top of page

దబిడి దిబిడి.. దిబిడి దబిడి

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #DabidiDibidiDibidiDabidi, #దబిడిదిబిడిదిబిడిదబిడి, #TeluguComedyStories, #అసాధారణహాస్యకథ


Dabidi Dibidi Dibidi Dabidi - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 07/03/2025

దబిడి దిబిడి.. దిబిడి దబిడి - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కనకలింగం పార్కులో సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు. కూర్చుని ఉంటే పర్వాలేదు అతని చేతిలో పెద్ద మరమరాల పొట్లం ఉంది. దానిని పొట్లం అనేకంటే కుంచెడు మరమరాలు పట్టే అతిపెద్ద సంచి అనవచ్చు. 


నోట్లో వేసుకున్న గుప్పెడు మరమరాలు కంఠం దిగ కుండానే ఇంకొక గుప్పుడు నోట్లో పడిపోతున్నాయి. రైస్ మిల్ ఐరన్ బేసిన్లో పోలోమని ధాన్యం వేస్తున్నట్లు అతని నోట్లో మరమరాలు సెకండ్ విరామం లేకుండా అలా అలా పడిపోతూనే ఉన్నాయి. అయినా అతను మరమరాలు అయిపోతే ఎలా అన్న ఫీలింగ్ లో లేడు. అంటే అతను వచ్చేటప్పుడే ఓ చిన్న బస్తాడు మర మరాలు భుజం మీద పెట్టుకొని వచ్చి ఆ సిమెంట్ బల్ల కింద రెడీగా ఉంచుకున్నాడు. 


తల పైకెత్తి కూడా చూడ టం లేదు అతను. తన పక్కన కానీ తన ఎదురుగా గాని ఎవరైనా కూర్చున్నారేమో అని కూడా గ్రహించటం లేదు. అలా తినేస్తూనే ఉన్నాడు. అంత ప్రాణం అంత ఇష్టం అన్నమాట అతనికి మరమరాలు అంటే!


అతను చూసినా చూడకపోయినా గ్రహించినా గ్రహించక పోయినా అతని ఎదురుగా ఉన్న సిమెంట్ బల్లమీద తను కూడా తెచ్చుకున్న బఠానీలు పెద్ద సౌండ్ వచ్చే లాగా పరాపరా నములుతు ఆనందంగా నవ్వుకుంటూ మింగుతుంది ఒక అమ్మాయి. ఆ అమ్మా యి పేరు కనక మహాలక్ష్మి. ఆమె చేతిలో ఉన్నది పొట్లం అనే కన్నా కుంచుడు బఠానీలు పట్టిన సంచి అనవచ్చు. ఆమె కూడా చాలా కట్టుదిట్టం గా వచ్చింది ఓ పావు బస్తాడు బఠానీలు వచ్చేటప్పుడు తెచ్చుకొని బల్ల కింద పెట్టుకొని రెడీగా ఉంది. ఈవిడ కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండానే బఠానీలు నమిలే ధ్యాసలో ఉంది. 


అలా వాళ్ళిద్దరూ ఆ పార్కులోకి చాలా కాలం నుండి వస్తున్నారు అదే బల్లల మీద కూర్చుంటున్నారు కానీ ఒకరు వస్తున్నట్లు ఒకరు స్పృహలో లేకుండా ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉండి తెచ్చుకున్న తిండి అలా నమలి నమలి మింగి మింగి వెళ్ళిపోతున్నారు. 


ఏది జరిగిన జరగకపోయినా ఈ కాలచక్రం ఆగదు కదా.. ఇది చిత్రాలు విచిత్రాలు చేస్తూనే ఉంటుంది. ఓ శుభ ముహూర్తాన మబ్బు పట్టింది.. చిన్నగా చిను కులు పడుతున్నాయి. ఆ చినుకులు కనకమహాలక్ష్మి కూర్చున్న బల్ల మీదే పడుతున్నాయి. కనకలింగం కూర్చున్న బల్ల మీద ఒక చెట్టు కొమ్మ నెత్తిమీద అడ్డు గా ఉండడంతో అతని మీద చినుకులు పడడం లేదు. కాల మహిమ అంటే అదే మరి. 


పుటుక్కున లేచి కనకలింగం బల్ల మీద పుసుక్కున కూర్చుంది కనక మహాలక్ష్మి. చినుకులతో పాటు చలి కాస్త ఎక్కువగా ఉండడంతో ఈసారి కనకలింగం కనకమహాలక్ష్మి దగ్గరగా జరిగాడు. కనకమహాలక్ష్మి అభ్యంతరం చెప్పలేదు ఆవిడ కూడా కనకలింగానికి కొంచెం దగ్గరగా చేరింది. 


మొదట్లో ఇద్దరి బట్టలు రాపా డించుకున్నాయి. కాసేపటికి శరీరాలు రాపాడించుకునే స్థాయికి వచ్చారు.. మరోపక్క వాళ్ల నోరు రైస్ మిషన్ లాగా అలా పని చేస్తూనే ఉంది. వాళ్ల దృష్టి అంతా వాళ్ల చేతుల్లో ఉండే పొట్లాల మీదే ఉంది. 


కాసేపటికి చినుకులు తగ్గాయి. 


''నేను కూర్చున్న బల్లమీదకి ఎందుకు వచ్చావు?'' అడిగింది కనకమహాలక్ష్మి. 


కనకలింగం సమాధానం చెప్పాలి అన్న స్పృహలో లేడు. తన మూట పట్టుకుంటూ నమలుకొంటూ ఆకాశం వైపు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. 


అలా అలా జరుగుతూనే ఉంది రోజు. 


అయితే ఒక శుభ ముహూర్తాన కనకలింగం మరమరాలు నములుతూ.. ఎదురుగా కూర్చున్న కనక మహాలక్ష్మి వైపు చూసి మనం పెళ్లి చేసుకుందామా అంటూ తెగ నవ్వేశాడు. 


కనకమహాలక్ష్మి కోపబడి పైకి లేచి అతడిని చేతితో కొట్టబోయింది. గట్టిగా కేకలు పెట్టి అల్లరి చేయబోయింది. 'నీ వెధవ మరమరాల మొహానికి పెళ్ళాం కావాలా. ఒక ఆడదాన్ని పట్టుకొని ఇలా పుటుక్కున అనేస్తావా. '.. అంటూ గలాటా చేయబోయింది. 


కనకలింగం అర్థం చేసుకుని,

''ఇదిగో అమ్మాయి, కంగారు పడకు. నువ్వు నాకు తెలియదు. పుటుక్కున నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఎందుకు అనేస్తాను. నేను నిన్ను నేను 'పెళ్లి చేసుకుంటా.' అని అన లేదు. ఇదిగో నేను తింటున్న ఈ మరమరాల పేపర్లో. ''మనం పెళ్లి చేసుకొందామా. !'' అని టైటిల్ పెట్టి కథ రాసి ఉంది. ఇదిగో చూడు అదన్నమాట. నా మానాన నేను మరవరాలను మింగుతూ ఏదో ఫ్లోలో అలా పైకి అన్నాను'' అంటూ పేపరు చూపించాడు. 


కనకమహాలక్ష్మి సంతృప్తి పడింది కానీ ఆమె మనసుకు అతనితో ఏదో మాట్లాడాలి అనిపిస్తూ ఉంది. 


“ఇదిగో నిన్నే! నీ నోటికి ఎలాగో వచ్చింది కనుక నిజంగా మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది?'' అంటూ ప్రశ్నించింది అతని పక్కన కూర్చుంటూ. 


'నీకు నాకు ఎలా కుదురుతుంది.. నువ్వు బఠానీలు తింటావు. నేను మరమరాలు తింటాను. తూర్పు పడ మర ఎలా కుదురుతుంది? నువ్వు బఠానీలు తినడం మానేసి మరమరాలు తినడం అలవాటు చేసుకో. ఇలాగైతే పెళ్లి చేసుకుంటాను'' అన్నాడు కనక లింగం. 


''అదే వెధవ పురుష అహంకారం. కుదరదంటే కుదరదు నువ్వే మరమరాలు తినడం మానేసి నాలా బఠానీలు తినడం అలవాటు చేసుకో'' అంది అతని నోట్లో తన దగ్గరున్న బఠానీలు పోస్తూ పోస్తూ కనక మహాలక్ష్మి. 


కనకలింగం శరీరం జలదరించి మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోయి నమల లేక నవ్వలేక లేక ఆవిడ మీద పడ్డాడు. అంతే కనకమహాలక్ష్మి చిలకల కిలకిల నవ్వే సింది. 


అదిగది.. అదేనన్న మాట తొలి ప్రేమ అంటే. అనుకున్నారు ఇద్దరూ మనసుల్లో. 


''సరే ఎవరి అలవాట్లు మార్చుకోవద్దు. అయితే మన పెళ్లి అయ్యాక నేను ఒక గది నిండా బఠానీలు మూటలు పెట్టుకుంటాను. నువ్వు నీ గది నిండా మరమరాల మూటలు పెట్టుకో. '' అంటూ సలహా ఇచ్చింది కనక మహాలక్ష్మి. 


ఇదేదో బాగుందే అనుకుంటూ కనకలింగం పెళ్లికి ఒప్పేసుకున్నాడు. 


ఒక శుభ ముహూర్తాన పెళ్లి పీటల మీద కూర్చున్నారు ఇద్దరూ. రెండు బస్తాల బఠానీలు తెచ్చింది కనక మహాలక్ష్మి అవే తలంబ్రాలుగా పోద్దామని. కనక లింగం కూడా రెండు బస్తాల మరమరాలు తెచ్చాడు తలంబ్రాలుగా ఉపయోగించడానికి. 


ఇంకేముంది.. చిత్రవిచిత్రమైన పెళ్లి చూడడానికి వివిధ ఛానల్ యాంకర్స్, పేపర్ రిపోర్టర్స్ వచ్చేశారు. 


పెళ్లి ఘనంగా మహా వైభోగంగా జరిగింది. ఇష్టం వచ్చిన వాళ్లందరూ ఆ ప్రేమికులు తలంబ్రాలు పోసుకుంటు న్నప్పుడు కిందపడిన బఠానీలు మరమరాలు తమ సంచుల్లో నింపేసుకున్నారు. 


ఎవరైనా డబ్బులు కట్న కానుకగా చదివిద్దాము అను కుంటే.. తీసుకోలేదు ఆ దంపతులు. 


''ఇదిగో.. మీకు వీలైతే నాలుగు బస్తాల మరమరాలు నాలుగు బస్తాల బఠానీలు పట్టుకొచ్చి ఎప్పుడైనా మాకు ఇవ్వండి చాలు. ఆ గిఫ్ట్ అయితేనే మేము స్వీకరిస్తాం ''అంటూ చెప్పేశారు. 


భోజనాలలో కూడా ప్లేటు నిండా మరమరాలు బఠా నీలు పోసి తినమన్నారు. చేసేది లేక వచ్చిన వాళ్ళందరూ చచ్చినట్టు అవే తిని వెళ్లిపోయారు. 


ఫస్ట్ నైట్ మంచం మీద బఠాణీలు మరమరాలు ఓ 10 బస్తాలు పోశారు. మంచం చుట్టూరు ఓ 20 మరమరాలు బస్తాలు మరో 20 బఠానీలు బస్తాలు అందంగా అమర్చుకున్నారు. 


ఫస్ట్ నైట్ లో స్వీటు పళ్ళు ముందుగా తిని పాలు 

తాగుతారు కదా.. అలాగే వీళ్ళిద్దరూ మరమరాలు బఠానీలు తినడం మొదలుపెట్టారు. బస్తాలు తమ చుట్టూ చాలా ఉండడం మూలాన అవి తినడంలో మునిగిపోయిన వీరిద్దరూ ఫస్ట్ నైట్ విషయమే మర్చి పోయారు. 


పోనీ మర్నాడు కూడా అదే రిపీట్ అయింది. అలా అలా ఆరు నెలలు గడిచిపోతూనే ఉంది కానీ ఫస్ట్ నైట్ విషయం ఇద్దరికీ స్పృహలో లేదు. 


ఒక శుభ ముహూర్తాన స్పృహలోకి వచ్చి కిలకిల కళ కళ నవ్వేసుకుంటూ ఆ కార్యక్రమం కాస్త ఆరు నూరైనా ఎలాగోలా ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమం ముగించాలి అనుకున్నారు కనకలింగం కనకమహాలక్ష్మి దంప తులు. 


అంతా బాగానే ఉంది, ఆవకాయ జాడీలు అప్పడం ముక్క అన్నట్టు సమస్య మొదలైంది. 


“నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మరమరాలు అని వేరు పెడతాను” అంది కనుక మహాలక్ష్మి. 


“కుదరదు గాక కుదరదు” అన్నాడు కనకలింగం “బఠానీలు అని పేరు పెట్టాలి” అన్నాడు. ఈ సమస్య ముదిరి పాకాన పడడంతో ఇక నైట్లే లేకుండా పోయింది ఇద్దరి జీవితాల్లో. 

 

ఓ బస్తాడు బఠానీలు పట్టుకుని ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి ఆయనకు బహుమతిగా ఇచ్చింది కనకమహా లక్ష్మి. కనకలింగం నుండి విడాకులు ఇప్పించమని దండం పెట్టి అడిగింది. కనకలింగానికి కబురు వచ్చింది. కనకలింగం తను కూడా రెండు బస్తాల మరమరాలు పట్టుకుని వెళ్లి ఊరి పెద్దకు బహుమతిగా ఇచ్చాడు. 


ఇదేదో బాగుందే.. బాగుందే.. అనుకుంటూ ఊరి పెద్ద తీర్పు చెప్పకుండా రోజులు గడపడం మొదలుపెట్టాడు ఆ బఠానీలు మరమరాలు నములుతూ. 


అలా అలా ఆరు నెలల పాటు ఆ ఊరి పెద్ద చుట్టూరు తిరిగారు. బస్తాలు బస్తాలు మరమరాలు బఠానీలు

కరిగిపోతున్నాయి కానీ తీర్పు రాలేదు. 


మళ్లీ ఇంకో శుభముహూర్తాన ఒకరోజు బలుక్కు అంటూ వాంతి చేసుకుంది కనక మహాలక్ష్మి. 


ఇదేదో అదేలాగా చిత్రంగా ఉందే అనుకుంటూ కనక మహాలక్ష్మి కనకలింగం మూకమ్మడిగా డాక్టరు దగ్గరకు వెళ్లారు. 


పరీక్షించిన ఆయన కనకమహాలక్ష్మి నెల తప్పింది అని చెప్పాడు. 


''అసంభవం.. కనీసం చెయ్యి కూడా వేసి ఆమెను ముట్టుకోలేదు నేను. ఇది ఎలా?'' ప్రశ్నించాడు కనక లింగం. 


''దెయ్యాన్ని కొడుదును.. దేవుడిని కొడుదును.. నేను సీతాదేవిని బాబోయ్'' అంది కనకమహాలక్ష్మి. 


డాక్టరు ఇద్దరినీ ప్రశాంత పరిచాడు. 


''కంగారు పడకండి రోజులు మారాయి. కంప్యూటర్ మనిషి రాజ్యాలు ఏలే రోజులు ఇవి. పురాణాల్లో ఆంజనేయుడు ఎలా పుట్టాడు.. తల్లిదండ్రుల వల్ల పుట్టలేదు. వాయుదేవుడు వచ్చి ఒక తేజస్సు ను అంజన కడుపు లో ప్రవేశ పెడితే పుట్టేశాడు. కర్ణుడు ఎలా పుట్టాడు తల్లిదండ్రుల వల్ల పుట్టలేదు. సూర్యుడు వచ్చి ఒక పసిబిడ్డను కుంతీదేవికి ఇచ్చేసాడు అంతే. 


అంత ఎందుకు ఆడ నెమలి మగ నెమలి ని కలుసుకోకుండా నే గర్భం ధరిస్తుంది ఈ విషయం మీకు తెలుసా. మీ విషయం కూడా అంతే. కొన్నిటికి రీజన్ లు అడగ కూడదు. లైట్ తీసుకోండి'' అంటూ వివరించాడు. 


కనక మహాలక్ష్మీ కనకలింగం దంపతులకు డాక్టరు మాటలు నమ్మకం కలిగాయి. ఇద్దరు తగవులు మానేసి పుట్టబోయేబిడ్డ కోసం కలసిమెలసి ఉండాలి అను కున్నారు. 

 

డాక్టర్ చూపించగా.. 

కంప్యూటర్ స్క్రీన్ మీద పుట్టబోయే బిడ్డ కాళ్లుచేతులు మొఖం లేకుండా తలకాయి, పొట్ట రెండు పెద్ద బటానీ లు మాదిరిగా కనిపిస్తున్నాయి. కాళ్లు చేతులు నాలుగు మరమరాలు వలె కనిపిస్తున్నాయి ఆ ఇద్దరికీ. 


ఎగిరి గంతేశారు వాళ్ళిద్దరూ. ఆనందంతో రెండు బస్తా ల మరమరాలు రెండు బస్తాల బఠానీలు డాక్టర్కు ఫీజుగా చెల్లించి వెనుతిరిగారు. 


బాగుంది బాగుంది.. ఇదేదో చాలా బాగుంది. బేరాలు లేనప్పుడు ఖాళీగా కూర్చుంటూ మరమరాలు, బఠానీలు నములుకోవచ్చు కదా అంటూ డాక్టర్ కూడా మాదానందంలో మునిగిపోయాడు. 


ఇంటికి వెళ్లిన కనకలింగం కనకమహాలక్ష్మి దంపతులు

పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం 100 బస్తాల మర మరాలు 100 బస్తాల బఠానీలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయంతో బ్యాంకుకు బయలుదేరారు. 


***


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page