అమ్మ
- Karlapalem Hanumantha Rao
- May 6
- 2 min read
#Amma, #అమ్మ, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Amma - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 06/05/2025
అమ్మ - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
తండ్రి మరణం తర్వాత, కుమారుడు తన తల్లిని వృద్ధాశ్రమంలో వదిలేసి, అప్పుడప్పుడు మాత్రమే ఆమెను చూడటానికి వెళ్లేవాడు. ఒకరోజు అతనికి వృద్ధాశ్రమం నుంచి ఫోన్ వచ్చింది.. "మీ అమ్మగారు ఆఖరి క్షణాల్లో ఉన్నారు. మీతో మాట్లాడాలని కలవరిస్తున్నారు. వెంటనే రండి. "
కుమారుడు వెళ్లి చూస్తే, అమ్మ మరణశయ్యపై ప్రాణాలు ఉగ్గబట్టి కొడుకు రాకకై ఎదురుచూస్తోంది. కొడుకు తల్లిని అడిగాడు, "అమ్మా! నీ కోసం నన్ను ఏమి చెయ్యమంటావు?"
అమ్మ జవాబిచ్చింది: "బాబూ! ఈ వృద్ధాశ్రమంలో పంఖాలు పెట్టించు, ఆహారం పాచిపోకుండా ఒక ఫ్రిజ్ కూడా ఏర్పాటు చెయ్యి. "
కుమారుడు ఆశ్చర్యంతో అడిగాడు: "అమ్మా, ఇంతకాలం ఎప్పుడూఇలా అడుగలేదు. చివరి క్షణాల్లో ఈ వింత కోరిక లేమిటి?"
అమ్మ పేలవంగా నవ్వి "బిడ్డా! ఈ వేడికి, ఆకలికి, బాధలకి నేను ఎలాగో తట్టుకున్నాను. కానీ.. నీకు అంత శక్తి లేదు. నీ పిల్లలు నిన్ను ఇక్కడ చేర్పించినప్పుడు నువ్వు ఈ బాధలు పడకూడదురా నాన్నా! " అంది కొడుకు నుదురును ప్రేమగా ముద్దాడుతూ.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
తల్లి పడ్డ బాధ కొడుకు పడకూడదని తల్లి తాపత్రయం. ఇలాగే ఉంటుంది తల్లి మనసు కదా బాగుందండి