కచదేవయాని - పార్ట్ 3
- T. V. L. Gayathri
- Aug 6
- 3 min read
Updated: Aug 10
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part -3 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 06/08/2025
కచదేవయాని - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ
దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం బయలుదేరుతాడు. అతన్ని శిష్యుడిగా అంగీకరిస్తాడు శుక్రాచార్యుడు.
ఇక కచదేవయాని పార్ట్ 3 చదవండి.
గురుకులంలో కచుడు ఎంతో జాగ్రత్తగా మసలుకొనేవాడు. గురువైన శుక్రాచార్యునిని తన తండ్రిగారి వలె సేవించేవాడు. అతడు ఆశ్రమంలోని విధివిధానాలను త్వరలోనే ఆకళింపు చేసుకొన్నాడు. వాటిని నియమం తప్పక ఆచరించేవాడు. సుకుమారుడైన కచుడు ఎంత కష్టానికైనా ఓర్చుకొని గురువుగారు చెప్పిన పనులను సమర్థవంతంగా చేసుకొని వచ్చేవాడు. కార్యనిర్వహణలో దక్షత, కష్టసమయంలో సహనము, మాటలలో మృదుత్వము, పనిలో చురుకుదనము, విద్యలో శ్రద్ధ కలిగిన కచుడు త్వరలోనే శుక్రాచార్యునికి ప్రియమైన శిష్యుడైనాడు. ఇటువైపు శుక్రుని కూతురైన దేవయానికి కూడా కచుని సౌందర్యము మోహాన్ని కలుగ చేస్తుంటే, అతడి వ్యక్తిత్వము, మృదుభాషణము ఆమెలో మెల్లమెల్లగా అతడి పట్ల అనురాగాన్ని వికసింపచేస్తున్నాయి.
ఇలా కాలం గడుస్తూ ఉంటే కచుని వ్యవహారశైలి దానవులకు అస్సలు నచ్చటం లేదు. వచ్చిన వాడు శత్రుజాతికి చెందిన వాడు. పైగా బృహస్పతి కుమారుడు. గురువుగారి మీద, ఆయన కూతురి మీద ఏదో మాయో మంత్రమో జల్లి వాళ్ళను వశపరుచుకొన్నాడు.
' వీడిని ఇలా వదిలి వేయకూడదు. శత్రువు కుమారుడు.. వీడి అంతు చూడాల్సిందే!'అనుకున్నారు వాళ్ళు. దేవతల మీద ఆగ్రహంతో రగిలిపోతూ కచుడిని సంహరించాలని పన్నాగం పన్నారు.
ఒకనాడు కచుడు హోమధేనువులను( యజ్ఞానికి కావలసిన పాలను ఇచ్చే ఆవులు) కాస్తూ ఒంటరిగా అడవికి వెళ్ళాడు. ' ఇదే మంచి సమయం!' అనుకుంటూ దానవులు అతడిని వెంబడించి, చుట్టుముట్టి కొట్టటానికి ప్రయత్నించారు. కచుడు శాయశక్తులా వాళ్ళతో యుద్ధం చేశాడు కానీ ఒంటరి వాడు. పైగా నిరాయుధుడు. కొంత సేపటికి అలసిపోయిన కచుడిని దానవులు చంపి, అతడి మృత దేహాన్ని ఒక మద్ది చెట్టుకు కట్టి వెళ్లిపోయారు.
సాయంత్రం అయింది.
కచుడు ఆశ్రమానికి రాలేదు. హోమధేనువులు మాత్రం తిరిగి వచ్చాయి. కచుడు మాత్రం రాలేదు. దేవయానికి కంగారు పుట్టింది. పరుగు పరుగున తండ్రి దగ్గరికి వచ్చింది.
"తండ్రిగారూ!చీకటి పడుతోంది!.. మీ ప్రియశిష్యుడు కచుడు ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదు!.. అతడేదన్నా ఆపదలో చిక్కుకున్నాడేమో! చూడండి!"అంది భయం భయంగా.
దీపం పెట్టుకొని శాస్త్రగ్రంథాలు వ్రాస్తున్న శుక్రాచార్యుడు కూతురు మాటలను తేలిగ్గా తీసికొన్నాడు.
తాళపత్రాల మీద వ్రాసుకుంటూ తల ఎత్తకుండా
"వస్తాడు లేమ్మా!కంగారేమీ లేదు!.. అతడు చిన్న పిల్లవాడు కాదుగా!కాసేపటికి వచ్చేస్తాడులే!"అంటూ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.
ఇంకా దట్టంగా చీకట్లు అలుముకొంటున్నాయి.
దేవయాని భయంతో వాకిట్లోకి, ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది.
కచుడు రాలేదు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments