top of page

మారింది కాలమాI... మనిషా !!!


'Marindi Kalama Manisha' New Telugu Poem


Written By: Ch. C. S. Sarma



వ్రాయాలని వుంది మదిలోన ఎన్నో ప్రయాసగా వ్రాయగలిగాను కొన్నే...

జగమే మారిందంటారు కొందరు...

మార్పు ఎక్కడని ఎరిగినవారెందరు?..

మారింది కాలమా!... మానవుడా!!... కాల తత్వమా !... మానవ నైజమా!!... // వ్రాయాలని//

కాలం మారలేదు... తూర్పున సూర్యోదయం... మనిషే మారాడు... పడమర సూర్యాస్తమయం వినువీధి పయనంలో... తూర్పు పడమరలు ఏకం... ఆ పయనమే మనిషిని మార్చిన వింత మార్గం... // వ్రాయాలని//

సాంప్రదాయ తీరు తెన్నూ మారింది.... కట్టు బొట్టు మాట తీరు మారింది.... ప్రేమాభిమానాలు అర్థరహితపు పలుకులు.... తల్లిదండ్రులు అయినారు గుదిబండలు... // వ్రాయాలని//


అభిమానం లేని మనస్సుకు అన్నీ అసహ్యమే... వ్యక్తిగత గౌరవం లేనిచోట అంతా ఆవేదనే... నా అనుకొన్నవారు మారారు కానివారుగా.... విజ్ఞాన విభవం ఇదేనేమో కాలరీతిగా... // వ్రాయాలని...

పెద్దల కోసం వెలిశాయి వృద్ధాశ్రమాలు... అందరికోసం ప్రబలాయి మధుశాలలు ... అన్నింటికి మూలకారణం మనిషేరా!...

మారింది కాలం కాదు స్వార్థపు మనిషేరా !.. // వ్రాయాలని//

***

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



31 views0 comments
bottom of page