top of page

అన్న - చెల్లి అనుబంధం

#AnnaChelliAnubandham, #అన్నచెల్లిఅనుబంధం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Anna Chelli Anubandham - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 16/05/2025

అన్న చెల్లి అనుబంధం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


"అన్నయ్యా, అక్కడ ఎలా గున్నావ్ ? వాతావరణం ఎలాగుంటోంది? సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా కురిసి వరదలు వస్తున్నాయని, కొండ చరియలు విరిగిపడి రోడ్లు తెగిపోతున్నాయని టి. వి. వార్తల్లో చూస్తున్నాము. మీ ఆర్మీ యూనిట్ సురక్షితమని తలుస్తున్నాము. ఈమధ్య

నీ నుంచి సమాచారం తెలియక అమ్మ కంగారు పడుతోంది. వెంటనే నీ క్షేమం తెలియ చెయ్యి" చెల్లి వైష్ణవి నుంచి ఆర్మీ నాయక్ మోహన్ రావుకి మొబైల్ ఫోన్ వచ్చింది. 


ఈ మద్య పెనుగాలులు, వర్షాల వల్ల సిగ్నల్స్ లేక ఇంటికి ఫోన్ చెయ్యలేకపోతున్నాడు. ఇప్పుడు వాతావరణం అనుకూలించడం వల్ల సిగ్నల్స్ అందుతున్నాయి. 


చెల్లికి కనెక్షన్ కలిపి "వైష్ణవీ, సారీనే. వాతావరణం సరిగ్గా లేక

పోవడం వల్ల ఫోన్ చెయ్యలేకపోయాను. మా యూనిట్ వారందరము సురక్షితంగా ఉన్నాము. మా సహచర ఆర్మీ యూనిట్లలో కొండ చరియలు విరిగి పడి కొందరికి ప్రాణ నష్టం జరిగింది. మేము సురక్షిత ప్రాంతంలో ఉన్నందున ప్రమాదం తప్పింది. అమ్మకి ఫోన్ ఇవ్వు" అని 


"అమ్మా, అక్కడ నువ్వెలాగున్నావ్ ? నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. దేవుడి దయ వల్ల మాకు పెద్ద గండమే తప్పింది " 

 అని అంటూండగానే "ఒరే, కన్నా! అంత దూరాన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మిలిట్రీ నౌకరీ చేస్తు నెల నెల మాకు డబ్బు పంపుతున్నావు. మా ధ్యాసంతా నీ మీదేరా. మీ నాన్న లేకపోయినా నన్నూ, చెల్లినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. 


ఇక్కడ మామయ్య నువ్వు లేని లోటు తీరుస్తున్నాడు. మా ఆశలన్నీ నీ మీదేరా" అని తన ఆవేదన చెప్పుకుపోతున్న తల్లిని ఓదారుస్తూ "అమ్మా, నాకేం కాదు. మీరు నిశ్చింతగా ఉండండి " చెల్లికి ఫోను ఇవ్వు అని "వైష్ణవీ, నీ కాలేజీ

 చదువు ఎలా ఉంది, క్లాసెస్ రెగ్యులర్ గా జరుగుతున్నాయా?" చెల్లి బాగోగులు అడిగాడు మోహన్. 


"అన్నయ్యా, డిగ్రీ ఫైనలియర్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. క్లాసెస్ బాగానే జరుగుతున్నాయి. డిగ్రీ అవగానే యం. బి. ఎ ఫైనాన్స్ కోర్సు చేద్దామను కుంటున్నాను. మాధవరావు మాస్టారి అమ్మాయి వాసంతి మేథ్స్ లో బి. ఎడ్ చేసి ప్రైవేటు స్కూల్లో టీచర్ జాబ్ చేస్తోంది. నాకు ఎకౌంట్స్ లో కోచింగ్ ఇస్తోంది. నీ గురించి ఎప్పుడూ అడుగుతుంటుంది. మరి వాసంతిని ఎప్పుడు నాకు వదినను చేస్తావు. 


పోయిన సంవత్సరం నువ్వు బారాముల్ల టెర్రరిస్టుల సెక్టార్లో డ్యూటీ చేస్తుండం వల్ల నేను పంపిన రాఖీ సమయానికి అందలేదని తెలిసి బాధ కలిగింది. ఈ సంవత్సరం నువ్వు శలవులో ఇంటికి రాలేనని ముందే చెప్పేసావు కనక రాఖీ నీకు కొరియర్లో పంపుతాను. ఈ సారి సర్ప్రైజ్ రాఖీతో పాటు వాసంతి ఫోటో నీకు చేరుతుంది. 

నువ్వు దగ్గరగా లేకపోయినా నీలాంటి సైనిక సోదరుల రక్షణ వల్లే మేము ఇక్కడ నిశ్చింతగా ఉండగలుగుతున్నాము " అని అన్నకు తన ప్రేమను, ఆప్యాయతను ఫోన్లో కనపర్చింది వైష్ణవి. 


"చెల్లీ, నీలాంటి వారి అనురాగ ఆప్యాయతలే మన దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని కాపాడుతున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ నాకు మరో ముస్లిం యువతి ఫాతిమా సోదరిగా లభించింది. మొన్న అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పుడు మా సైనిక

సిబ్బంది కొన్ని ముస్లిం కుటుంబాలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడంతో ఫాతిమా వారి సాంప్రదాయాల్ని కాదని మా సైనిక సోదరులకు రక్షాబంధన్ రాఖీ కట్టింది.


నువ్వు ప్రేమానురాగాలతో పంపే రక్షాబంధన్ కోసం ఎదురు చూస్తుంటాను అంటూ మరొక విషయం, నాతో చదివిన లక్ష్మీపురం అబ్బాయి శంకర్రావు కాకతాళీయంగా కలిసాడు. వాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో సర్వీస్ చేస్తున్నాడు. యూనిఫారాలు వేరైనా మా డ్యూటీలు ఒక్కటే. వాడు నా కన్న ముందుగానే ప్రమోషన్ కొట్టేసాడు. 


ఇప్పుడు వాడు బి. యస్ ఎఫ్ సబినస్పెక్టరు రేంకులో ఉన్నాడు. నీ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఈసారి శలవులో వచ్చినప్పుడు అమ్మను, నిన్ను కలుస్తానన్నాడు " అని మొబైల్ ఫోను సంభాషణ ముగించాడు ఆర్మీ నాయక్ మోహన్. 


ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే రక్షణ దళాలలో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులు ఎప్పుడూ తమ వారి గురించి ఆందోళనతో గడుపుతుంటారు. అలాగే కుటుంబ సభ్యు లు యుద్ధ క్షేత్రంలో పనిచేస్తున్న తమవారి క్షేమ సమాచారం తెలుసుకోవడం కోసం తహతహలాడుతుంటారు. 

 

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comentarios


bottom of page