top of page
Original.png

శ్రీవారూ… ఆపండి మీ గోల

#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #SrivaruApandiMeeGola, #శ్రీవారూఆపండిమీగోల, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Srivaru Apandi Mee Gola - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham Published In manatelugukathalu.com On 08/12/2025

శ్రీవారూ ఆపండి మీ గోల - తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

శృంగవరపుకోట బస్ స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది. వారం లేదు వర్జ్యం లేదు, రాత్రి లేదు పగలు లేదు, నిత్యం బస్సులన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి.


ఇంతలో విశాఖకు వెళ్ళే బస్సు, బస్ స్టేషన్ లోకి రాగానే, అది పాయింట్‌లో పెట్టక మునుపే సీట్లకోసం జనాలు పరుగులు తీశారు. కండక్టర్ చెప్పినా వినిపించుకోలేదు. 


బస్సు దిగేవారికి కూడా చోటివ్వకుండా లోపలికి తోసుకు వెళ్తున్నారు. కొంతమంది బయటినుంచే సీట్లలో రుమాళ్ళు, సంచులు పెడుతున్నారు.


తీరా పద్మవ్యూహాన్ని చేధించుకుని బస్సులోకి వెళ్ళేసరికి, రుమాలు వేసిన సీట్లో మరొకరు కూర్చుని ఉండడంతో అసలు కథ మొదలైంది.


'నేను ముందు రుమాలు వేశాను!' అంటే 'నేను వేశాను!' అని వాదించుకుంటూ, 'సిగలుంటే పొగలే' అన్న నానుడిని నిజం చేస్తూ, కదనరంగాన్ని తలపించారు మహిళా ప్రయాణీకులు.


కాసేపటికి కండక్టర్ వచ్చాడు. “అమ్మా, కొంచెం లోపలికి సర్దుకోండి. ఫుట్ బోర్డు మీద చాలామంది ఉన్నారు!” అని కేక వేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. నెమ్మదిగా ఆడవాళ్లను తప్పించుకుని వెనక్కి వెళ్ళాడు.


“మీ ఆధార్ కార్డులు తీసి పట్టుకోండి!” అని గట్టిగా అరిచి చెప్పాడు.


ఒకామె చేతిలో ఉన్న కార్డు తీసుకుని, “ఈ ఫోటో ఎవరిదమ్మా?” అని అడిగాడు కండక్టర్.

“నాదేనండి.”

“ఎప్పటిదమ్మా ఈ ఫోటో?”

“నా చిన్నప్పటిది.”

“పనికి రాదు. అప్‌డేట్ చేయించుకో, లేదా టిక్కెట్టు తీసుకో!” అన్నాడు కండక్టర్.


“ఆ మాట చెప్పడానికి నువ్వెవరివి? ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా, నచ్చిన చోటికి నచ్చినప్పుడు వెళ్లమని ఉచిత బస్సు పథకం పెట్టింది. నీకు నచ్చితే టికెట్ ఇవ్వు, లేకుంటే మానెయ్!” ఖరాఖండిగా అంది ఆ మహిళా మణి.


చేసేదేమీ లేక, టికెట్ ఇచ్చి పక్కకు తిరిగి “టికెట్! టికెట్!” అని అరిచాడు కండక్టర్.


“హలో వదినా, బాగున్నావా? 

“బాగున్నాను. ఏమిటి సంగతులు చెప్పు” అని అవతలి వ్యక్తి నుంచి ప్రశ్న


“ఏమి చెప్పమంటావు? ఊసుపోక మా తోటికోడల్ని చూసి వద్దామని కొత్తవలస వెళ్తున్నాను” అని చెప్పింది ఫోన్లో అవతలి వ్యక్తికి.


“అమ్మా, ఎన్నిసార్లు పిలవాలి? ఫోన్‌లో మునిగిపోయావు. టిక్కెట్టు కొట్టకపోతే బస్సు కదలదు!” అన్నాడు కండక్టర్ విసుగ్గా.



“కదలకపోతే ఇక్కడే ఉండనీవయ్యా బాబూ, ఇప్పుడే సిగ్నల్ కలిసింది. మళ్లీ కలవకపోతే మాట్లాడటం అవ్వదు. మా వదినతో మాట్లాడి ఆరు నెలలు అయ్యింది!” అంది ఆమె చిరాగ్గా మొహం పెట్టి.


“ఇన్నాళ్లూ ఎందుకు మాట్లాడలేకపోయావ్? మాట్లాడుకోవచ్చు కదా!” అన్నాడు కండక్టర్.


“వదినా, లైన్‌లో ఉండు!” అని చెప్పి ఫోన్ కాస్త పక్కకు పెట్టి,


“నిన్నేమో మా చెల్లి గారి కుక్కకి ఒంట్లో బాగోలేదని చూడడానికి పెందుర్తి వెళ్ళాను. ఈ రోజు కాశీపట్నం వంకాయలు చాలా రుచిగా ఉంటాయని ఒక కేజీ వంకాయలు కొనడానికి విశాఖపట్నం నుంచి కాశీపట్నం వెళ్లాను. ఇలాగే రోజు ఏదో పని మీద తిరగుతున్నాను. ఇక ఖాళీ ఎక్కడ?” అని కండక్టర్‌తో చెప్పింది గొప్పగా.


ఆమె మాటలకు “ఓరి నాయనోయ్!” అని ఉలిక్కిపడి విశాఖపట్నానికి టికెట్ ఇచ్చి పక్కకు జరిగాడు కండక్టర్.


అక్కడ సీటుకోసం యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

“అమ్మలారా! మీరు బస్సు దిగి తగువులాడుకోండి. అంతేగాని, ఇలా బస్సులో గుద్దులాడుకుంటే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది!” అన్నాడు కండక్టర్.


“ఇది నీ సొంత బస్సు కాదు చెప్పడానికి. దానికి ఉన్న గొప్పతనం ఏంటి? నేను వేసుకున్న సీట్లో ఎలా కూర్చుంది!” అని ఒకరినొకరు తోసుకుంటూ కండక్టర్ మీద పడ్డారు.


ఆ తోపుకు ఊపు కాచుకోలేక, “అమ్మోయ్! నాయనోయ్” అంటూ నేరుగా వెళ్లి వెనక సీట్లో పడ్డాడు కండక్టర్.


ఒక్క ఉదుటన కండక్టర్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. పక్కనే ఉన్న భార్య మొహం చూస్తూ అలా ఉండిపోయాడు.


“ఏమైందండీ! అంతలా చెమటలు పట్టాయి?. టికెట్ కోసం ఆ అరుపులేంటి? కలవరింత లేమిటి? అని గాబరా పడుతూ అడిగింది.


కండక్టర్ తల పట్టుకుని, గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “ఆ... ఆ ఫ్రీ బస్సు, ఆ మహిళల గోలలో... నేను కాబట్టి నెగ్గుకు రాగలిగాను. ఇదే మరొకరైతేనా... బస్సెక్కకుండానే సన్యాసం తీసుకునేవారు!” అన్నాడు.


“మీరు రిటైర్ అయి ఆరు నెలలు అయ్యింది, మర్చిపోయారా మహానుభావా? ఇంకా కలవరిస్తున్నారు!” అంది భార్య నవ్వుతూ.


కలయా…నిజమా అని లోచిస్తూ కూచున్నాడు కండక్టర్.


***

పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 400,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page