top of page

కష్టంలో ఓదార్పు

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #కష్టంలోఓదార్పు, #KashtamloOdarpu, #TeluguSpecialArticle


Kashtamlo Odarpu - New Telugu Special Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 29/03/2025

కష్టంలో ఓదార్పు - తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


కొన్ని వరుసగా జరిగే సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. వయసుతో సంబంధం లేదు. కానీ చుట్టుపక్కలవారి ప్రవర్తన భరించలేనిదిగా ఉంటుందని నా స్నేహితురాలు బాధపడి నాతొ చెప్పేరు. 50 -62 - 75 ఇలా వారి వయసులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సునాయాసంగా హాయిగా వెళ్లిపోయారు. నిజానికి హాస్పిటల్ పాలబడి అక్కరలేని ట్రీట్మెంట్ తో నరకం చూసేకన్నా దర్జాగా వెళ్లినందుకు సంతోషించాలి. 


 సరే.. దగ్గిర బంధువులు, తెలిసిన ఇరుగుపొరుగు వారు వచ్చి వెళ్ళేరు. అంతా సద్దుమణిగి, వచ్చిన బంధువులు వెళ్ళేక నేను కలిసాను. 


''హమ్మయ్య ఇప్పుడు నామనసు ప్రశాంతంగావుంది. నిన్నుచూశాక ఈలోకంలోకి వచ్చినట్టు వుంది. '' అంటూ హాగ్ చేసుకుని మామూలు విషయాలు మాటాడింది. 


స్నేహితులకు మనసు తెలుస్తుంది. రాజారామ్ కి కొద్దిపాటి అనారోగ్యం వుంది. బాగానే మానేజ్ చేసుకుంటున్నాడు. ఫుడ్ కంట్రోల్, వాకింగ్, డా. చెప్పినట్టు పాటిస్తూ వాకింగు చేస్తూ పార్కులో నరక తడబడి దగ్గిరలోవున్న బెంచీమీద కూలబడి పోయారు. అంతే.. హాస్పిటల్కి తీసుకేల్లెసరికే నోమోర్ అంట. హాయిగా వెళ్ళిపోయాడు. 


“ఇప్పుడు వీళ్ళని భరించడం కష్టంగా వుంది. ఫ్లాట్ అమ్ముతారా.. అని ఒకరు, పిల్ల దగ్గిరకి అమెరికా వెళ్ళిపోతారా అని ఇంకొకరు, ఒక్కరూ ఉండవద్దు.. మంచిదికాదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. అంటూ ఇంకొకరూ సతాయిస్తున్నారు. ఆచారాలు సాంప్రదాయాలు గుర్తుకు తెచ్చి మరీ వేధిస్తున్నారు. 


నాకూ రాజాకి ఏమి నమ్మకాలు లేవు. బాడీ డొనేట్ చేశాను రాజా కోరికమీద. నన్ను స్థిమితంగా ఉండనీయరు. బయట లాక్చేసి కూర్చున్నాను. ఫోను సైలెంట్ మోడ్లో పెట్టాను.” అంటూ చెప్పింది. 


 నిజమే! ఇలాంటి టైములో బాధితులను ఒంటరిగా విడిచిపెట్టాలి. 


‘వచ్చిన ప్రతివారికి పదిసార్లు జరిగిన విషయాన్ని చెప్పడం చాలా ఇబ్బంది కలుగుతుంది. పదే పదే తలుచుకోడమూ బాధా కరమే. ఇది ఎవరూ అర్ధం చేసుకోరు’ అంటూ మనసువిప్పి చెప్పింది. 


“అందుకే మా కోడలు ‘నాతో వచ్చేసి కొన్నాళ్ళు వుండండి. వీళ్ళబాధ తప్పుతుంది’ అని టికెట్ కొనేసింది. 

ఆరునెలలు వుంటాను అమెరికాలో. తర్వాత పర్వాలేదు” అంటూ బాధను పంచుకుంది. 


ఈ మధ్య చాలామందిలో మార్పు వచ్చింది. అక్కరలేని ఖర్చులు తగ్గించారు. అక్కరలేని సంప్రదాయాలకు ఫుల్ స్టాప్ పెట్టేరు. కానీ కొందరు మారలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏది మాటాడాలి అన్నది తెలుసుకోరు. 


ఇలాంటి కబురు ఎవరో చేరవేయడం.. వచ్చేసి వేధించడం. ఎదుటి మనిషిని బట్టి మాటాడాలి. ఎప్పుడు ఏమి మాటాడాలో అదే మాటాడాలి. వయసు, కారణం కూడా దృష్టిలో వుంచుకోవాలి. 


నా ఫ్రెండ్ చాలా దీర్యవంతురాలు. ఏడుపులు గోల తనకు ఇష్టం ఉండదు. హఠాత్తుగా చిన్న వయసులో ఏ ప్రమాదంలోనో చనిపోతే బాధ ఒకలా ఉంటుంది. అనారోగ్యం వయసు మళ్ళినవారు చనిపోతే సహజముగా తీసుకోవాలి. ఎప్పటికైనా తప్పని స్థితి ఎదురుకోడానికి సిద్ధంగా ఉండాలి. ఎదుటివారు ధైర్యంగా వున్నప్పుడు మరలించే మాటలు చెప్పాలి. 


వచ్చిన వారు బాధపడి ఎదుటివారిని బాధపెట్టేవారు. ఫోనులో ఒకసారి పలకరిస్తే చాలు. ఎలాంటి గాయం ఐనా కొద్దికాలానికి మానుతుంది. ఆటైము ఇస్తే చాలు. మానసికంగా ఇచ్చే ఓదార్పు చాలు. ఏవేవో ఎవరికో జరిగినవి కథలుగా చెప్పి విసిగించకూడదు. సాధ్యమైనంత వరకు ఉపశమనం కలిగించే కబుర్లు చెబుతూ ఆసరా ఇవ్వాలి. అప్పుడప్పుడు ఆరోగ్యం గురించి స్నేహితులను గురించి పిల్లలను గురించి మామూలు విషయాలు చెప్పాలి. అదే ఓదార్పు ధైర్యము కలిగిస్తుంది. 


********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





Comments


bottom of page