top of page

గురువు గారి హితబోధ

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #గురువుగారిహితబోధ, #GuruvuGariHithabodha, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Guruvu Gari Hithabodha - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 20/08/2025

గురువు గారి హితబోధ - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

నీలకంఠేశ్వర రావు మెయిన్ రోడ్డు మీద నడుచు కుంటూ వెళ్తున్నాడు. అలా అలా నెమ్మదిగా నడుచు కుంటూ వెళ్లి ఆ పక్కనే ఉన్న పార్కు లోపల సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు.


అక్కడికి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు అతని శిష్యుడు సంధ్యావందనరావు. సంధ్యావందనరావుకి 45 సంవత్సరాలు ఉంటాయి. అతని గురువు గారి కన్నా పది సంవత్సరములు తక్కువ అన్నమాట. 


కాస్త బాధపడుతూ గురువుగారి పక్కనే కూర్చుని ఇలా అన్నాడు.. 


''గురువుగారు.. మా అబ్బాయి డిగ్రీ పూర్తిచేసినా.. నన్ను, వాళ్ళ అమ్మను ప్రేమగా పలకరించడు. చాలా కష్టపడి రోజుకు ఒక్కసారి ఏదో మొహమాటంగా మాట్లాడినట్లు మాట్లాడుతాడు. ఇప్పటి రోజుల్లో ప్రేమాభిమానాలు, పలకరింపులు మరీ అంత దారుణం అయిపోతున్నాయి ఏమిటి గురువుగారు. నాకు మా ఆవిడకు వాడి విషయంలో చాలా భయంగానూ చిరాకు గాను కూడా ఉంది. గట్టిగా మాట్లాడితే ఏడుస్తాడు లేదా భోజనం మానేసి అలిగి పడుకుంటాడు. 


24 ఏళ్లు దగ్గర పడుతున్నాయి. రెండు మూడు ఏళ్లు పోతే పెళ్లి కూడా చేసేయాలి.. అనుకొంటున్నాం. ఎందు కంటే దగ్గర సంబంధం ఉంది. వాడి ధోరణి మారాలంటే ఎలా గురువుగారు.. కాస్త వివరంగా చెప్పండి” అంటూ కూర్చున్నాడు. మొఖం ఓడిపోయి వడలిపోయినట్లు ఉంది అతనికి. 


నీలకంఠేశ్వరరావు శిష్యుడికి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.. 


''ఒరేయ్.. సంధ్యావందనరావు. ఇది నీ ఒక్కడి సమస్య కాదురా. నేటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనిషిని మరొక మనిషి పలకరించుకోవడంలో.. పిలుచుకోవడం లో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. అది కుటుంబ వాతావరణంలో కావచ్చు, బంధువర్గం లో కావచ్చు, విద్యార్థి దశలో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, స్నేహ వాతావరణం లో కావచ్చు.. చివరికి ఇరుగు పొరుగు బంధాల్లో కావచ్చు. ఒక మనిషిని మరోమనిషి ప్రేమగా పిలుచు కోవటం.. పలకరించుకోవడంలో పెను మార్పు లు రావడానికి ముఖ్య కారణం ఆర్థిక సంబంధాలు.. అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 


దీని గురించి చాలా గ్రంథం ఉంది కానీ ఒక పాఠం లాగా చెప్తాను విని అర్థం చేసుకో మరి.. 


అయితే.. పూర్వ కాలంలో అంటే 50 సంవత్సరాల క్రితం మనుషులు ఇప్పటికే ఉన్నారు కదా.. వాళ్ళు మనకు చెప్తుంటారు.. అప్పుడు ఆ పల్లె వాతావరణం లో ఆ ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు కథలు కథలు గా చెప్తుంటారు. అప్పుడు కూడా ధనవర్గం పేద వర్గం ఉండేవి. ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమాభిమా నాలు, అనురాగం, ఆప్యాయతలు ఇప్పటిలా కృత్రిమంగా ఉండేవి కావట. 


మా తాతగారు ఏమని చెప్తుండేవారు అంటే.. అప్పుడు ఆయన వారి తమ్ముడు ఇంటికి అంటే మా చిన్నతాత గారి ఇంటికి వెళితే మా చిన్న తాతగారు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా మా తాతగారు మళ్లీ తన ఇంటికి తిరిగి వచ్చేవరకు కూడా కూడా ఉంటూ రక రకాలు పదార్థాలు వండించి పెడుతూ ఊరంతా తిప్పి ఆ పొలాలు, గుడి గోపురాలు, అందమైన మండవా లోగిళ్ళు, అన్నీ ఆనందంగా చూపిస్తూ రచ్చబండ దగ్గర కూర్చున్న ఊరి పెద్దల దగ్గరకు తీసుకువెళ్లి మా తాత గారిని అందరితో మాట్లాడిస్తూ చాలా ఆనందంగా గడిపేవారట. మా చిన్నతాత గారికి ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికంగా వదిలి పెట్టేసే వారట. ప్రాణం ఇచ్చినంత ప్రేమగా ఉండేవారట. మా తాతగారు కూడా ఆయన్ని వదిలి మళ్లీ తిరిగి ఇంటికి రాలేకపోయేవారట. ఈ విషయం చెప్తుంటేనే ఎంత ఆనందంగా ఉందో చూడండి. షడ్రుచుల విందు భోజనం చేసినంత మధురంగా ఉంది కదూ. 


ఇక ఇప్పటి పరిస్థితిని అప్పటి విధానంతో సరిపోల్చి ఆలోచించుకోగలమా. ఇంటికి ఎంత ఆప్తులు వచ్చినా వాళ్లు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసే రోజులు దాపురించాయి. మానవతా విలువలు ఎంత దిగజారి పోయాయో.. దెబ్బతిన్నాయో ఆలోచించండి. ఇంటికి వచ్చిన ఆప్తులను 'మీరు తిరుగు ప్రయాణానికి ఏ ట్రైన్ బుక్ చేసుకున్నారు. ' అని అడిగే జోకులు ఎక్కువ అయిపోయాయి. పిలుపులు పలకరింపులు ఇలా అడుగంటిపోతుంటే సమాజం తూర్పు నుండి పడ మరకు వెళుతున్నట్టా పడమర నుండి తూర్పుకు వస్తు న్నట్టా?? 


ఇంకొంతకాలం పోతే.. సాయంత్రం 'మేము మీ ఇంటికి చూడడానికి వస్తున్నాము' అని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ‘ఇప్పుడు రాకండి. మేము చెబుతాము, అప్పు డు వద్దురుగానీ'.. అని, తప్పించుకోవడం కోసం సమాధానం చెప్పే రోజులు వస్తాయి. వచ్చేసాయి కూడా. 


అలాగే గురుశిష్యుల పలకరింపులలో కూడా చాలా తేడాలు కొట్టొచ్చినట్టు వచ్చాయి. 


యజమాని సేవకుడు పిలుపులు పలకరింపులలో కూడా భయంకర వాతావరణ నెలకొనే ఉంది. 


ఇద్దరు స్నేహితులు తారసపడితే గతకాలంలో కౌగిలించుకొని, కరచాలనాలు చేసుకుంటూ వదిలి పెట్టు కొనేవారు కాదు. ఇప్పుడు ఎగతాళి పలకరింపులు, 

జోకులు, జుగుప్స కలిగించే బూతుమాటలు. చి.. చి.. జాతి విలువలు సర్వనాశనం అయిపోతున్నాయి. భ్రష్టు పట్టిపోతున్నాయి. ఇందుకు కారణాలు పరిశీలిస్తే అశ్లీల సాహిత్యం, టీవీ, సినిమా మాధ్యమం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 


సరే ఇప్పుడు కాదు అన్నియుగాలలోను మంచి చెడు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మంచిని తీసుకుని చెడును వదిలిపెట్టేవారు ఆ కాలాల్లో ఆ యుగాల్లో. అలా చేయమని చెప్పే పెద్దలు, విజ్ఞులు, హితులు ఉండేవారు అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి కోవ మనుషులు మచ్చుకు కూడా లేరు. 


ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడో సర్వనాశనం అయిపోవడంతో తాత, తండ్రి, మామ చెప్పే మంచి మాటలు వినే రోజులు భూ గర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్లే పెద్దవాళ్లు, ఎవరికి వాళ్లే గొప్ప వాళ్ళు, ఎవరికి వాళ్లే తెలివైన వాళ్ళు. గురువు చెప్పే మాటను శిష్యుడు ఖాతరు చేయడం లేదు. పంగనామాలు పెట్టడం, పెడ మార్గంలో ప్రవర్తించడం.. 


భర్త చెప్పే మాటను భార్య విశ్వసించటం లేదు. భార్యను సైతం గౌరవించి ప్రవ ర్తించడం లేదు భర్త. ఇంకెక్కడి పలకరింపులు ఇంకెక్కడి పిలుపులు. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనుకునే విషపు సమాజం ప్రస్తుతం రాజ్యం ఏలుతుంది. 


చాలా సంవత్సరాల క్రితం.. సెల్ కొత్తగా వస్తున్న రోజుల నాటి మాట. నా ప్రాణ స్నేహితుడు మూర్తి అప్పటికే మూడు నెలల క్రితమే సెల్ కొనుక్కొని అన్ని రకాలుగా దానిలో అనుభవం సంపాదించి ఉన్నాడు. 


ఆ తర్వాత మూడు నెలలకు నేను ఆరోజే సెల్ కొత్తగా కొనుక్కున్నట్టు అతనికి తెలిసింది. నేను ఒక్కొ క్కరి నెంబర్లు సంపాదించి వాళ్లకు ఈ విషయం చెబు తున్నాను. అంతలోనే మూర్తి ఎవరి దగ్గరో నా నెంబర్ సంపాదించి నాకు మెసేజ్ పెట్టాడు.. ''హాయ్. '' అని. 


అప్పట్లో నాకు మెసేజ్లు చూడటం మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టడం అసలు చేతకరాదు. 


రెండు గంటలు పోయాక మూర్తి ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ను తీసుకొని కోపంగా నా దగ్గరకు వచ్చాడు. చాలా తిట్లు తిట్టాడు చివాట్లు పెట్టాడు. అతని పలకరింపు, మాట తీరు చూడండి. ఎంత అసహ్యపు ధోరణిలో ఉన్నా యో. అక్కడికి నేను చెప్తున్నాను ' ఒరేయ్ నాకు సెల్ అలవాటు లేదురా'' అన్న వినలేదు. 


'నేను నీకు పెట్టిన మెసేజ్ కు నువ్వు సమాధానం చెప్ప లేదు.. సెల్ కొనే సరికి నీకు పొగరు, గీర వచ్చాయి.. నన్ను నువ్వు అగౌరవ పరిచావు. నీలాంటి స్నేహితుడు నాకు అక్కర్లేదు. ఈరోజు తోటి నీకు నాకు బంద్. ' అంటూ నన్ను కొట్టినంత పని చేసి వెళ్ళిపోయాడు అతని స్నేహితులతో. 


చూశారా.. ఏమైనా అర్థం ఉందా. అప్పటినుండి ఇప్పటి వరకు అతను నాతో మాట్లాడలేదు. 


ఇదిరా సంధ్యావందన రావు పలకరింపులు పిలుపులు వరుస.. నేడు ఆ పలకరింపులు పిలుపు వరుస, మను షులను అర్థం చేసుకునే విధానం మరింత అద్వాన్నమై పోయింది. 


ఇలాంటి పరిస్థితులలో సమసమాజం ఎలా ఏర్పడుతుంది. గాంధీ గారు కలలు కన్న రాజ్యం ఎలా ఏర్పడు తుంది? మనిషికి మనిషికి మధ్య ప్రేమాభిమానాల పరిస్థితి మాయమైపోయింది రా.


ఇలాంటి సందర్భంలో మనకన్నా చిన్న వాళ్లు మాత్రమే కాదు మన బోటి పెద్ద వయసు వాళ్ళం కూడా చాలా మార్పు పొందాలి రా. అహంకార అహంభావ విధానాలన్నీ సమసి పోవాలి. పిల్లలను కూడా గౌరవించి ప్రేమగా పిలవాలి. పిల్లలను అర్థం చేసుకొని అభి మానంగా పలకరించగలగాలి. అది పెద్దవాళ్లలోనే ముందు కరువు అయింది. 


చివరికి కథంతా చెప్పి నిన్నే తిట్టిపోస్తున్నాను అనుకోవద్దు. 


మనం ఇతరులను విమర్శించే ముందు మనలోని తప్పులను కూడా తెలుసుకుందాం. 


ప్రేమగా పిలిస్తే పలకరిస్తే పోయేదేముంది.. కాస్తంత పెదాల కదలిక తప్పించి. ప్రేమగా పిలిస్తే పలకరిస్తే

మెదడు నరాలకు ఆనంద ఆహ్లాదం పెరుగుతుంది తప్పించి.. ఆవగింజంత కూడా మనకు నష్టం జరగదు కదా. 


అందుకనే మనమే ఏదో సాధించాం.. మనమే గొప్ప వాళ్ళము అన్న అహంకారం వదిలేద్దాం. మనకు చాలా తెలుసు కానీ తెలుసుకోవలసింది ఇంకా కొండంత ఉంది అన్న ఆలోచన సరళి అలవరచుకుందాం. 


పదిమందికి చెప్పడం కాదు, ముందు మనం ఆలోచిద్దాం, మనం ఆచరిద్దాం. ప్రతి వ్యక్తిని ప్రేమగా పిలవడం పలకరించడం.. ఈ క్షణం నుండి మన తోటే ప్రారంభిద్దాం. అలా మార్పు రావాలి రా. తథ్యం.. ప్రతివాళ్లు ఇలా ఆలోచిస్తే మార్పు పరిగెత్తుకుంటూ రాక మానదు. ''


అంటూ చెప్పడం ముగించారు గురువు నీలకంఠేశ్వర 

రావు. 


సంధ్యావందనరావుకి కొంచెం అర్థమైనట్లుగా పైకి లేచి గురువుగారికి నమస్కారం పెట్టి.. 


''సరే గురువుగారు నేను కూడా జీవన విధానం మార్చుకుని ప్రేమాభిమానాలతో పిలవడం నేర్చు కుంటాను, వస్తానండి.. మీకు చాలా ధన్యవాదాలు” అంటూ బయలుదేరాడు.. 


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree



ree


ree

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page