కనువిప్పు
- Addanki Lakshmi

- Oct 11
- 3 min read
#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #Kanuvippu, #కనువిప్పు

Kanuvippu - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 11/10/2025
కనువిప్పు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
రామాపురం గ్రామంలో చాలా మంది వ్యవసాయ కూలీలు. వారి పిల్లలు వ్యవసాయ పనులపుడు తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లి పొలం పనులు చేస్తారు. ఏమి పని లేనప్పుడు మాత్రమే పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు.
వాళ్లకు చదువుపై అంత శ్రద్ధ ఉండదు. హోంవర్క్ చేయరు, ఎప్పుడు ఆటపాటలతో గడిపేస్తారు. గురువులు కొడతారనే భయంతో రోజు బడికి వెళ్లరు, కాబట్టి చదువు సరిగా వంట పట్టదు. రంగడు, సోముడు నాలుగో తరగతి చదువుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులకు వీళ్ళను బాగా చదివించాలని ఆశ.
వీళ్ళకు పాఠశాలంటే భయం. ఒక రోజు ఇద్దరూ ఆలోచించుకుని, పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లిపోయారు — తల్లిదండ్రులతో చెప్పకుండా.
“పట్టణాల్లో చాయ్ దుకాణాల్లో పని చేసుకుంటే నాలుగు డబ్బులు గడించుకోవచ్చు, ఈ చదువు బాధ కూడా తప్పుతుంది” అని రాజుగాడు చెప్పగా విన్నారు. అందుకే ఇంటినుంచి వచ్చేశారు.
ఒక పెద్ద హోటల్లో పనికి చేరారు.
వాళ్ల తండ్రులు ఇద్దరూ వచ్చి — “ఇంటికి పోదాం రా రా. చదువు అంటే ఇష్టం లేకపోతే బడికి వెళ్లవద్దు. హాయిగా పొలం పనులు చేసుకుందువుగాని, మాకు కూడా సహాయంగా ఉంటుంది” అంటూ బ్రతిమిలాడారు.
“మేము రాము, ఇక్కడ పనిచేస్తే మాకు డబ్బులు ఇస్తున్నారు. మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు ఇవ్వరు కదా! మాకు ఏదైనా తినాలని ఉంటుంది, సినిమా చూడాలని ఉంటుంది — మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు అడిగితే ఇవ్వరు. మాకు ఇక్కడే బావుంది” అన్నారు పిల్లలు ఇద్దరూ.
“సరే, వీళ్ళకే తెలుసొస్తుంది పనిచేయడం అంటే ఏమిటో,” అని వాళ్లిద్దరూ తిరిగి గ్రామానికి వెళ్లిపోయారు.
రంగడు, సోముడు — రోజు చాయ్ కప్పులు కడగడం, గిన్నెలు రోజంతా తోమడం, హోటల్ శుభ్రం చేయడం... ఇవన్నీ చేస్తూ రోజంతా పని చేసేవారు. ఎప్పుడో లేటుగా ఇంత అన్నం పెట్టేవారు. రాత్రి అలసిపోయి పడుకుని నిద్రపోయేవారిద్దరూ.
ఒక వారం రోజులు తిరిగేసరికి ఇద్దరికీ పనులు చేయలేక విసుగు పుట్టింది, నీరసం వచ్చింది. డబ్బులు దొరికినా ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి కూడా తెలియట్లేదు. సమయం అసలే లేదు — పని, పని, పని. దినమంతా పని! అప్పటికి అర్థమైంది ఇద్దరికీ — తల్లిదండ్రులు తమని ఎందుకు బాగా చదువుకోమని అంటున్నారో అని.
అక్కడ పనిచేసే గోపి అనే పిల్లవాడు ఏడుస్తూ చెప్పాడు — “యజమానికి జాలి, కరుణ ఉండదు. తక్కువ డబ్బులు ఇస్తారు. దినమంతా పని చేయించుకుంటారు. చిన్న పిల్లలను పీక్కుతినే రాబందుల వీళ్ళు! నాకు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఈ అవస్థ పట్టింది. మీరు వెళ్లి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి. మీకు ఏమి కర్మ?” అని అక్కడి పరిస్థితులు వివరించాడు.
దానితో పిల్లలిద్దరికీ జ్ఞానోదయం అయింది. చదువు యొక్క విలువ తెలుసుకుని ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు. రోజూ బడికి వెళుతూ బాగా శ్రద్ధగా చదువుకోవడం మొదలు పెట్టారు.
ఎవరికైనా మంచి మాటలు చెబితే బుర్రకి ఎక్కవు; స్వానుభవంతో తెలుసుకుంటేనే బాగా అర్థమవుతుంది — అదే వీళ్ళ పరిస్థితి.
పిల్లలు ఒక్కసారి సక్రమ మార్గంలో పడితే, వారి జీవితం రాజమార్గము అవుతుంది.
&&&&&&_
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments