ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్
- Karlapalem Hanumantha Rao
- Apr 17
- 2 min read
#ట్రాజెడీఆఫ్ఎర్రర్స్, #TragedyOfErrors, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

Tragedy Of Errors - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 17/04/2025
ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్ - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
టీవీ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చింది. ఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది.
ఐదు నక్షత్రాల ఆసుపత్రి, అనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ సోపులమీదున్న అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది.
ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయింది. దైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న 'నాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ'ని.
'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లు' అన్నాడు దేవుడు. దేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచి కూర్చున్నారు.
'ఎలాగూ మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదా! ఇంకా ఈ ముడతలుబడ్డ ముఖం, బాన కడుపు, ముగ్గుబుట్ట జుట్టు, బోసి నోరు, వంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలి? మానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందా? అందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? అన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకు మాదిరిగా ఎంతమందికి ఉంది? అడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢ నిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.
గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్, ఫ్యాట్ సక్కింగ్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ రికవరింగ్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారు. పది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.
ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రొడ్డు దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.
మళ్ళీ దేవుడిగారితో భేటీ తప్పింది కాదు. భగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికి. కడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే? మీ దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎలాగయ్యా? ముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.
'సారీ! రాంబాయమ్మగారూ! లారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదు' అని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments