top of page

అఖిల భారత గార్దభ సమ్మేళనం 

#AkhilaBharathaGardhabhaSammelanam, #అఖిలభారతగార్దభసమ్మేళనం, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 11

Akhila Bharatha Gardhabha Sammelanam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 03/07/2025

అఖిల భారత గార్దభ సమ్మేళనం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


దేశ రాజధాని డిల్లీ ప్రగతి మైదానంలో ' అఖిల భారత గార్దభ సమ్మేళనం' అత్యవసరంగా జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల గార్దభ సంక్షేమ సంఘాల ప్రతినిధులు హాజరయాయి. 


యజమానుల వల్ల కలుగుతున్న కష్టాలు, ఆహార వసతి

సదుపాయాలు ప్రాంతాల వారీగా చర్చకు వచ్చాయి. పనివేళలు కేటాయించే విశ్రాంతి సమయం చర్చించడమైంది. మానవ సమాజంలో కొంతమంది మిగతా జంతువులతో పోలుస్తూ గాడిద జాతిని అవహేళనగా 

చూపడం, మాట్లాడటం, ముఖ్యంగా బాల సాహిత్యంలో వ్యంగ్యంగా కథలు రాయడం, వ్యంగ్య చిత్రాలు గీయడం చేస్తున్నారని చాలా రాష్ట్రాల గార్దభ ప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. 


అంతర్జాల గూగుల్ ఫేస్బుక్ యుట్యూబ్ మాధ్యమాల ద్వారా సర్వే చేసి ఏఏ రాష్ట్రాల్లో గాడిదల పట్ల చిన్న చూపు చూస్తున్నదీ తెలుసు కోవడమైంది. 


జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ వైష్ణవదేవి మందిరం వద్ద, బదరీనాథ్ మందిరం వద్ద, ఉత్తరఖండ్ చార్ ధామ్ యాత్రల సమయంలో కలుగుతున్న కష్టాలు, దక్షిణాదిన తమిళనాడులోని నీలగిరి, కర్ణాటక లో కూర్గు, తెలుగు

రాష్ట్రాల రజక సంఘాల గాడిద ప్రతినిధులు నుంచి ప్రస్థావనలు వచ్చాయి. 


బీహార్ రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మట్టి పనులు ఇటుక ఇసుక పనుల్లో యజమానుల శ్రమదోపిడి జరుగుతున్న దౌర్జన్యాలు సమావేశంలో ప్రస్తావించడమైంది. 


గూగుల్ మ్యాపుల్లో ఏఏ రాష్ట్రాల్లో ఏఏ పత్రికల్లో ఏఏ భాషల్లో

ఏఏ రచయితల ద్వారా గాడిద జాతికి అప్రదిష్ట జరుగుతున్నదీ ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కొచ్చింది. అందరూ ముక్త కంఠంలో ఆయా  ప్రాంతాల కెళ్లి తమ మనోభావాల్ని వ్యక్తపరిచి నిరసనలు తెలియచేయాలని 

నిశ్చయించాయి. తేదీ, నెల, సమయం, ప్రాంతం వివరాలతో ఎజెండా తయారైంది. 


ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుంపులు గుంపులుగా రంగుల గార్దభాలు దక్షిణాదికి బయలు దేరాయి. రోడ్ల పక్కన క్రమశిక్షణతో మందలుగా వస్తున్న గార్దభాలను చూసిన జనం ఎవరో సంతలకీ లేబర్ పనులకు తీసుకెళ్తున్నా రనుకున్నారు. 


గార్దభాలు కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా క్రమశిక్షణ తో తమ ప్రయాణం సాగిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల గార్దభాలు గూగుల్ మ్యాప్ సహాయంతో దారి

తెలుసుకుంటూ దక్షణాది వైపు బయలు దేరాయి. 


తెలుగు రాష్ట్రం తెలంగాణ హైదరాబాదు రింగ్ రోడ్డు ద్వారా శంషాబాద్ విమానాశ్రయ మైదాన ప్రాంతానికి చేరుకున్నాయి. దక్షిణాది రాష్ట్ర గార్దభ ప్రతినిధులు పరేడ్ మైదానంలో బైఠాయించాయి. 


హైదరాబాద్లో ఉంటున్న తెలుగు బాల సాహిత్య రచయిత కందర్ప మూర్తి గార్దభాల మీద తరచు వ్యంగ్య రచనలు చేసి పత్రికలకు పంపి అవహేళన చేస్తున్నాడని ఆయనకి తమ నిరసన తెలియచేయాలని బయలుదేరి రాగా ఆయన స్వగ్రామం అగ్రహారంలో ఉన్నట్టు తెల్సింది. 


భారత రక్షణ దళంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మూర్తి పుట్టి పెరిగిన అగ్రహారం గ్రామంలో జన్మభూమి అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 


హైదరాబాద్ చేరిన గార్దభ మందలు గూగుల్ మ్యాప్ సహాయంతో అగ్రహార గ్రామాన్ని చుట్టిముట్టి గార్దభ రాగాలాపనతో తమ నిరసన తెలియ చేస్తున్నాయి. 


గాడిదల అరుపుల గోలతో ఊరి ప్రజల చెవులు చిల్లులు పడు

తున్నాయి. ఇన్ని రకాల గాడిదలు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయో జనానికి అర్థం కాలేదు. 


కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని దక్షిణాది గాడిదలు ఉత్తరాది గాడిదలు తిరిగి గార్దభ రాగాలాపన మొదలవుతోంది. 


గ్రామ ప్రజలు విసుగెత్తి పోయారు. ఊరి సర్పంచి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వచ్చినా ఏమీ చేయలేక పోయారు. 


అఖిల భారత గాడిదల గోల గురించి తెలుగు బాల సాహిత్య రచయిత మూర్తి గారికి తెలిసి ప్రాంతీయ పశు వైధ్యాధికారికి సమాచారం అందించారు. 


పశువైధ్యాధికారికి అన్ని జంతువుల భాష మీద అవగాహన పరిజ్ఞానం ఉంది. 

ఆయన అగ్రహార గ్రామం చేరుకుని పరిస్థితిని అర్థం చేసుకుని గాడిదల సమూహానికి నాయకత్వం వహించిన గధాసింగ్ తో వారి నిరసనకు కారణ మడిగారు. 


అన్ని జాతుల గాడిదలు ముక్త కంఠంతో మూర్తి గారు గాడిద జాతిని వాటి మనోబిస్టాన్ని అవమాన పరిచే రచనలు చేస్తున్నారని, ఇకముందు అలా పిచ్చి రాతలు రాయకూడదనీ, తమందరికీ బహిరంగ క్షమాపణ

చేప్పాలనీ డిమాండు చేసాయి. 


పరిస్థితులు చక్క పరచడానికి మూర్తి గాడిద సమూహానికి క్షమాపణ చెప్పగా అవి శాంతించి మరో ప్రాంతానికి కదిలిపోయాయి. గ్రామ ప్రజలు హాయిగా గాలి పీల్చుకున్నారు. 

 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page