మిఠాయి పొట్లం - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- Oct 15
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MitayiPotlam, #మిఠాయి పొట్లం, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "మిఠాయి పొట్లం" పుస్తకావిష్కరణ హైదరాబాద్లో
Mitayi Potlam - Book Unveiling ceremony At hyderabad - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 15/10/2025
మిఠాయి పొట్లం - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న విరచిత 80వ పుస్తకం"మిఠాయి పొట్లం" పుస్తకావిష్కరణ శారదా కల్చరల్ లైవ్ స్టూడియో హాల్, హిమాయత్ నగర్, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమన్వయ సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి, గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి, గుర్రం జాషువా మరియు సాలూరి రాజేశ్వరరావు సంస్మరణ సభలో, జాతీయ కవి సమ్మేళనం పురస్కరించుకొని ప్రముఖ తెలుగు సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు సాలూరి వాసురావు, కళాపోషకులు ఏ. ఎల్. కృష్ణారెడ్డి మరియు డా. వి. డి. రాజగోపాల్ గార్ల చేతుల మీద ఆవిష్కరించడం విశేషం. అనంతరం ఈ పుస్తకాన్ని పులిగడ్డ మల్లికార్జున రావు గారికి అంకితమిచ్చారు. అత్యల్ప కాల వ్యవధిలో 80 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహిత్యప్రముఖు గాయకులు డా. శరత్ చంద్ర, , అరవా రవీంద్ర బాబు, శివ రమ్య, మరియు హరిచందన మొదలగు వారు పాల్గొన్నారు.
-గద్వాల సోమన్న














Comments