top of page

కచదేవయాని - పార్ట్ 2

Updated: Aug 6

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part -2 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 04/08/2025

కచదేవయాని - పార్ట్ 2తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

జరిగిన కథ

దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం బయలుదేరుతాడు.

ఇక కచదేవయాని పార్ట్ 2 చదవండి. 


కచుడు శుక్రాచార్యుని వద్దకు వచ్చాడు.

మహాసౌందర్యవంతుడైన కచుడిని చూచి శుక్రాచార్యుడు ముగ్ధుడై


"ఎవరు నాయనా నీవు? నీ తల్లిదండ్రులు ఎవరు?" అని ప్రశ్నించాడు.


కచుడు వినయంగా" స్వామీ! నేను దేవగురువైన బృహస్పతిగారి కుమారుడిని. నా పేరు కచుడు. మీ వద్ద సకల శాస్త్రములు  నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను!" అని పలికాడు.


ఆ మాటలకు పెద్దగా నవ్వాడు శుక్రాచార్యుడు.


"మీ తండ్రిగారికి తెలియని శాస్త్రవిద్యలు నా దగ్గర ఏమున్నాయి? గొప్ప తపోసంపన్నులైన బృహస్పతిగారి కుమారుడవు.  నీకు నేను నేర్పించే నూతనమైన శాస్త్రవిద్య ఏముంటుంది? " అన్నాడు నవ్వుతూ శుక్రాచార్యుడు.


కచుడు వినయంగా చేతులు జోడించి 

"స్వామీ! విద్య అనేది అనంతమైనది.మా తండ్రిగారి వద్ద నేను చనువుతో నేర్చుకున్న విద్య చాలా స్వల్పము. గారాబం కొద్దీ మిగిలిన శిష్యుల వలె నేను శ్రద్ధ పెట్టేవాడిని కాదు. తండ్రిగారి దగ్గరే ఉంటే గురువులను ఎలా సేవించాలో తెలియదు కదా! తండ్రిగారు తన తనయుడికి కఠినమైన పరీక్షలు పెట్టలేరు.పరీక్షలు లేని విద్య ప్రకాశిస్తుందా? మీ దగ్గర శిష్యునిగా చేరి తెలియనివి నేర్చుకొని నన్ను నేను దిద్దుకోవాలని ఇక్కడికి వచ్చాను! మీరు తరతమ భేదాలు చూపని దయాస్వరూపులు. నన్ను దగ్గరికి తీసికొని విద్యావంతునిగా చేయండి!కృతార్థుడిని అవుతాను!" అని ప్రాధేయపడ్డాడు.


కచుడు చెప్పిన విధానానికి మురిసిపోయిన శుక్రాచార్యుడు ఎటువంటి సందేహాలను మనసులో పెట్టుకోకుండా కచుడిని  శిష్యునిగా తన గురుకులంలో చేర్చుకున్నాడు.//


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments


bottom of page