ఊడల మర్రి
- Patrayudu Kasi Viswanadham
- May 26
- 4 min read
#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #UdalaMarri , #ఊడలమర్రి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Udala Marri - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham
Published In manatelugukathalu.com On 26/05/2025
ఊడల మర్రి - తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కాశీతాత పిల్లలందరినీ తీసుకుని ఊరు చివర ఉన్న మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళాడు. పిల్లలందరూ మర్రిచెట్టుని, దాని ఊడలని చూసి ముచ్చటపడ్డారు. ఊడలు పట్టుకుని ఊగారు. దొంగపోలీస్ ఆడారు. అలసిపోయి చెట్టుకింద కూర్చుని సేదదీరారు పిల్లలు.
“జుట్టు జడలు కట్టి యుండు
కానీ సన్యాసి కాదు
ఎర్రెర్రని పిల్లలుండు
కానీ మనిషి కాదు”
– ఈ పొడుపు కథను ఎవరైనా విప్పండి" అని అడిగాడు తాతయ్య.
“ఇదిగో ఇదే” అని మర్రి చెట్టువైపు చూపించాడు రుద్ర
“ఎలా?” అని అడిగింది కాత్యాయని.
“జడలు అంటే ఊడలు … ఎర్రెర్రని పిల్లలు అంటే పళ్ళు…మనిషి కాదు మర్రిచెట్టు” అని జవాబు చెప్పాడు రుద్ర.
“సరిగ్గా చెప్పావు రుద్ర” అని మనవడిని మెచ్చుకుని “మీకు తెలియని విషయాలు చెప్తాను” వినండి అని చెప్పడం ప్రారంభించాడు తాతయ్య.
చెరువుల గట్లపై శాఖోపశాఖలుగా విస్తరించిన మర్రిచెట్టు వందలాది పక్షులకు నివాసం. అంతే కాదు భారతీయుల జాతీయ వృక్షం. దీనిని ‘వటవృక్షము‘ అని కూడా అంటారు. దీని విత్తనాలు చాలా చిన్నవి కానీ మహావృక్షాలుగా పెరుగుతాయి. వీటి కొమ్మలు ఊడలుగా మార్పుచెంది కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి. ఈ చెట్లు చాలా పెద్దగా ఉండటం వలన గాలులకూ, వర్షాలకూ పడిపోకుండా వాటి ఊడలు ఊతమిస్తాయి. రహదారి పక్కనున్న చెట్లు దారినపోయే బాట సారులకు నీడను ఇస్తాయి. పల్లెటూళ్ళలో మర్రిచెట్టు చుట్టూతా అరుగు కట్టుకొని దానినే రచ్చబండగా ఉపయోగిస్తారు.
అనంతపురం జిల్లా లోని తిమ్మమ్మ మర్రిమాను. ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షంగా పేరుగాంచినది. ఎనిమిది ఎకరాల మేర వ్యాపించి నేటికీ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది.
ఇక రెండవది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లో ఉన్న ’పిల్లల మర్రి’ ఇది 3 ఎకరాలో విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.
మూడవది కోల్ కతాలో జగదీష్చంద్రబోస్ బొటానికల్ గార్డెన్లో ఉన్న ’ద గ్రేట్ బనియన్’.
నాలుగవది బెంగళూరు శివారున ’దొడ్డా అలాడా మారా’ అనే పేరుతో నున్న మర్రిచెట్టు సుమారు 2½ ఎకరాలలో వ్యాపించి ఉన్నది.
ఐదవది గుజరాత్ లోని కబీర్ వాడ్ ప్రాంతంలో 300 సం. ల వయసు పైబడిన మర్రిచెట్టు.
మనం కార్తీకపున్నమి నాడు మర్రి ఆకులతో పూజలు చేస్తాము. ఊడలను ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాము.” అని వివరించాడు తాతయ్య.
“చాలా విషయాలు తెలిసాయి తాతయ్యా…ఇక ఇంటికి వెళ్దాం” అన్నారు మనవలు.
“సరేనని” మనవలతో ఇంటిదారి పట్టాడు కాశీ తాత.
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
Comments