కచదేవయాని - పార్ట్ 1
- T. V. L. Gayathri
- Aug 1
- 2 min read
Updated: Aug 4
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part -1 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 01/08/2025
కచదేవయాని - పార్ట్ 1 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
పూర్వం దేవతలకు దానవులకు తఱచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ కథ జరిగే నాటికి క్షీరసాగర మథనం జరగలేదు. కాబట్టి దేవతల దగ్గర అమృతం లేదు.
ఆ కాలంలో వృషపర్వుడు అనే దానవరాజు ఉండేవాడు. అతడికి శుక్రాచార్యుడు గురువుగా వ్యవహరిస్తున్నాడు. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తన తపోశక్తితో 'మృత సంజీవని 'అనే విద్యను కనిపెట్టాడు. ఆ విద్య వలన యుద్ధంలో చనిపోయిన దానవులకు శుక్రాచార్యుడు ప్రాణం పోసి బ్రతికించేవాడు. దేవతల దగ్గర అటువంటి రక్షణ విద్య లేకపోవటం వలన దేవదానవ యుద్ధాల్లో దేవతలు పెద్ద సంఖ్యలో మరణిస్తూ ఉండేవాళ్లు.
దీంతో దేవతలు చాలా కలవరపడ్డారు. తమని తాము రక్షించుకోవడానికి ఇంద్రుడు, అష్ట దిక్పాలకులు, వసువుల లాంటి బలవంతులైన దేవతలు కూర్చుని చర్చించి ఒక ఉపాయం ఆలోచించారు. అదేమిటంటే దేవతలలోనుండి ఎవరైనా వెళ్లి శుక్రాచార్యుని వద్ద ఆ 'మృతసంజీవని' విద్యను నేర్చుకొని రావటం. ఈ ఉపాయం బాగుంది!కానీ శతృ శిబిరంలోకి ఎవరు వెళ్తారు? అంత ధైర్యం ఎవరికి ఉంది? చివరకు ఆలోచించగా వారికి దేవ గురువైన బృహస్పతి కుమారుడైన కచుడు కనిపించాడు. కచుడు చక్కగా శాస్త్రాలను చదువుకొన్నవాడు. వినయశీలి. బుద్ధిలో తండ్రిని మించిన వాడు. ఇంకేం!కచుడిని పిలిపించాడు దేవతలకు రాజైన ఇంద్రుడు. వచ్చాడు కచుడు. పెద్దలకు నమస్కారం చేసి, వినయంగా నిలుచున్నాడు.
అప్పుడు ఇంద్రుడు కచునితో శుక్రాచార్యుడి వద్దకు వెళ్లి మృతసంజీవని విద్యను ఎలాగైనా నేర్చుకోమని కోరాడు. దానికి అంగీకరించాడు కచుడు. అయితే కచుడు భూలోకానికి ప్రయాణమై వెళుతూ ఉండగా ఇంద్రుడు
"నాయనా కచా! నీవు శుక్రాచార్యుడిని భక్తిశ్రద్ధలతో సేవించు! అతడికి ప్రీతిపాత్రుడవై మెలుగుతూ అతడి మనసులో స్థానం సంపాదించుకో! నీ తెలివితేటలను ఉపయోగించి మృత సంజీవని విద్యను సంగ్రహించు!అయితే ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను! శుక్రాచార్యునికి దేవయాని అనే కూతురు ఉంది. ఆమె అంటే ఆయనకు పంచప్రాణాలు. నీవు ఆమెను కూడా ప్రసన్నురాలిని చేసుకో! ఆమె మాట శుక్రాచార్యుడు జవదాటడు. ఎలాగైనా కార్యం సాధించు!జాగ్రత్తగా వెళ్లి మన కందరికీ మేలు కలిగేటట్లుగా ప్రవర్తించి విజయాన్ని సాధించుకొని రమ్ము! " అంటూ చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి కచుడిని ఆశీర్వదించి పంపించాడు ఇంద్రుడు. //
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comentarios