top of page
Original.png

త్యాగమూర్తి

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #త్యాగమూర్తి, #మమతనుపంచుదాం

ree

గాయత్రి గారి కవితలు పార్ట్ 52

Thyagamurthi - Gayathri Gari Kavithalu Part 52 - New Telugu Poems Written By T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 23/12/2025

త్యాగమూర్తి - గాయత్రి గారి కవితలు పార్ట్ 52 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


త్యాగమూర్తి

(వచన కవిత)

**********************************

అమ్మ ప్రేమయే సృష్టిలో నపురూపమైనది.

అమ్మ దేవత వోలె నిట తిరుగాడు చున్నది. 


జగతికి దీపమై దివ్య పథమును చూపిస్తుంది.

అగణితమైన ననురాగమును తా కురిపిస్తుంది.


సకల జీవరాశుల్లో మాతృమూర్తి నిలిచియుంది.

ప్రకృతి రూపమై ప్రపంచాన్ని కాపాడుకొంటుంది.


ప్రేగును త్రెంపి బిడ్డలకు తన ప్రాణాలనందిస్తుంది.

త్యాగమూర్తి తన యూపిరిని క్షీరంగా మార్చుతుంది.


తొలి గురువుగా మారి పిల్లలకు చదువు చెబుతుంది.

కలతల్లో కష్టాల్లో తోడుగా నిలబడి ధైర్యాన్నిస్తుంది.


దైవమా తల్లి ప్రేమను పొందగా ధరలో జన్మించాడు.

దేవత వంటి తల్లిని  బిడ్డలు ప్రేమగా చూచుకోవాలి.


వృద్దాప్యంలో యున్న తల్లిదండ్రులను ప్రేమించాలి.

బుద్ధిమంతులై తనయులు పెద్దలను సేవించాలి.


తల్లిదండ్రుల ఋణమును తీర్చుట తనయుల ధర్మం.

చల్లగా నా పావన మూర్తుల సేవలో తరించితే పుణ్యం.//


************************************


ree
















మమతను పంచుదాం!

(వచన కవిత)

************************************

అమ్మ అత్తా ఒకటేనా? కాదు కూడదంటుంది మన సమాజం.

కొమ్మ కొమ్మకు మధ్యలో గొడవలే ఉంటాయంటుందీ సంఘం.


తన కొడుకును కొంగున కట్టుకుందని తగని మంట పుడుతుంటే.

తన వంటింటి సామ్రాజ్యాన్ని తన కోడలే కైవసం చేసుకుంటుంటే.


అత్తమ్మ  చిన్నపిల్లపై అధికారాన్ని చలాయించాలనుకుంటుంటే.

చెత్తసీరియళ్ళను చూస్తూ చిత్రమైన తగాదాలు పెట్టుకుంటుంటే.


అహంకారంతో కోడలు తమ అత్తమ్మని హింసల పాలుచేస్తుంటే.

దహియించే బాధతో తమ వాళ్లంతా దుఃఖములో మున్గిపోతుంటే.


శాంతిమృగ్యమైన గృహములే సమర క్షేత్రాలను తలపిస్తుంటాయి.

కాంతి తరిగిన జీవితాలు కటిక చీకటిలో కలిసి కరిగి పోతుంటాయి.


ప్రేమను పంచ గలిగితే చాలు మనలో విడిపోని బంధమేర్పడుతుంది.

ధీమణులైన మహిళలు తాము దిగుళ్లను మరచి దిక్కులను గెలుస్తారు.


కొంత సంయమనంతో  వనితలు కూర్మితో కార్యములు చేయగలగాలి!

వింత విషయం కాదమ్మా!ప్రీతితో కుటుంబసభ్యులను చూసుకోవాలి!


కలసి యుంటే కలదు సుఖంబనుచు కాంతలు ధిషణతో శోచించాలి!

కలతలు పడరాదంచు భామినులు కలకాలమనురాగంతో చరించాలి!


తమ బిడ్డల్ని చక్కగా పెంచుకుంటూ చక్కని చదువులు నేర్పించాలి!

మమతను పంచుతూ మహికి యాదర్శమై చరితలో నిలిచి పోవాలి!//

**********************



ree

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:

నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page