గాడిద చేసిన పరిష్కారం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jun 25
- 3 min read
#GadidaChesinaParishkaram, #గాడిదచేసినపరిష్కారం, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 8
Gadida Chesina Parishkaram - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 25/06/2025
గాడిద చేసిన పరిష్కారం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
అగ్రహారంలో ఉండే చాకలి కొండయ్య రజకసంఘం నాయకుడు. చాకలిపేటలో ఏ పంచాయతీ వచ్చినా పరిష్కారం చేస్తాడు. అందువల్ల కొండయ్య అంటే గౌరవం.
ఊరిలో కొందరికి గాడిదలు ఉన్నాయి. అలాగే కొండయ్య వద్ద కూడా మగ గాడిద ఉంది. చాకలిపేట నుంచి కొండగెడ్డకు మురికి బట్టలు మూటలు కట్టి గాడిదల వీపుల మీద వేసి చాకిరేవుకు చేరుస్తారు.
ఊళ్లోని రజకులు పట్నం నుంచి వారానికి ఒకసారి మురికిబట్టలు తెచ్చి నల్లజీడి గుర్తులు పెట్టి ఊరి బయట కొండగెడ్డలో ఉతికి ఆరవేసి ఇస్త్రీ చేసి మూటలు కట్టి కావళ్లలో తీసుకువెల్తారు.
ఈమద్య కొండగెడ్డలో నీళ్లు లేక ఊరి మద్యలో ఉన్న పంచాయతీ నూతిలో నీళ్లు గోలేలలో తోడుకుని చాకిరేవు బండల మీద ఉతికి కర్రలకు తాళ్లు కట్టి ఆరవేసు కుంటున్నారు. ఆ మురికినీరు నూతి పరిసరాలలో చేరి బురద పాచిక పట్టి దోమల బెడద ఎక్కువైందని ఊరి జనం పంచాయతీలో ఫిర్యాదులు చేస్తున్నారు. అదే విషయమై ఊరి జనాలకు రజకులకు మద్య తగవులు నడుస్తున్నాయి.
పరిష్కార మార్గమెలాగని తర్జనభర్జన పడుతున్నారు. రోజులు ఇలా ఉండగా గత కొద్ది నెలలుగా అదునుకు వర్షాలు కురవక ఊళ్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందు కురిసిన వర్షాలను నమ్ముకుని చాలామంది రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టి పంటలు వేసారు. మంచి అదును సమయంలో వర్షాలు ఎత్తికట్టడంతో రైతుల్లో భయం మొదలైంది. బోలెడు డబ్బులు ఎక్కువ వడ్డీకి తెచ్చి వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టినందున పంటలు పండకపోతె నిండా మునిగిపోతామని బెగులుగా ఉంది.
పరిష్కార మార్గం కోసం ఊరి పురోహితులు రామశాస్త్రి గారిని సంప్రదించారు. ఆయన పంచాగం చూసి శాస్త్రం ప్రకారం ఈ సీజన్లో వర్షాలు బాగా కురవాలి గాని వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఋతుపవనాలలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. దానికి పరిష్కారంగా గార్దభ వివాహం జరిపి కొండపోచమ్మ తల్లికి మొక్కులు తీర్చండని సలహా ఇచ్చారు.
ఇప్పుడు సమస్య గార్దభ వివాహం దగ్గర వచ్చింది. రజకులు తమ గార్దభాలను వివాహాలకు ఒప్పుకోలేదు. ఊరిలో ఉన్న గార్దభాలలో కొండయ్య వద్దనే మగ గార్దభం ఉంది. మిగతావి ఆడ గార్దభాలు. పంచాయతీ నూతి దగ్గర బట్టలు ఉతకడం విషయమై రజకులకు రైతులకు తగవులు నడుస్తున్నాయి.
చివరకు వర్షాలు పడనందున తమ పంటలు నష్టపోతున్నామని తలిచి రైతులు రాజీకి వచ్చారు.
ఊరి రజకసంఘం నాయకుడు కొండయ్య మగ గాడిదకు మరొక ఆడగాడిదతో వివాహం జరిపి ఊరంతా తిప్పి కొండపోచమ్మకు ఘనంగా పండగ జరిపించారు ఊరి జనం.
గార్దభ వివాహ పలితమో లేక కొండపోచమ్మకు చేసిన ఉత్సవ ఫలితమో రెండురోజుల అనంతరం కుంభవృష్టి వర్షాలు కురిసి భూమంతా శస్యస్యామలమైంది. రైతుల ముఖాలలో సంతోషం కనబడింది.
ఇంతలో ప్రభుత్వ పథకాలలో రజకులకు ఊరి కొండగెడ్డ వద్ద సిమ్మెంటు కుండీలు కట్టించి నీటి బోర్లు వేయిస్తున్నట్టు అధికారుల నుంచి సమాచారం వచ్చి రజకులు తమ సమస్య కొండయ్య గాడిద ద్వారా పరిష్కారమైందని ఆనందపడ్డారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comentarios