ఆడపిల్ల కాదు – ఇంటికి వెలుగు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 23
- 3 min read
#AdapillaKaduIntikiVelugu, #ఆడపిల్లకాదుఇంటికివెలుగు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #మహిళాసాధికారత, #పిల్లలకథలు, #TeluguChildrenStories, #బాలలస్ఫూర్తికథ

Adapilla Kadu Intiki Velugu - New Telugu Story Wtten By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 23/05/2025
ఆడపిల్ల కాదు – ఇంటికి వెలుగు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
అక్షరాస్యతలో వెనుకబడిన వెంకటాపురంలో కిష్టయ్య-నర్సమ్మల ఏకైక పుత్రిక వనజ. పక్క గ్రామంలోని హైస్కూల్లో పదవ తరగతి చదువుతోంది.
వనజ గ్రామీణ వాతావరణంలో పెరిగినా తెలివైన పిల్ల. చదువంటే శ్రద్ధ ఎక్కువ. ఏదైనా ఒకసారి చూసినా, విన్నా ఇట్టే పట్టేస్తుంది. అందువల్ల పాఠశాల ఉపాధ్యాయులు వనజను ప్రత్యేక శ్రద్ధతో చూస్తుంటారు.
వనజ చదువులోనే కాదు, ఆటపాటలతో పాటు పర్యావరణం పట్ల మక్కువ చూపుతుంది. ఆకాశవాణిలో వచ్చే ‘రైతే రాజు’ కార్యక్రమాలు శ్రద్ధగా విని నాయనతో పాటు మిగతా రైతులకు వ్యవసాయ పద్ధతులు, మెళకువలు తెలియజేస్తుంటుంది.
పర్యావరణం గురించి ఊరిలో అందరికీ తెలియజేసి, ఇంటి పరిసరాలు, పొలం గట్లంట మొక్కలు, ఫలవృక్షాలు నాటించేది. అందువల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, జంతు, పక్షులకు నివాసం, ఆహారం దొరుకుతోంది. నీటిని వృథా కాకుండా జలవనరులు కల్పించి భూగర్భ జలాలను కాపాడుతోంది. అడవులు, కొండలు నశిస్తే భూతాపం పెరిగి వర్షాలు పడక పంటల నష్టం జరుగుతుందని, రసాయనాలతో కాకుండా సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల ఆరోగ్యంతో పాటు రోగాల నుండి కాపాడుకోవచ్చని తెలియజేసేది. ప్లాస్టిక్ వాడకం వల్ల భూగర్భ జలాల కలుషితం, పశుపక్ష్యాదులకు ప్రాణహాని, పర్యావరణానికి హాని జరుగుతుందని వివరించి చెప్పేది. మద్యపానం, ధూమపానం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జనాలకు నచ్చ చెప్పేది. ఇంటి పరిసరాల శుభ్రత, శరీర ఆరోగ్యంతో పాటు చిరుధాన్యాల ఉపయోగంతో పోషక ఆహారం లభించి, రోజువారీ పనులు ఉత్సాహంగా చేసుకోవచ్చని తెలియజేసింది వనజ.
మూఢనమ్మకాలు, అక్షరజ్ఞానం లేని ఊరిలో ఆడపిల్లైనా తాను ఉన్నత పాఠశాలలో చదువుతూ మిగతా పిల్లలను పాఠశాల వైపుగా మళ్లించింది.
ప్రశాంతంగా వెంకటాపురం గ్రామంలో రోజులు గడుస్తుండగా, అనుకోకుండా వాతావరణ మార్పులతో వర్షాలు కురవక ఊరిలో తాగునీటికీ, పంటలకూ నీరు అందక ప్రజలతో పాటు మూగజీవాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
కిష్టయ్య కుటుంబంతో పాటు గ్రామంలోని రైతులు, కూలీజనం, చేతివృత్తులవారు ఆర్థిక కష్టాలు పడుతున్నారు. వెనుకబడిన ప్రాంతమైనందున ప్రభుత్వ సహకారం సక్రమంగా అందటం లేదు. బ్రతుకుతెరువు కోసం కొందరు గ్రామం వదిలి పట్నం వైపు పోవడానికి ఆలోచిస్తున్నారు.
ఇలా ఉండగా వనజ చదువుతున్న ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు రావడం, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. కార్యక్రమం చివరలో ప్రధానోపాధ్యాయుడి సహకారంతో వనజ, జిల్లా కలెక్టర్ గారిని కలిసి తమ గ్రామ దుస్థితిని వివరించి చెప్పగా, ఆయన వెంటనే స్పందించి తన ఆంతరంగిక ఉద్యోగి ద్వారా విషయాలు సేకరించి వెంకటాపురం గ్రామ ప్రజల కష్టాలు పరిష్కరించారు.
ఆడపిల్లైనా సాహసంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా తమ కష్టాలను తీర్చిన వనజను చూసి ఊరి ప్రజలతో పాటు కిష్టయ్య దంపతులు ఆనందంతో మురిసిపోయారు. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో గుర్తించారు అందరు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments