top of page
Original_edited.jpg

కరికాల చోళుడు - పార్ట్ 27

  • M K Kumar
  • Nov 2
  • 4 min read

Updated: Nov 7

#MKKumar, #ఎంకెకుమార్, #KarikalaCholudu, #కరికాలచోళుడు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Karikala Choludu - Part 27 - New Telugu Web Series Written By - M K Kumar

Published In manatelugukathalu.com On 02/11/2025

కరికాల చోళుడు - పార్ట్ 27 - తెలుగు ధారావాహిక

రచన: ఎం. కె. కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో అతని తండ్రి, చోళ చక్రవర్తి ఇలంచెట్చెన్ని మరణిస్తాడు. అధికారాన్ని కరికాలుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి.

అజ్ఞాతంలోకి వెళ్తాడు కరికాలుడు. సాధువు వేషంలో ప్రజల మనోభావాలు తెలుసుకున్న కరికాలుడు తనెవరో బయట పెడతాడు. అనుచరులతో రాజభవనంలోకి ప్రవేశిస్తాడు కరికాలుడు.

రాజద్రోహి పెరునర్కిలాన్ ను బంధించి, అధికారంలోకి వస్తాడు.


గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 చదవండి. ఉరయ్యూర్ రాజభవనంలో రాజమహిషి వందనాదేవి చీకటి గదిలో కూర్చొని ఆలోచిస్తోంది.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 27 చదవండి.


రాజసభలోని మంత్రులు కరికాలుని గొప్పతనాన్ని అంగీకరించి, తలవంచి నమస్కరించారు. 


ధర్మసేన ముందుకు వచ్చి, "చోళ వంశానికి తిరిగి గౌరవం తీసుకొచ్చిన మహారాజునికి జై" అని నినదించాడు. 


కరికాలుడు తన ఖడ్గాన్ని పైకెత్తి, 


"ఈ చోళ సామ్రాజ్యం నా పాలనలో ధర్మపథంలో నడుస్తుంది. నా తండ్రి ఆశయాలను సాకారం చేయడమే నా జీవిత ధ్యేయం" అని గంభీరంగా ప్రకటించాడు. 


రాజధాని గంగాసంగమంలా మారింది. ఆనంద భాష్పాలతో, గొంతెత్తి నినదిస్తూ, నూతన చోళ యుగాన్ని ఆహ్వానిస్తూ ప్రజలు ఆ రోజు విజయోత్సవాన్ని జరుపుకున్నారు. 


తల్లి పాదాలకు కరికాలుడు నమస్కరించాడు. ఆమెను ఆలింగం చేసుకున్నాడు. ఆమె కన్నీటితో ఆనందభాష్పాలతో యువరాజును ఆశీర్వదించింది. 


ఒక మాసం తరువాత, 

తులువ రాజ్యం – రాజ సభ వైభవం


తులువ వంశం విశేషమైన ప్రతాపాన్ని సాధించింది. తులువ రాజుల కాలంలో రాజ్యసభ భవ్యంగా, గంభీరంగా ఉండేది. 


రాజ్యసభ అనగానే అది సామాన్య సభ కాదు. అది అధికార వికాసం జరిగే, అణిచివేతల తిమిరం తొలగించే, రాజనీతికి కేంద్ర బిందువుగా నిలిచే పవిత్ర స్థలం. 


 రాజధానిలోని సింహాసన మండపం రాజ్యసభ కేంద్రంగా ఉండేది. ఇది అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన మహద్భవనంగా ఉండేది. 


అంతస్తుల మీద చెక్కిన సింహాలు, యాళ్ళు, సీతాకోకచిలుకల శిల్పాలు రాజసౌందర్యాన్ని ప్రతిబింబించేవి. 


మణిమండపం మధ్యలో రత్నాలతో మెరుస్తున్న సింహాసనం ఉండేది. గోరింటాకులా ఎర్రగా మెరుస్తున్న ఈ సింహాసనం సింహాద్రి సింహాసనం అని ప్రఖ్యాతం. 


తులువ వంశాధిపతి సభలో ప్రవేశించే దృశ్యం అద్భుతంగా ఉండేది. రాజు ప్రవేశిస్తుంటే రాజవీధులలో శంఖనాదాలు, దుందుభి నాదాలు మారుమోగేవి. 


రెండు వైపులా కోటిపతులు, మంత్రులు, సైన్యాధికారులు గౌరవంగా నిలుచుండేవారు. 


తులువ మహారాజు శుక్రవర్ణపు పట్టాలతో అలంకరించిన, రత్నాల తళుకుల మధ్య మెరవే సింహాసనం పై ఆసీనుడవుతాడు. 


రాజు చుట్టూ నాలుగు వైపులా సింహాల రూపాలతో చెక్కిన అద్దకాలు. వెనుక భారీమైన చంద్రచూడ తలపాగా, మెడలో మాణిక్య హారాలు, చేతుల్లో కిరీట కంకణాలు మెరిసేవి. పక్కనే ధర్మదండం, రాజరిక చిహ్నంగా మెరిసేది. 


సభలో రాజు ముందే ప్రధాన మంత్రులు, సేనాధిపతులు, ధర్మాధికారులు కూర్చునేవారు. 


సభలో రాజు తీర్పు చెప్పే ముందు దర్బార్ గమనిక చదివేవారు. అప్పుడు మంత్రులు తమ అభిప్రాయాలు చెప్పేవారు. రాజు తీర్పు చెప్పిన తరువాత సభలో 'జయహో మహారాజా’ అంటూ హర్షధ్వానాలు మారుమోగేవి. 


ఈ రాజ్యసభలో అడుగు పెట్టగానే రాజసం, సాంస్కృతిక మహిమ కనువిందు చేసేవి. 


ప్రతీ మూలకు రత్నాల తళుకులు, మంత్రదండ నినాదాలు, ధర్మ సూత్రాలను బోధించే వేదగానాలు వినిపించేవి. 


విజయం, ధర్మం, శక్తి, ఈ మూడు పదాలు రాజ్యసభ గాలి కూడా భరిస్తూ ఉండేవి. 


తుళువ రాజు తన ఆసనంపై కూర్చొని ఉన్నాడు. అతని ప్రక్కన యానై క్కట్చి నిలుచొని ఉంది. 


ఆమె కళ్లు ధైర్యంతో మెరుస్తున్నాయి. రాజసభ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కరికాలుని రాయబారి రాజు ముందుకు వచ్చి నమస్కరించాడు. 


కరికాలుని రాయబారి వినయంగా 


"మహారాజా, చోళ యువరాజు కరికాలుడు, ఆయన తల్లి మహారాణి మీకు సందేశం పంపారు”


“ చోళ రాజ్యానికి తుళువ రాజ్యంతో మైత్రి కావాలి. ఆ మైత్రికి సంకేతంగా మీ కుమార్తె యానై క్కట్చిని కరికాలునికి వరంగా ఇచ్చి, రెండు రాజ్యాల మధ్య శాశ్వతమైన బంధాన్ని నెలకొల్పాలని ఆశిస్తున్నారు"


సభలో గుసగుసలు మొదలయ్యాయి. 


యానై క్కట్చి కాస్త ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడింది. 


యానై క్కట్చి సన్నని నవ్వుతో 


"నా వివాహం రాజ్య ప్రయోజనానికి ఉపయోగపడాలి. కానీ కరికాల చోళుడు నిజంగా దీన్ని సమానమైన మైత్రిగా చూస్తున్నాడా? లేక తన సామ్రాజ్య విస్తరణ కోసం చేస్తున్నాడా?"


తుళువ రాజు చిరునవ్వుతో, కరికాలుని రాయబారుడిని చూస్తూ ప్రశ్నించాడు. 


"నిజమే, కరికాలుడు యోధుడు. కానీ నా కుమార్తె తుళువ రాజవంశానికి చెందినది. ఆమెను గెలుచుకోవడం అంత సులభం కాదు. కరికాలుడు తన గుణం, ధైర్యంతో నా కుమార్తెను గెలుచుకోవాలని కోరుకుంటే, అది నిరూపించాలి"


రాయబారి తెలివిగా


 "మహారాజా, కరికాల చోళుడు కేవలం యోధుడే కాదు. ఆయన ప్రజల హృదయాల్లో రాజు. ఆయన ధర్మపరాయణుడు, ధైర్యవంతుడు, నిజాయితీ గల పరిపాలకుడు. మీరు ఆయనను స్వయంగా కలిస్తే, మీ సందేహాలు తొలగిపోతాయి"


యానై క్కట్చి ఆసక్తిగా ముక్కుసూటిగా 


"కరికాల చోళుడు నిజంగా గొప్పవాడేనా? యుద్ధరంగంలో తన ప్రజలను నడిపే రాజా? లేక కేవలం రాజకీయ వివాహం కోసం వచ్చినవాడా?"


రాయబారు మంచి యోచనతో 


"యానై క్కట్చి దేవి గారు, కరికాలుని తండ్రి ఎంత గొప్పవారో మీకు తెలుసు. కానీ కరికాల చోళుడు ఆయన కన్నా గొప్పవాడు. చిన్న వయసులోనే అతను కుట్రలకు గురయ్యాడు”


“తండ్రిని కోల్పోయాడు. కాని, తన ధైర్యం, పట్టుదలతో మరల తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. మీరు అతనిని కలిస్తే, మీ ప్రశ్నలకు సమాధానం స్వయంగా అతడే ఇవ్వగలడు”


యానై క్కట్చి కొద్దిసేపు ఆలోచించింది. ఆమె ముఖంలో ఉత్సుకత కనిపించింది. 


చివరకు, తండ్రి వైపు తిరిగి మౌనంగా చూపు నిలిచిన తర్వాత ధైర్యంగా అంగీకరించింది. 


యానై క్కట్చి తెలివిగా "నాకు సమాధానం కేవలం మాటల్లో కాదు, ఆ మనిషిని స్వయంగా చూడాలి. నేను కరికాలుని కలవడానికి సిద్ధం"


========================================================

ఇంకా వుంది..

========================================================

ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page