top of page

పిల్ల తెమ్మెరలు - పుస్తకావిష్కరణ

Updated: Apr 12

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #పిల్లతెమ్మెరలు, #PillaTemmeralu, #బాలగేయాలు

కవి సోమన్న "పిల్ల తెమ్మెరలు" పుస్తకావిష్కరణ ఒంగోలులో..


Pilla Temmeralu - Book Unveiling Ceremony At Ongole - Written By Gadwala Somanna

Published In manatelugukathalu.com On 22/02/2025

పిల్ల తెమ్మెరలు - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం

రచన: గద్వాల సోమన్న


ఎమ్మిగనూరు నివాసి, గణితోపాధ్యాయుడు, ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న పుస్తకం "పిల్ల తెమ్మెరలు" పుస్తకావిష్కరణ ముఖ్య అతిథి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఒంగోలు జిల్లా విద్యాధికారి శ్రీ అత్తోటి కిరణ్ కుమార్, విశిష్ట అతిథి శ్రీ కంది శివ శంకర్, గౌరవ అతిథి, అధ్యక్షులు నాగభైరవ కళాపీఠం డా. నాగభైరవ ఆదినారాయణ, నరసం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ, జాతీయ అధ్యక్షులు, కళా మిత్ర మండలి(తెలుగు లోగిలి) డా. నూనె అంకమ్మరావు మరియు విచ్చేసిన అతిరథ మహారథుల చేతుల మీద ఒంగోలులో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న, అచిర కాల వ్యవధిలో 64 పుస్తకాలు రచించి, పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాపోషకులు శ్రీ ఓరుగంటి ప్రసాద్, పద్య కవి మార్తాటి గోపాలరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు చంద్రశేఖర్, శ్రీ వీరపల్లి సుబ్బారావు, డా. భూసారపల్లి వెంకటేశ్వర్లు.. పాల్గొన్నారు. కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు. 


-గద్వాల సోమన్న













Comments


bottom of page