top of page

పట్టిందల్లా బంగారం కాదు

#PattindallaBangaramKadu, #పట్టిందల్లాబంగారంకాదు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Pattindalla Bangaram Kadu - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 13/05/2025

పట్టిందల్లా బంగారం కాదు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


ఇద్దరు కేటుగాళ్లు పేపర్లో పది గ్రాముల బంగారం ధర లక్ష  దాటిందని  చదివి చంకలు గుద్దుకున్నారు. దేవుడా, చేతినిండా పని తగిలేలా బేరం కుదుర్చు. చాల  రోజులైంది చేతికి  పెద్ద బేరం  తగిలి. ఈరోజైనా పెద్ద బేరం తగిలితే గోవా చెక్కెయ్యొచ్చన్న ఊహలతో

ప్రయత్నిస్తుంటే:


బంగారు నగల  పాన్ బజార్  రోడ్డు  పైన  ఒక  పెద్దాయన లుంగీ చుట్టుకుని  "చమత్కార్  బంగారు నగల నిలయం"  రున్న  తళతళ  మెరిసే  చేతి సంచితో  నిలబడి ఏదైన  వాహనం  వస్తుందేమోనని  ఎదురు చూస్తున్నాడు.


ఆయన చేతిలోని  చేతి సంచి మీద  కన్నేసిన ఇద్దరు కేటుగాళ్లు  సైగలతో బుల్లెట్  మోటర్ సైకిల్

పైన  డ్రైవింంగ్  చేసే  యువకుడు  ముఖానికి  మంకీ కేపు,  వెనక కూర్చున్న  కుర్రాడు  మొహానికి  చేతి రుమాలు  చుట్టుకుని  మెల్లగా  పెద్దాయన  దగ్గరకు వచ్చి  చేతిలోని  బంగారు నగల పేరున్న సంచిని లాక్కుని  బండిని  స్పీడ్  పట్టించారు.


ఆ పెద్దాయన 'నా బేగ్  బేగ్ ' అంటూ అరవసాగేడు.


చమత్కార్  బంగారు నగల  బేగుతో  పారిపోయిన కేటుగాళ్లు  ఈరోజు మంచి భలే సరుకు చేతికి చిక్కిందని ఆనందంతో  ఒక నిర్జన  ప్రదేశంలో  మోటర్  బైక్  ఆపి చేతిసంచిని  విడదీసి  బంగారు నగల  కోసం  చూస్తే కిడ్నీ పేషెంటు  డైయాలిస్  చేయించుకున్న  సగం మూత్రం 

 నిండిన  యూరిన్ బేగ్  చేతికి తగిలింది.


మూత్రం కంపు  అంటూ 'పట్టిందల్లా బంగరం కాదురా, బాబూ ' అంటూ చేతులు కడుక్కోడానికి నీళ్ల కోసం పరుగులు తీసారు  ఆ అమాయకులు.

           😆        🤔           🤣          😀

      

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page