూడా కాదు... ఆవకాయ జాడీలో అరటిపండు లాంటి ఆదోరకమైన సమస్య.


సరే... ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆ రోజు ఉదయం బుజ్జిబాబు... ఆయాసపడుతూ తన గురువు త్రిలోకచంద్రంగారి ఇంటికి వచ్చాడు. విషయం అంతా ఆయనకు చెప్పి అక్కడున్న గ్లాసుడు నీళ్ళు గబగబా తాగేశాడు.


గురువుగారు పకపకా నవ్వేశారు.

"ఒరేయ్ బుజ్జిబాబు... ప్రపంచంలో అందరూ... నీలాగే ఆలోచిస్తే... ఈ సృష్టి చక్రం తిరగదురా. నీది అనవసరపు భయం. పనికిరాని ఆందోళన.


ఏదైనా సమస్య గురించి.. ఎక్కువగా ఆలోచిస్తే ఇట్లాగే ఉంటుంది. మరీ ఇంత పిరికి తనం పనికి రాదు సుమీ.. సరే.. వచ్చి.. ' గురువుగారు ఈ విషయంలో మీ సలహా ఇవ్వండి.. నాకు ధైర్యం చెప్పండి '.. అని అడిగావు కనుక... నాకు తోచిన సలహా ఇవ్వాలి. కానీ నీ మనసును బట్టి నీకు సలహా ఇవ్వకూడదు. ప్రాక్టికల్ గా చూపించాలి. అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. సరే బయలు దేరు మనం ఇద్దరం నా మోపెడ్ మీద నాలుగు చోట్లకి వెళ్ళాలి..." అంటూ శిష్యుడు బుజ్జిబాబుని వెనుక సీటు మీద కూర్చోబెట్టుకుని తనే డ్రైవ్ చేస్తూ బయలు దేరారు.. గురువు త్రిలోకచంద్రoగారు.


శిష్యుడిని ముందుగా తన అన్నగారు కొడుకు చక్రి ఇంటికి తీసుకెళ్లారు...


చక్రి ఇద్దర్నీ లోపలకు ఆహ్వానించి కూర్చోమని మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. వెంటనే తన భార్య మండోదరి ని బయటకు పిలిచి.. 'వచ్చిన వాళ్లను పలకరించడం నీకు చాతకరాదా.. బుద్ధిజ్ఞానం లేదా.. గడ్డి తింటున్నావా?? మంచి నీళ్లు ఇవ్వడం తెలియదా' అంటూ గట్టిగా అరిచాడు. ఆమె భయపడి ప్రశాంతంగా తల కిందకు దించి మౌనంగా ఎందుకన్నా ఉండిపోయింది. చక్రి మళ్లీ ఆమెను తిట్టడం మొదలెట్టాడు..


''ఆ మౌనం ఏమిటి.. కాపురం చేయడం రాకపోతే ఎందులో అయినా దూకి చావు.. ఛీ ఎదవ పెళ్ళాం... ఎదవ పెళ్లి చేసుకున్నాను..."


అంటూ చెడమడ నోటికి వచ్చినట్టు అలా తిడుతూనే ఉన్నాడు. ఊరంతా వినబడేలా పొలికేకలు పెట్టాడు. ఆమె ఏడుస్తూ భర్త కొడతాడు ఏమో అని భయపడి వంటింట్లోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టేసుకుంది. చక్రి పరుగున వెళ్ళి తన బూటుకాలితో ఆ తలుపుని గట్టిగా తన్నాడు. నిమిషంలో ఆ ఇల్లంతా భయంకర యుద్ధభూమిలా మారిపోయింది. బుజ్జిబాబు అంతా గమనిస్తూ బెంబేలెత్తి పోయాడు.


భయపడిపోయి లేచి మంచినీళ్లు కూడా తాగకుండా బయటకు వెళ్ళిపోయాడు. త్రిలోకచంద్రంగారు తన అన్నగారు కొడుకు చక్రి ని సముదాయించి వేరే పనిమీద ఇటు వెళ్తున్నామని మళ్ళీ వచ్చేటప్పుడు ఆగుతా మని చెప్పి తనుకూడా బయటకు వచ్చేశారు.


బుజ్జిబాబు గురువుగారిని చూసి లోపల జరిగిన సంఘటనకు గుండెలు బాదుకుంటుడగా......


"ఆగరా.. ఆగాగు.. కంగారుపడి పోకు... ప్రాక్టిక ల్ అని చెప్పాను కదా సీన్లు ఇలాగే ఉంటాయి"... అని చెప్పి అతడిని పక్క వీధిలో ఉన్న తన తమ్ముడు గారి అబ్బాయి చలం ఇంటికి తీసుకుని వెళ్లారు.


చలం ఇద్దరిని ఆహ్వానించి లోపలకు తీసుకెళ్ళి సోఫా మీద కూర్చోబెట్టాడు. అంతే.. లోపల నుండి అతని భార్య.. కైకమ్మ బయటకు వచ్చింది. వస్తూనే..."మీరు అసలు మనిషి జన్మ ఎత్తలేదు. సోఫాలు నిన్ననే క్లీనింగ్ చేయిం చాము కదా... వాట్ల మీద ఎందుకు కూర్చోబె ట్టారు. అవి పోతే మా అమ్మగారు అస్తమానం పంపించ లేరు కదా. కొంచెం జ్ఞానం తెలుసుకుని బ్రతకండి.. వెధవ బ్రతుకు.. బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే.. చి చి"

అంటూ వచ్చిన వాళ్ళను కూడా పలకరించ కుండా విసురుగా లోపలికి వెళ్ళిపోయిoది...


అక్కడున్న కుర్చీని తన్నుకుంటూ ! దాంతో చలం చాలా చిన్నబుచ్చుకుని కళ్ళవెంట నీళ్ళు పెట్టుకున్నాడు... తన పెదనాన్నని చూసి.


త్రిలోకచంద్రం.. చలానికి నాలుగు మంచి మాట లు చెప్పి.."కంగారుపడకు. అంతా బాగుంటుం దిలే... పక్కనే ఉన్న మునిసిపల్ ఆఫీస్కు వచ్చా మురా.. ఆ పని చూసుకొని.. అలా వెళ్లిపో తాము"అంటూ బయటపడ్డారు.. శిష్యునితో సహా.


"చూసావురా బుజ్జిబాబు... ఇంతకుముందు మనం చూసిన కేసు కి ఈ కేసు రివర్స్!!!..."... అంటూ బుజ్జిబాబు వైపు చూశారు. బుజ్జిబాబు తల పట్టుకుని ఓ చెట్టు మొదల నీర సంగా కూర్చుండిపోయాడు.


"చి చి అలా పిరికిపడకురా... ఇక్కడితో.... ఇంటర్మీషన్ అయ్యింది. ఇంకా సగం స్టోరీ నీకు చూపించాలిరా.." అంటూ అతడిని మోపెడ్ వెనుక కూర్చుండ బెట్టుకొని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీహరికాలనీ కి... తీసుకువెళ్ళారు. అది తన కొలీగ్ సూర్యారావుగారి అమ్మాయి శకుంతల ఇల్లు.


"బుజ్జిబాబు ఇది మూడవ జంట ఇల్లు రా. ఇంత వరకు నువ్వు ఒక గుండెతోనే ఉన్నావు.. కానీ ఇప్పుడు రెండు గుండెలు నీకు ఉండాలి... అర్థంకాలే.... కాసేపు ఆగు... రీలు తిరగడం మొదలవుతుంది.."... అంటూ భయపడుతున్న శిష్యుడిని బలవంతంగా లోపలకి లాగారు.


లోపల శకుంతల ఆమె భర్త దుష్యంత్.. ఉన్నారు అనేకన్నా... ఇద్దరు భయంకర రాక్షసులు ఉన్నారు అనడం సబబు.


వాళ్ళిద్దరూ తమ గదిలో అటూ ఇటు నిల బడి... స్వచ్ఛమైన బూతులు తిట్టుకుంటూ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒకరిమీద ఒకరు గిరాటేసికుంటున్నారు... తగ్గేదే లే... అన్నట్టు రెండు శివంగుల్ల... భీకరయుద్ధం చేసుకుంటున్నారు. ఈ భూప్రపంచంతో వాళ్లు ఇద్దరకు సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఎవరు గెలుస్తారు అన్న ఆత్రుత మాత్రమే అక్కడ రాజ్యమేలుతోంది.


బుజ్జిబాబు... అంతా చూసి పిచ్చి ఎక్కిన వాడి లా అరవాలి అనుకున్నాడు... పక్కనే ఉన్న గురువుగారు... అతని నోరు మూసి రెక్క పట్టు కుని బయటకు లాక్కు వచ్చేశారు.


"గురువుగారు.. బాబోయ్ ఇది ఇల్లా కురుక్షే త్రమా? ఈ భార్యభర్తలు మనుషులు కాదండి.... ఆ ఇద్దరు పిశాచుల్లా కనిపిస్తున్నారు నాకు... ఈ సీన్ చూశాక.. నాకు నిజంగా ఉరిపోసుకుని చచ్చిపోవాలని ఉంది. మానవుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ? భర్తకు బుద్ధి లేదు భార్యకు బుద్ధి లేదు. ఈ జంటను చూస్తే ఎవరికి పెళ్లి చేసుకోవాలి అనిపించదు.. కాబోయే భర్త అంటే భార్యకి.... కాబోయే భార్య అంటే భర్త కి.... ముందుగానే అసహ్యం ఏర్పడిపోతుంది.


గురువుగారు మీ ప్రాక్టికల్ ప్రయోగం చాలుగానీ మనం ఇంటికి వెళ్ళిపోదాo వచ్చేయండి"..

అన్నాడు తల పట్టుకొని బుజ్జిబాబు.


"క్లైమాక్సు చూడందే సినిమా పూర్తయినట్టు ఎలా అవుతుంది రా!?... అదిగో ఆ వాటర్ ట్యాంక్ పక్కన కనిపిస్తుందే అదే.... నా మేన కోడలు సీత ఇల్లు. ఆమె భర్త రాము.... అంటూ అక్కడకు తీసుకుని వెళ్లారు తన శిష్యు డిని.. గురువు త్రిలోకచంద్రంగారు.. అతి బల ఎందుకన్నా వంతంగా.


తన సొంత మేనమామ వస్తున్నట్టు సీత చూసిన వెంటనే పరుగున లోపలికి వెళ్లి భర్తతో సహా చెంబుడు నీళ్ళతో తిరిగొచ్చింది. ఇద్దరూ కలిసి ఆయన కాళ్లు కడిగారు. ప్రేమగా లోపలకి తీసుకు వెళ్లి బొంతలాంటి పరుపు మీద కూర్చోబెట్టి పరుగు పరుగున మళ్లీ లోపలికెళ్ళి ఫలహారాలు తెచ్చి ఆయన ముందు ఒక ప్లేటు పెట్టారు.. కొంచెం దూరంలో కూర్చున్న బుజ్జిబాబు కి మరో ప్లేటు అందించారు... సీత మేనమామకు కాళ్ళు నొక్కడం మొదలు పెట్టింది.. రాము విసనకర్ర తో విసరడం మొదలు పెట్టాడు.


ఇదంతా చూస్తున్న బుజ్జిబాబు స్వర్గలోకంలో ఉన్నామా.... అన్న అనుభూతితో కనురెప్ప వేయటం మర్చిపోయాడు. ' ఈ భార్యాభలు ఇద్దరూ చాలా అమాయకులులా ఉన్నారు ఏంటి చెప్మా.. '.. అంటూ గుటక కూడా వేయటం మర్చిపోయాడు.


త్రిలోకచంద్రం గారు.. ఆ భార్యాభర్తలు ఇద్దరనీ దగ్గ రకు తీసుకుని...."మీరిద్దరూ కొంచెం గడుసుగా మారాలర్ర... లేకుంటే ఈ మాయల మరాఠీ ప్రపంచంలో బ్రతకలేరు. మీ మంచితనం లోకువగా తీసుకునే వాళ్లే ఎక్కువ.... సరే మిమ్ములని ద్దరినీ ఆ భగవంతుడే కాపాడతాడులే" అంటూ వాళ్ళిద్దరికీ చెరో వంద రూపాయలు దాంతోపాటు తను కూడా తీసుకువచ్చిన స్వీటు ప్యాకెట్ కూడా ఇచ్చి దీవించారు....


ఆ తర్వాత ఆయన బుజ్జిబాబుని వాళ్ళిద్దరికీ చూపిస్తూ..


"అన్నట్టు చెప్పడం మరిచాను... ఈ అబ్బాయి నా శిష్యుడు బుజ్జిబాబు. ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. వీడి సమస్య ఏమిటి అంటే... వచ్చే భార్య ఏ మనస్తత్వం కలిగినది వస్తుందో అని భయపడి పోతు న్నాడు. అది అనుమానమో, nభయంకర పెనుభూతమో తెలియని అవస్థలో ఉన్నాడు.


చెప్పాలంటే అతను అలా అనుమానపడటం సహజమే. ఎందుకు అంటే నేటి కాపురాలు చాలా మటుకు మూన్నాళ్ళ ముచ్చటగానే ఉన్నాయి కదా... మాట్లాడితే విడాకులు. మగవాడికి భయంలేదు.. ఆడదానికి అంతకన్నా భయంలేదు... ఈ కారణం చేతనే ఇతనికి పెళ్లి మీద చిరాకు అసహ్యం కలగ డానికి కారణం అయ్యింది. ఆ విషయమే నాకు చెప్పాడు ఈరోజు ఉదయం వచ్చి...


"సరే నేను.. వీడికి ప్రాక్టికల్ పద్ధతిలో ధైర్యం చెప్పడంకోసం...


మూడు కుటుంబాల తీరుతెన్నులు చూపించి చివరగా మీ ఇంటికి తీసుకు వచ్చాను... మీ ఇద్దరి ప్రవర్తన కూడా వీడికి ఓ లెసన్ లా ఉప యోగిస్తుంది..."..


చెప్పటం ఆపి ఆ భార్యభర్త ల వైపు చూశారు త్రిలోకచంద్రం గారు.


వాళ్ళిద్దరూ అమాయకుల్లా ఏమీ అర్ధం కానట్టు చూస్తుండిపోయారు.


ఈసారి త్రిలోకచంద్రం... శిష్యుడు బుజ్జిబాబు వైపు చూసి.. ఇలా అన్నారు.


"బుజ్జిబాబు... ఇదిరా వీళ్ళ వరస... మగవాడు ఇంత అమాయకంగా ఉన్నా కాపురానికి అదీ కష్టమే. !.. రాముని చూడు ఎర్రివాడి లా ఎలా దిక్కులు చూస్తున్నాడో... ఇలాంటివాడు రేపొ ద్దున ఏదైనా సమస్య వస్తే పెళ్లాన్ని కూడా రక్షించుకోలేడు. ప్రపంచ జ్ఞానం తెలియకుండా ఎలాగో బ్రతికేస్తున్నారు. ఇదొక విచిత్రమైన సంసారం... 'వెళ్లొస్తాను' అని చెప్పిన.. వీళ్లకు అర్థం కాదు.. అంత అమాయకులు అన్నమాట వీళ్ళు. ఇక మన పని పూర్తయింది నడు.."...


అంటూ ఆ భార్యాభర్త లిద్దరికీ వెళ్తున్నట్టు చెప్పి బయటకు వచ్చారు... గురుశిష్యులు.


"ఇప్పుడు చెప్పరా బుజ్జిబాబు... ఈ నాలుగు జంటలను బట్టి నీకు ఏమి అర్థమైంది.. ?"


కొంచెం దూరంగా ఉన్న పార్కులో సిమెంట్ బల్ల మీద శిష్యుడిని కూర్చోబెట్టి... తను పక్కగా కూర్చుని ప్రశాంతంగా అడిగారు.. శిష్యుడు బుజ్జిబాబు ని గురువు త్రిలోకచంద్ర గారు.


"ఏమీ అర్థం కాలేదు గురువుగారు ఇంకా భయం పెరిగింది... పెళ్లి గిల్లీ వద్దు.. క్యాన్సిల్ చేసేస్తాను."


"కంగారు పడకు రా. ఒక ఆడది పరాయి మగ వాడిని నమ్ముకొని పరాయి ఇంటికి కాపురానికి ఎందుకు వస్తుంది... అతను ప్రేమ పంచుతాడని. తన కోరికలు, nఆశలు తీరుస్తాడని. కానీ మగవాడు అనబడే భర్త... దేశ కాలమాన పరి స్థితులను బట్టి.. భార్యపట్ల తన ధర్మం పరి పూర్ణంగా నిర్వర్తించ లేకపోతున్నాడు. నూటికి 90 భార్యభర్తల సమస్యలకు ఇదే కారణం.. ఆశలు తీర్చపోయినా కనీసం ప్రేమ అయినా పంచాలి కదా.. అందులో కూడా ఫెయిల్ అవుతున్నాడు.


కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే నీ భార్య ఏ రకపు వ్యక్తిత్వం కలది వచ్చిన.. ఆమెను..."చాలా ప్రేమగా"... చూసుకో.... అలాగైతే... ఏ సమస్య ఉండదు... సరేనా".. ముగించాడు గురువు త్రిలోక చంద్రం గారు.


"సరే గురువుగారు.. ఈమాట చెప్పడానికి ఇన్ని భయంకర సన్నివేశాలు ఎందుకు చూపించారు... ఒక చోట భర్త దుర్మార్గుడు, nమరొక చోట భార్య దుర్మార్గపుది, nవేరొకచోట భార్యా భర్తలిద్దరూ రాక్షసులు... చిట్టచివరి భార్యాభర్త లిద్దరూ అమాయకపు ఆప్పడం ముక్కలు... ఏతావాతా.... ఈ ప్రాక్టికల్ సంఘ టనలను బట్టి.. నాకు పెసరబద్దంత ఉపయోగం కలగలేదు..


మీ ఇంటికాడే ఉదయమే 'భార్యను ప్రేమగా చూసుకోరా చాలు.. ' అని.. చెప్తే సరిపోతుంది కదా..". కాస్త చిరాగ్గానే అన్నాడు బుజ్జిబాబు.


"ఒరేయ్ బుజ్జిబాబు... ఇక్కడే పప్పుదాకలో కాలు వేస్తున్నావు.... జాగ్రత్తగా నీ ఇంద్రియాలన్ని నీ అదుపులో పెట్టుకుని విను...


మొదటి జంటను బట్టి భర్త ప్రశాంతంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా ఈ పాయింట్ అంటూ నొక్కి చెప్పారు.


ఇక రెండవ జంటను బట్టి.. అక్కడ కూడా భర్త ప్రశాంతంగానే ఉండాలి అని తెలుసుకోవాలి. ఈ పాయింట్ కూడా అర్థమైంది కదా.. అంటూ మళ్లీ మళ్లీ నొక్కి చెప్పారు.


తర్వాత మూడవ జంట ను బట్టి కూడా... భర్త మాత్రమే ప్రశాంతంగా ఉండాలి... అలా ఉండి భార్య ప్రవర్తన మీద విజయం సాధించవచ్చు.. అని కచ్చితంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలి. చేసుకున్నావు కదా... ఇక చివరగా నాలుగవజంట ను బట్టి భర్త తెలివి తేటలు పెంచుకుంటూ ఇక్కడ కూడా భర్త అనబడే శాల్తీ చాలా ప్రశాంతంగానే ఉండవలసిన అవసరం ఉంది రా... ఉంది... '' అంటూ మరింత గట్టిగా నొక్కి చెప్పారు.


తలపోటు వస్తోంది కదూ. ఇప్పటికైనా...... గీతాసారం లాంటి ఈ"కాపుర సారం"... మొత్తం మగవాళ్ల బుర్రలకు అర్థమైతే... ముఖ్యంగా నీ బుర్రకు అర్థం అయితే.... భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవురా... కాపురాలు హాయిగా సాగిపోతాయి... కోర్టులకు సగం బాధ తగ్గిపో తుంది.. అప్పుడు ఈ జగమంతా మరో బృందావనం అయిపోతుందిరా."..


చెప్పడం ఆపి సిమెంట్ బల్ల మీద నుండి పైకి లేచారు... గురువు త్రిలోకచంద్రంగారు.


బుజ్జిబాబు తన బుర్ర విదిలించాడు. గురువు గారు నొక్కి నొక్కి నొక్కి... చెప్పిన చివరి మాటలను బట్టి ఏదో విద్యుత్ ప్రవాహం అతని బుర్రలో ప్రవేశించినట్టు అయ్యింది. అతని బుర్రలో మట్టి అంతా దూరం గా గిరాటు వేసినట్టు హాయిగా ఉంది ఇప్పుడతనికి. పెళ్లి మీద భయం పోయి ధైర్యం కొండంతగా పెరిగింది.


"బాగా అర్థమయింది గురువుగారు... మీకు పాదాభివందనం... కుటుంబానికి కెప్టెన్ భర్త కనక.. ఏ సమస్య వచ్చినా దానికి కారణం భర్త మాత్రమే... !... బాగా అర్థమయ్యేలా లెసన్ చెప్పారు... అందుకనే కదా గురువుగారు.... మిమ్మల్ని పది సంవత్సరాల నుండి వదలడం లేదు నేను...... ఇక పెళ్లి చేసేసు కుంటాను గురువుగారు భయం పూర్తిగా పోయింది.".. అంటూ బుజ్జిబాబు హుషారుగా మోపెడ్ తనే స్టార్ట్ చేశాడు... ఈసారి శిష్యుని వెనుకగ కూర్చొని..


గురువు త్రిలోకచంద్రoగారు గుండె నిండా హాయిగా ఊపిరి తీసి వదిలారు.


మోపెడ్ వేగంగా ముందుకు దూసుకుపోతుంది.

************************************

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు






30 views0 comments
bottom of page