మానవసేవే మాధవసేవ
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 17
- 3 min read
#ManavaSeveMadhavaSeva, #మానవసేవేమాధవసేవ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #నీతికథలు

Manava Seve Madhava Seva - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 17/05/2025
మానవసేవే మాధవసేవ - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"భవతీ బిక్షాందేహి "
"చూడమ్మా, సరోజా! గుమ్మం ముందు ఎవరో సాధువు వచ్చారు. గ్లాసుతో బియ్యం వెయ్యి. "
వంటగదిలోంచి తల్లి మాటలు విన్న సరోజ చదువుతున్న క్లాసు పుస్తకం పక్కన పెట్టి బియ్యం దానం చెయ్యడానికి వెళ్లింది.
సాధువుకు బియ్యం దానం చేసి వస్తున్న సరోజకు ఇంటి ఆవరణలో వేపచెట్టు కొమ్మ మీద ఉన్న గూడులోంచి కాకిపిల్ల కింద పడి ' కాకా ' అంటు అరవడం సరోజ చెవిన పడింది. వెంటనే గోడకున్న నిచ్చెన తెచ్చి మెల్లిగా కాకిపిల్లను వేపచెట్టు కొమ్మమీద గూటికి చేర్చింది.
మరొకసారి వీధిన పోయే ఊరకుక్క దాహంతో గుమ్మం ముందు నోరు తెరిచి ఆపసోపాలు పడటం చూసిన సరోజ వెంటనే కూజాలోని చల్లని మంచినీళ్లు ప్లాస్టిక్ గిన్నెలో పోసి కుక్క దాహం తీర్చింది. సరోజ జాలిగుండెను మెచ్చుకుంది అమ్మ.
సరోజ అగ్రహారం గ్రామ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి జంతుప్రేమ దయాగుణం కలది. ఎవరైన బిక్షగాళ్లు వికలాంగులు పాఠశాల దారిలో కనబడితే వీలైన సాయం చేస్తుంటుంది.
వేసంగి శలవులైనందున పట్నంలో తాతగారింటికి వచ్చింది. అక్కడ ఉన్న రోజుల్లో సరోజ జన్మదినం వచ్చింది. తాతయ్య మామయ్యలు ఆశీర్వదించి కొత్త బట్టలు డబ్బులు
కానుకలుగా ఇచ్చారు.
అమ్మమ్మ ఉదయం తలంటి కొత్త బట్టలు తొడిగించింది. సాయంత్రం సరోజను తీసుకుని గుడికి బయలు దేరింది. మామయ్య లిచ్చిన డబ్బులతో బజారులో ఏదైన వస్తువు
కొందామని పర్సులో పెట్టుకుంది సరోజ.
గుడిలో దేవుని దర్సనం చేసుకుని బజారులో వస్తుంటే దారిలో కొందరు పిల్లలు కాషాయ దుస్తులు ధరించి బ్యాండు వాయించుకుంటు ముందుకు సాగుతుంటే ఇద్దరు పిల్లలు
'ప్రేమ సమాజం' పేరున్న బ్యానరు పట్టుకుని నడుస్తుంటే మరికొందరు పిల్లలు సీలు వేసిన డబ్బాలు చేతుల్లో ఉంచుకుని డబ్బు ధర్మం చెయ్యమని పాదచారుల్ని అడుగుతున్నారు.
ప్రేమ సమాజం గురించి తరగతి క్లాసులో టీచరు చెబుతూ "తల్లి తండ్రి బంధువులు లేని అనాథల్ని
ప్రేమ సమాజంలో చేరుస్తారనీ దాతలు ఇచ్చే ధన సహాయంతో వారి పోషణ,
చదువులు సాగుతాయని " టీచర్ చెప్పిన విషయాలు జ్ఞాపకం వచ్చి తప పర్సులో ఉన్న పుట్టిన రోజు డబ్బులు పిల్లల చేతిలో ఉన్న డబ్బాలో వేసింది సరోజ.
ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ద్వారా ఈ విషయం తెలిసి తాతయ్య మామయ్యలు సరోజ దయాగుణాన్ని మెచ్చుకున్నారు.
'మానవ సేవే మాధవసేవ' అని టీచర్ చెప్పిన విషయాన్ని సార్థకం చేసింది సరోజ.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments