అజ్ఞానం
- Addanki Lakshmi
- 16 minutes ago
- 3 min read

Ajnanam - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 31/08/2025
అజ్ఞానం - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఉన్నారు. ఒక గుడి కట్టారు. అక్కడ రాతి విగ్రహాలు దొరకవు. ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలతో పూజలు చేసేవారు.
అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు.
ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది.. ఆ రోజు కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది.
వెంటనే ‘ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసి పోయాయి ఈరోజు ఎలాగా అనుకుంటున్నా. ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం నా అదృష్టం’ అనుకొని ఆ దుంగని కొట్టబోయాడు.
వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది.” అందులో ఉన్న అమ్మ వారు.
"ఎవర్రా మాట్లాడుతుంది? రండి బయటికి” అన్నాడు అమ్మ వారు అని తెలియని అజ్ఞానంతో..
అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి “నేను అమ్మని.. నన్ను కొట్టకు” అనగానే, “ఐతే నిన్ను కొట్టకపోతే నాకు తిండి ఎట్టాగా?”
“ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను” అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది అమ్మవారు.
ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని అక్కడి నుండి గబగబా వెళ్ళి పోయాడు.
అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది.
'రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు ఏమి ఇవ్వదా అమ్మ, గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కనికరించిందా!' అని, పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరక బోయాడు. పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.
“అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి.. నన్ను క్షమించు” అనగానే అమ్మవారు ప్రత్యక్షమై
"వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకొని కొట్ట బోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా? దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు తీసేశాను.” అన్నారు.
“అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు” అని పూజారి వేడుకొనగా, అమ్మ కనికరించి చూపు ఇచ్చి “వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు కదా. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. వెళ్లి అక్కడ ఏమి జరుగు తుందో చూడు” అంది అమ్మ.
పూజారి బోయవాని ఇంటికి వెళ్లి చూశాడు.
బోయవాడు ఇంటికి వెళ్ళి 100 బంగారు నాణేలు భార్యకు చూపించాడు. భార్యకి సంతోషమైంది. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి. బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు” అన్నాడు.
“నీకు ఇవ్వను పో” అన్నాడు, తండ్రి.
కొడుకు కు కోపం వచ్చింది. ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయాడు, అకారణంగా వచ్చిన సంపద ఎంత అనర్ధమో పూజారికి తెలిసి వచ్చింది.
వెంటనే గుడికి వెళ్లి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు పూజారి.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,
Comments