top of page

ఫలించిన సుష్మ ఆశయం

Updated: Jul 24, 2024



'Falinchina Sushma Asayam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 11/07/2024

'ఫలించిన సుష్మ ఆశయం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏమే శాంతా! ఏడిగా బువ్వెట్టవే. ఇయ్యాల ఊరిలో అమ్మోరి జాతర కూడా కదా! సాలా బేరాలొస్తాయే. నీకు మంచి పూలసీర, మన సుష్మకి మంచిగౌను కొంటానే “ అన్నాడు సైదులు తన భార్య శాంతతో. 


“రా మావా! నీకిష్టమని రొయ్యలఏపుడు, సేపల పులుసు సేశాను. మన బంగారుతల్లి నీతో కూకుని తింటానంది. రా!” అంది శాంత. 


సైదులొచ్చి కూకోగానే సుష్మ కూడా వచ్చి తండ్రి ప్రక్కన కూర్చుంది. వాళ్లిద్దరికీ బువ్వ పెట్టి కొసరికొసరి వడ్డించింది శాంత. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. సైదులు తన కూతురికి ముద్దిచ్చి రిక్షా తోలుకుంటూ బయటికి వెళ్లాడు. శాంత తను కూడా బువ్వ తిని మిగిలిన పనిని పూర్తిచేసింది. 


పదవతరగతి చదువుతున్న సుష్మ తన పరీక్షలు దగ్గరకొచ్చాయని ఇంటివద్దే శ్రధ్ధగా చదువుకుంటోంది. ఆరోజున సైదులకి చాలా బేరాలొచ్చాయి. అర్ధరాత్రనగా ఇంటికొచ్చి ఆ డబ్బులను భార్య చేతికిచ్చాడు. శాంత వాటిని దాచిపెట్టి భర్తకు భోజనం పెట్టి తనూ తింది. అప్పటకే గాఢనిద్రలో ఉన్న తన ముద్దుల కూతురిని చూసి తృప్తిగా నిద్రపోయాడు సైదులు. 


ఆ మరురోజున సైదులు తన భార్యాబిడ్డలను బయటికి తీసుకెళ్లి ఆమెకిష్టమైన పువ్వులచీర, సుష్మకి మంచిగౌను కొన్నాడు. అందరూ సంతోషంగా ఇంటికి వచ్చారు. 


కొన్ని రోజుల తర్వాత సుష్మ చక్కగా చదివి మంచి మార్కులతో పాసయ్యింది. సైదులు, శాంత చాలా సంతోషించారు. సుష్మ మంచి కాలేజీలో చేరి కష్టపడి చదువుతూ స్కాలర్షిప్ ను సాధించింది. రోజులు గడుస్తున్నాయి. మరో రెండు సంవత్సరాల తర్వాత సుష్మ డిగ్రీలో చేరింది. కష్టపడి చదువుతోంది. కూతురి పట్టుదలను, శ్రధ్ధను మెచ్చుకుంటూ తను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆమెకి ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాడు సైదులు. 


చూస్తూండగానే సుష్మ డిగ్రీ పూర్తి చేసి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. చిన్నతనం నుంచి IAS కావాలనే తన ఆశయం దిశగా అడుగులు వేస్తూ అందుకు తగిన శిక్షణను తీసుకుంది. రేయనకా, పగలనకా కష్టపడి చదివి సివిల్స్ పరీక్షలు వ్రాసి మంచి రాంకును సాధించింది. సుష్మని అందరూ అభినందించారు. శాంత దంపతుల ఆనందం అవధులు దాటింది. అన్ని మీడియావాళ్లు, పత్రికల వాళ్లు సుష్మని ఇంటర్వ్యూ చేశారు. సుష్మ తన తల్లిదండ్రులను వాళ్లకి పరిచయం చేసి తన ఈ అభివృద్ధికి తన తల్లిదండ్రులే కారణమని చాలా సంతోషంగా చెప్పింది. 


 తమ కూతురు మంచి ప్రతిభతో రాణించి కలక్టర్ అయి తమకు, తమ ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నారు సైదులు దంపతులు. 


రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్ గా ఆర్డర్ ను తెచ్చుకుంది సుష్మ. ఆరోజు తను ఉద్యోగంలో చేరేరోజు. సుష్మ తనతల్లితండ్రుల పాదములకు నమస్కరించి ఆఫీసుకు వెళ్లింది. తమ బంగారు తల్లిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు శాంత, సైదులు. 

సుష్మ తన తండ్రిచేత రిక్షా మాన్పించి ఇంటివద్దే హాయిగా విశ్రాంతి తీసుకోమంది. అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు సైదులు. 


 వృత్తినే దైవంగా భావించే సుష్మ అనతికాలంలోనే మంచి పనులను చేస్తూ మంచి కలెక్టర్ గా పేరుతెచ్చుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఉత్తమ కలెక్టర్ గా సత్కరించింది.. ప్రభుత్వ క్వార్టర్స్ ను వద్దని తను దాచుకున్న సొమ్ముతో ఒక చిన్న ఇంటిని కొని అందులో తన తల్లి తండ్రులతో సంతోషంగా ఉంటోంది సుష్మ. 


సుష్మని, ఆమె ప్రతిభాపాటవాలను ఇష్టపడిన ధనుష్ ఆమెని పెళ్లి చేసుకోవాలన్న తన అభిప్రాయం చెప్పి ఆమె అంగీకారాన్ని అడిగాడు. ధనుష్ కూడా ఇంకో జిల్లా కలెక్టర్. అతని గురించి, వృత్తిపట్ల అతని అంకితభావం, అతని శక్తి సామర్థాలను అంతకు ముందే సుష్మ వినిఉన్న కారణంగా అతనితో తన పెళ్లికి సుముఖత తెలిపింది. అనాధ అయిన ధనుష్ కష్టపడి చదివి ఈ స్ధాయికి వచ్చాడని తెలిసి అతనంటే మరింత గౌరవం పెరిగింది సుష్మకి. 

 

ఒకరోజు ధనుష్ ని తీసుకొచ్చి తన తల్లి తండ్రులకు పరిచయం చేసింది సుష్మ. తమ కూతురి ఇష్టమే తమ ఇష్టమన్నారు సైదులు దంపతులు. ఒకరోజున రిజిస్టర్ మారేజి చేసుకుని దంపతులయ్యారు సుష్మ, ధనుష్ లు. వాళ్లిద్దరూ అన్యోన్యంగా, సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్లు తమ వృత్తిలో మరింత ప్రతిభతో రాణిస్తూ అనేక మంచిపనులను చేస్తూ ప్రజలందరి మన్ననలను పొందుతున్నారు శాంత, సైదులు వాళ్లని చూసి సంతోషిస్తూ మనశ్శాంతిగా జీవిస్తున్నారు. 


.. సమాప్తం .. 

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.


గత  5సం.. నుంచి  “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో  నేను కధలు  వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో  నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక  ప్రశంసలు లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు🙏. 


ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery










Comments


bottom of page