top of page
Original.png

మానవుడి మహా ప్రస్థానం

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #ManavudiMahaPrasthanam, #మానవుడిమహాప్రస్థానం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Manavudi Maha Prasthanam - New Telugu Poem Written By - Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 05/12/2025

మానవుడి మహా ప్రస్థానం - తెలుగు కవిత

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య


ఆదిలో.. 

కాలం లేదు! ప్రాణం లేదు!

అంతా శూన్యం, అంతటా నిశబ్దం. 

విశ్వాంతరాళలో ఉన్నపళంగా "ఓం" అంటూ

బ్రహ్మాండమైన మహా విస్ఫోటనం. 

నిమిషంలో అరవయవ వంతు నుంచే కాలం ప్రారంభం. 

గ్రహోపగ్రహాలు అవతరణ

భూమి పుట్టుక

భూమిపై అనంత జలరాశి

జలంపై తేలియాడుతూ నారాయణుడు

నారాయణుడి నడిబొడ్డు నుంచి బ్రహ్మ ఆవిర్భావం

సకల సృష్టికి నారాయణుడి నుంచి బ్రహ్మకు ఆజ్ఞ

ఎనుబది నాలుగు లక్షల జీవజాలం బ్రహ్మ సృష్టి

అందు మానవుడి సృష్టి పరమ విశిష్టం

సమిష్టి జీవనం పరమావశ్యంగా సాగిన కాలం

సమిష్టి ఆహార సముపార్జన, సమాన పంపకం

ఆకలిజబ్బు అన్నిటికన్నా మిన్నగా భావించిన సమయం

ఆహారం ఆకలిమంట ఆర్పే ఔషదంగా గుర్తించిన జ్ఞానం

అన్నదానం మహాదానంగా తలంచిన తరుణం

ఆకలి తీర్చే అన్నంపై భక్తిభావం

ఆ సమయాన్నే మానవుడి తొలి సిద్ధాంతం ఉత్పన్నం

" అన్నం పరబ్రహ్మం "

ఆహారం మానవుడి మొదటి దైవరూపం

***

ఆపై అనంతంగా సాగిన కాల ప్రయాణం. 

వరుణుడి వృష్టి ఘాతాలు, ఉధృత ఉప్పెనలు

భయానక భూకంపాలు, రోగపీడనలు

భీకర వడగాడ్పులు.. 

ప్రాకృత శక్తుల విజృంభణ

వణికిపోయిన జీవజాలం. 


పదును పెట్టసాగాడు మానవుడు తన మేధస్సును. 

యుక్తిమంతుడైనాడు ప్రాకృత శక్తుల నుంచి రక్షణకు. 

సురక్షిత గృహనిర్మాతై, రోగి పీడనలు ఎదుర్కునే రక్షణా కవచంగా నిర్మించుకున్నాడు ఆయుర్వేదాన్ని. 

ఆహార కొరతను అధిగమించేందుకు మార్చుకున్నాడు మైదానాలను పంట పొలాలుగా. 

సాధు జంతువులను మచ్చిక చేసుకొని సోపానాలుగా మార్చుకున్నాడు తన సుఖమయం జీవనానికి. 


ఆహారాన్ని అందించే భూమి

వెలుగునిచ్చి అవసరాలను తీర్చే అగ్ని

ప్రాణవాయువులను ప్రసాదించే గాలి

వర్షించే ఆకాశం, దాహం తీర్చే నీరు

ప్రణమిల్లాడు పంచభూలపై గౌరవం భక్తిగా మారి. 


జీవితమంతా పాలిచ్చే ఆవు గోమాతై అగ్రపీఠం అధిష్టించింది మానవుడి కృతజ్ఞత అందుకోవడంలో. 

మానవుడి కష్టనష్టాలలో పాలు పంచుకొని పూజలందుకుంది ఎద్దు బసవదేవుడై. 

ఉన్నత శిఖరాలకు ఎదిగిన మానవుడు ప్రజ్ఞతో వికసించి

" ప్రజ్ఞానం బ్రహ్మ"

అంటూ నినదించాడు తన మలి సిద్ధాంతాన్ని

***

ఆ తదుపరి మానవుడు అంతర్ముఖుడై అవిశ్రాంత ఆలోచనా నిమగ్నుడైనాడు. 

భగవంతుడు తనను తాను సృజించుకొని విశ్వమూ సమస్త వస్తు జీవజాలంగా ప్రభవించాడని తలచాడు. 

అఖిల జీవ, వస్తు సముదాయంలో అంతర్యామిగా పరబ్రహ్మ ప్రయాణిస్తూన్నాడని గుర్తించాడు

సర్వాత్మలు పరమాత్మ శకలాలేనని భావించాడు. 

పరమాత్మ నుంచి ఆత్మగా ఆవిర్భవించిన తాను పరమాత్మనేనని తలంచాడు


దేహమే దేవాలయంగా

మానవుడే మాధవుడుగా

నరుడే నారాయణుడుగా

అంతర్ముఖుడైన మానవుడి ఆలోచనా ఫలం

జన్మల పరంపర కాలపరిమితి ముగియగానే ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని

ఆత్మకు దేహం చోక్కా లాంటిదని

చొక్కా చినిగి చితికి పోయినప్పుడు

ఆత్మ చోక్కా లాంటి మరో దేహాన్ని ధరిస్తుందని మానవుడి తఫో కారణంగా లభించిన స్థిరనిర్ణయం. 


ఆ తరుణము నందే ఎలుగెత్తి చాటాడు

మానవుడు తన తుది సిద్ధాంతాన్ని

" ఆహాం మేవ బ్రహ్మ "

అంటూ అంకురించింది అంతిమ సిద్ధాంతం

తొలి మలి తుది సిద్ధాంతాల పరమార్థమే

భారతీయుడి జీవన మహా ప్రస్థానం. 

***


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page