top of page

కర్తవ్యం - ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube video link

'Karthavyam - Episode 5' Mini Telugu Web Series


Written By Vedurumudu Ramarao




వెదురుమూడి రామారావు గారి సంక్షిప్త ధారావాహిక కర్తవ్యం ఐదవ ( చివరి ) భాగం


గత ఎపిసోడ్ లో

అందరూ మనాలి, రోహతాంగ్ పాస్ వెళతారు.

సుధ మనోహర్ లు దగ్గరౌతున్న విషయం గ్రహించి ఆనందిస్తారు విశ్వనాథం దంపతులు.


ఇక కర్తవ్యం ఐదవ ( చివరి ) భాగం చదవండి.



తెల తెలవారుతుండగా మనోహర్ సుధ లు లేచి ఆరు బయట దృశ్యాలని కళ్ళల్లో నింపుకొంటున్నారు. ఆ ప్రదేశం, వాతావరణం వదలి వెళ్ళాలి అనిపించటం లేదు. తప్పదుగా!


సామానులు అన్నీ కారులో ఎక్కించి గెస్ట్ హౌస్ కి వీడుకోలు చెప్తూ మెల్లగా వెనక్కి బయలు దేరారు. ఆపిల్ తోటల దగ్గర కారు ఆపించి కావలిసిన పళ్ళు ప్యాక్ చేయించారు.

గడచిన మంచి సమయం మరువలేని జీవితానందంగా నెమరు వేసుకొంటూ ఢిల్లీ వైపు బయలు దేరారు. విశ్వనాథం, సుమతి లు వీళ్లల్లో వచ్చిన మార్పు ని గమనిస్తూనే వున్నారు. నెమ్మదిగా వారి అసలు జీవితాలకు తిరిగి వచ్చే మానసిక స్థితికి చేరుకుంటున్నారు. వాళ్లకి ఇంతకాలం ఒక కలల ప్రపంచం లో ఉన్నట్టు, ఇప్పుడే బయట కి వస్తున్నట్టు అనిపిస్తోంది.


తారు రోడ్ మీద కారు నున్నగా జారిపోతోంది. ఏసీ చిన్నగా, మందంగా, చల్లగా వారికి సేవ చేస్తోంది. అకస్మాత్తుగా సుధ విశ్వనాథం గారి తో ఇలా అంది. మనోహర్ నిశ్శబ్దంగా వింటున్నాడు.


“అంకుల్! మనం బయలు దేరి వచ్చే రోజు ప్రయాణం లో మన సాంప్రదాయం, పెళ్ళిలో తంతుల గురించి చెపుతూ ఆపేసారు. మనకి ఇంకా ప్రయాణం లో టైం బాగా వుంది కదా. చెప్తారా ?” అని అడిగింది.


అంత కన్నా సంతోషం ఏం ఉందమ్మా! తప్ప కుండా చెప్తాను. మీకు బోర్ కొడితే ఆపేస్తాను. ఈ తంతులు ఏమిటి, వీటి అర్ధం ఏమిటి అని తెలిస్తే, వాటి మీద గౌరవం ఎక్కువ అవుతుంది. తప్పకుండా ఆచరించాలి అనిపిస్తుంది. జీవన సత్యానికి, మనుగడకి అర్ధం పరమార్ధం కూడా. అందుకే ఇన్ని వేల సంవత్సరాలైనా మన సంస్కృతి నిలబడి వుంది.


‘శౌనక స్మ్రుతి ధర్మ శాస్త్రం ‘ పెళ్లి లో జరిగిన తంతులని వివరిస్తోంది. మంగళ సూత్రం కట్టేటప్పుడు వరుడు చేత అనిపించిన మంత్రం అందరికి తెలిసినదే.


మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా

కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం

అంటే వరుడు తన జీవితాన్ని ఆమె చేతుల్లో పెడుతున్నాడు అని అర్ధం.

‘ఇది పవిత్రమైన బంధం. గుణవంతురాలయిన నీ మెడలో నేను మంగళ సూత్రం కడుతున్నాను. నీవు సంతోషం గా వంద సంవత్సరములు జీవించు’ అని కోరుతున్నాడు.


అంటే తానూ వంద సంవత్సరములు సంతోషంగా జీవించాలని కోరుకున్నటు కదా. ‘మమ జీవన హేతునా’ అంటే ఇది చిరకాలం ఉండాలి అనే భావన. ఈ మంత్రం ‘ వైఖానస ఆగమ’ లో మొదటిగా వివాహ తంతు, కర్మ ల గురించి చెప్పింది. సినిమాల లో ఈ మంత్రం నిర్దిష్టంగా వింటూనే ఉంటాం. పెళ్లికొడుక్కన్నా పూజారి ఉత్సాహంగా ఉంటాడు. పెళ్లికొడుక్కి వీటి మీద ధ్యాస ఉండక పోవచ్చు. మీరు కూడా అప్పుడు గమనించి ఉండక పోవచ్చు.


ఇంక ముఖ్యమైన అంశం, వీరిద్దరి బాధ్యతలు స్పష్టంగా తెలియచేస్తున్నవి మంత్రాలు. వాటి మీద మనకి ఆ టైం లో ధ్యాసే ఉండదు. ధర్మ మార్గమైన జీవితం ఎట్లా గడపాలి, దానికి మనం ఆచరించవలసిన విషయాలు ఏమిటి అనేవి కూడా తెలియచేస్తారు.పెళ్లి కూతురి తండ్రి పెళ్ళికొడుకుని 'ధర్మేచా ,అర్ధేచ, కామేచ, న అతి చరామి' అడుగుతాడు. పెళ్ళికొడుకు దీనికి అంగీక రిస్తాడు.పెళ్ళికొడుకు చేత 'న అతి చరితవ్యా ' అని అని మూడు సార్లు అంటూ , ఇద్దరు ఒప్పుకొంటారు. ఇది ఒక పవిత్ర వాగ్దానం.


'సప్త పది' అన్నది ఏడు అడుగులు వేస్తూ వారిద్దరూ చేసుకుంటున్న నిబద్ధత. ఒకరి పట్ల ఒకరికి గౌరవం,ప్రేమ విశ్వవనీయత కలిగి నడుచుకొంటాం , జీవితాంతము ఇలాగే ఉంటాం' అని వారు చేసుకొన్నప్రమాణం. దానికి గాను ఒక గుర్తు. ఆ క్షణం లో మనం వీటిని ప్రముఖంగా గమనించం. ఇవి పరస్పర అంగీకారం. మన ధర్మ ప్రకారం వీటిని మనం ఆచరించాలి. కానీ మర్చి పోతూ ఉంటాం.


ఒక కొత్త జంట ల మధ్య పవిత్రంగా జీవితం ఉండాలి అంటే వారి మధ్య అవగాహనా , నమ్మకం ఏర్పడాలి. ఒకరి కొకరు కొత్త వాళ్లు కాబట్టి ఈ విధం గా జన సామూహికం గా వారి చేత ప్రణామాలు చేయించి దానికి నిర్దిష్టం గా నిలబడి ఉండాలి అనే ఆంక్ష పెడతారు. "పెళ్ళినాటి ప్రమాణాలు" అనే ఒక పాత సినిమా చూడండి. అందులో ఈ విషయాలన్నీ విశదీకరించారు.


ఇంకొక విషయం. పొద్దున్నే అయినా , మిట్ట మధ్యాన్నం అయినా అర్ధరాత్రైనా పురోహితుడు వధూవరులను లాక్కోనివెళ్ళి ఆకాశం లో అరుంధతి నక్షత్రాన్ని చూడమంటాడు.అందరు నవ్వుకొంటారు.కానీ దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా ? నక్షత్ర సమూహం లో ఆ నక్షత్రాలు వేరు, వేరు గమనం లో వెళుతూ ఉంటాయి. కానీ అరుంధతి, వసిష్ఠ నక్షత్రాలు మాత్రం ఒక దాని నొకటి వదలకుండ తమ చుట్టూ తామే తిరుగుతూనే ఉంటాయి. అలాగే వధూవరులు ఇద్దరు ఒకరిని వదలకుండ ఒకరు వుండాలని దీవెన. తమాషాగా వుంది కదా, సంప్రదాయం, సైన్స్ ఎలా కలిసాయో!


పెళ్లి తంతులలో 'అప్పగింతలు' మరో ముఖ్య మైన అంశం. అప్పటికే పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు బాగా అలసి పోయి వుంటారు. రాత్రి ముహూర్తాలు అయితే అందరూ నిద్రావస్థ లో వుంటారు. పురోహితుడు మాత్రం ఎంతో ఉత్సాహంగా హడావిడి చేస్తూ ఉంటాడు. మీకు అసలు గుర్తు ఉందొ లేదో!! కానీ దీనివెనుక ఉద్దేశం తెలుసుకోవాలి. అల్లారు ముద్దుగా ఇరవై ఏళ్ళు పెంచుకున్న అమ్మాయిని ముక్కు మొహం తెలియని ఇంటికి పంపిస్తూ ఉంటే ఆ తల్లి తండ్రులు పడే బాధ అర్ధం చేసుకోవాలి.


అత్తగారు, మావగారు, ఆడబడుచులు ఇంకా ముఖ్యమైన బంధు జనం ఈ అమ్మాయి ని అంగీకరించి ఆప్యాయంగా ఆదరించాలి అనే అభిలాష. వరుడు సంగతి చెప్పనే అక్కర లేదు. అమ్మాయి కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య ఏ కష్టం లేకుండా ఉండాలి అంటే వాళ్ళ అందరి ఆదరణ కావలి. అందుకే సామూహికంగా అందరి ముందు అమ్మాయి ని వాళ్లకి అప్పగిస్తారు. అత్తా, మామ ల ఒళ్ళో కూర్చోబెట్టి మా అమ్మాయి ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ వారి చేత ఒక వాక్దానం లాంటిది చేయిస్తారు. అలాగే అమ్మయి కూడా తన విధులు బాధ్యతలు నిర్వహిస్తుందని హామీ లాంటిది ఇస్తారు. అంటే ఇద్దరు మెలగ వలసిన భవిష్యత్ సంబంధం, నియమాలు, నిబంధనలు నిర్ణయించబడతాయి.


అంతే గాని ఒకరిని ఒకరు చిన్న చిన్నవిషయాల మీద కోపగించుకొని దూరం ఆవకూడదు అని అర్ధం. ఒక అమ్మాయి తన వారిని అందరిని వదులుకొని అబ్బాయి దగ్గరకు వచ్చింది ఆంటే ఆమె మనస్థితి, పరిస్థితి అర్ధం చేసుకోవాలి. అలాగే అమ్మాయి కూడా అబ్బాయి తలి తండ్రులు బంధు మిత్రులు మెచ్చే టట్టుగా వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఆ కొత్త ఇంట్లో ఇమిడి పోవాలి. చిన్నప్పటి ముద్దు ముచ్చట్లు, గారాబం పక్కన పెట్టి అక్కడి స్థితి గతులకు అనుకూలంగా నడచు కోవాలి. అప్పుడే జీవనానికి సార్ధకత. వాళ్ళ మనస్పర్థలు పెద్దవాళ్ళకి,కుటుంబానికి ఎంత బాధాకరంగా తయారు అవుతాయో తెలుసుకొని సర్దుకు పోవాలి. వీళ్ళ ప్రవర్తన మీద రెండు కుటుంబాలు వారి బంధు మిత్రులు అన్నీ ఆధార పడివున్నాయి అని గుర్తు ఉంచుకోవాలి.


‘మాకు ఇలా అనిపించింది, మిగతా వాటితో మాకు సంబంధం లేదు’ అనే వైఖరి వుండకూడదు. మీ జీవితాలతో బాటు మీ వారందరి జీవితాలు సుఖమయం చేసే ప్రయత్నం మీరు చెయ్యాలి. ఆ విధంగా ఉంటే దీర్ఘ కాలం లో మంచి ఫలితాలు పొందుతారు. స్వల్ప కాలిక మనస్పర్థలు సమసి పోతాయి. అభిప్రాయం భేదాలు అన్ని చోట్ల ఉంటాయి. అహం అన్న మహమ్మ్మారిని మనం గా మనం సంబాళించుకోవాలి.


ఈ సాంప్రదాయలు, యమ, నియమాలు పాటించడం మనకోసమే కాదు, మన ముందుతరాల వారికీ అండగా ఉంటాయి. మన సంస్కృతి ఈ సమస్యలపై పట్టుబట్టడానికి కారణం అదే. మనస్పర్థలు , కోప తాపాలు ,గిల్లికజ్జాలు సహజం. కానీ జీవితం లో ఏలాంటి పరిస్థితి లో నైనా చివరివరకు కలసి జీవించే భార్య భర్త లు ప్రతీ క్షణం భార్యను భర్త, భర్త ను భార్య అర్ధం చేసుకొంటూ సంతోషంగా జీవించడం మే వారి అనుబంధం.


నేను వీటిని మామూలుగా ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఎంత వరకు వీటి మీద నిలబడి ఉండాలి అన్నది మీ మీ నమ్మకాల మీద ఆధార పడి ఉంది. నేను మిమ్మలిని బలవంత పెట్టి ఆలోచింప చెయ్యలేను కదా. వుండబట్ట లేక ఎదో వాగేస్తున్నాను. వీటి గురించి కనీసం తెలుసుకోవడం మన ధర్మం కదా అని చెప్పాను. మరేమి అనుకోవద్దు. అని ఊపిరి తీసుకొన్నారు.


మనం ఢిల్లీ కి దగ్గరగా వచ్చేసాం. నేను మా జూనియర్ తో మాట్లాడాలి అంటూ సెల్ ఫోన్ డయల్ చేశారు. అవతల వ్యక్తి లైన్ లోకి రాంగానే విశ్వనాథం గారి ధోరణి అంత మారిపోయింది. "రావు గారు! రేపు ఆదివారం కదా ఒక గంట మన ఆఫీస్ కి రావాలి మీరు. డాకుమెంట్స్ తయారు చేసి రెడీగా ఉంచితే, సోమవారం కోర్ట్ లో 'డివోర్స్ పిటిషన్' దాఖలా చేద్దాము. మనోహర్, సుధ లకి మాట ఇచ్చాము కదా!" అన్నారు. ఒక్క సారి పూర్తి వాతావరణం అంతా బరువుగా అయి పోయింది.


మనోహర్,సుధ లు ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. ఆయన మొహం చూస్తే నోరు మెదప లేని స్థితి. ఎదో తిన్నాము అనిపించి హోటల్ నించి బయలు దేరారు. సుమతి గారు ఆశ్చర్యం గ విశ్వనాథమ్ వైపు చూస్తూ వుంది పోయారు. ఇంటికి చేరిన తరువాత సోఫా లో కూర్చొని మనోహర్ తో ఇలా అన్నారు.


“పొద్దున్న మీరు బ్రేక్ ఫాస్ట్ అయిన తరువాత రెడీ గ ఉంటే రావు గారు వస్తారు. డాకుమెంట్స్ సంతకం చెయ్యాలి. సోమవారం కోర్ట్ లో వేద్దాము. తొందరగానే డివోర్స్ వస్తుంది అన్నారు. మీరు అడిగినట్టుగా నా వంతు సాయం నేను చేస్తాను”. వేరే మాట్లాడడానికి ఏమి అవకాశం ఇవ్వలేదు.


అందరూ నిశ్శబ్దంగా అలసట, బరువు ఎక్కిన మనసుతో నిద్రకి ఉపక్రమించారు. సుమతి గారు ఆయన వైపు ప్రశ్నర్ధకంగా చూస్తూ "ఇంత సడన్ డోస్ ఏమిటండి" అంటూ ఆశ్చర్య పోయారు.


చిరునవ్వు నవ్వుతు అయన " రేపు పొద్దున్న కి చూడు , ఏమి అవుతుందో " అంటూ నిద్ర కి ఉపక్రమించారు.


రాత్రి చాలా సేపు మనోహర్ గదిలో లైట్ వెలిగి ఉండడం, చిన్నగా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడాన్ని గమనించారు.


పొద్దున్నే వాలు కుర్చీ లో కూర్చొని ‘టీ’ ని ఆస్వాదిస్తున్నారు విశ్వనాథం గారు. ఆయన మొహం ఎంతో ప్రశాంతంగా వుంది. పక్కనే దగ్గరగా నేల మీద కూర్చుని ఎం జరగ బోతోందా అని ప్రశ్నర్ధకం గ చూస్తున్నారు సుమతి గారు. ఇద్దరు వరాలిచ్చే శివ పార్వతుల లాగా కనిపిస్తున్నారు.


సుధ, మనోహర్ యిద్దరు గబగబా వచ్చి అమాంతం వారి పాదాల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేస్తూ వారి పాదాలు కన్నీటితో తడిపేసారు. ఆ ప్రయత్నం నించి బయటకు రావటం లేదు. అప్పుడు విశ్వనాథమ్ గారు మెల్లగా వాళ్ళని లేపి , బుజ్జగింపు ధోరణి లో కూర్చోబెట్టారు. వాళ్లిద్దరూ ఇంకా మాట్లాడలేక మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తున్నారు.


“అంకుల్! మమ్మల్ని క్షమించండి. చిన్నపిల్లల్లా ప్రవర్తించాము. రాత్రి అంత చాలా సేపు ఈ విషయం మీద చర్చించు కొన్నాం , తర్కించు కొన్నాము. మా మధ్య విభేదాలు భిన్న అభిప్రాయాల్ని మననం చేసుకొని మేము తీసుకొన్న నిర్ణయం ఎంత నీచంగా ఉందొ తెలుసు కొన్నాము. మా తప్పులు సరిదిద్దు కోడానికి నిశ్చయించు కొన్నాము. మా బాధ్యతలు తెలిసాయి. మధ్యాన్నం ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళిపోదాం, సరి కొత్త జీవితం సాగించి మీ లాగ ఆదర్శ దంపతులుగా గా గడుపుదాం అని నిశ్చయించు కొన్నాం.


ఈ యాత్ర మనకు చాలా విషయాల్లో మరపురానిది. అది మా కళ్ళు తెరిచి మా హృదయాలను, మనోభావాలను తాకింది. మేము మా కుటుంబాల పట్ల మా బాధ్యతలు విధులను తెలుసుకోగలిగాం. మేము ఇంక ఎప్పుడూ విడాకుల గురించిన ఆలోచనే రానివ్వం.. ఇది మీకు మా మా ‘ప్రామిస్’. మీరు మాకు ఇచ్చిన ఆతిధ్యం , అనురాగం మరువ లేనిది”.అంటూ కళ్ల నీళ్లు పెట్టుకొన్నారు.


"మీరు మాకు ప్రత్యక్ష దేముడు. మా జీవితాన్ని చక్కగా గడిపే మనో బలం మాకు ఇప్పించండి. మాకు మీ ఆశీర్వాదాలు కావలి”.

సుమతి గారు వాళ్ళని అక్కున చేర్చుకొని మెల్లగా బుజ్జగించారు.


“అయితే రావు గార్ని డాకుమెంట్స్ తీసుకొని రావద్దని చెప్పనా అమ్మ! మాకు ఒక కేసు తగ్గి పోతోంది”. అని గట్టిగ నవ్వేశారు విశ్వనాథం గంభీరంగా. “మంచి నిర్ణయం తీసుకొన్నారు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు మంచి భవిష్యత్తు ఇస్తాడు. చక్కగా నవ్వుతు ఇంటికి వెళ్లి సుఖమయ జీవితం ప్రారంభించండి “ అని మనసారా దీవించారు.


బ్రేక్ఫాస్ట్ అయి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి రెడీ అవ్వంగానే, సుమతి గారు సుధ కి, మనోహర్ కి మంచి బట్టలు పసుపు కుంకుమతో పెట్టి సాగ నంపించారు. “వచ్చే ఏడాది కి చిన్న బాబు తో మళ్ళా రావాలి” అని దీవించారు. "ఈ సారి వైష్ణవ దేవి కి వెళదాం” అన్నారు.


సుధా మనోహర్ లు చాలా తేలికపాటి హృదయంతో చిరునవ్వులతో తిరిగి కారు వద్దకు వెళ్లారు. వెళ్ళ లేక, వెళ్ళ లేక పిల్లలిద్దరూ కార్ లో కూర్చున్నారు. వాళ్లని వదలలేక, వదల లేక వీడ్కోలు చెప్పారు విశ్వనాథం దంపతులు. “మన కర్తవ్యం మనం పాటించాం” అంటూ ఒకళ్ళ చేతులో ఇంకొకళ్ళు చేయి వేసుకొని నవ్వుతు ఇంటి లోపలి వెళ్లిపోయారు.

ఇదేగా కావలిసింది.


***సమాప్తం***

వెదురుమూడి రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: వెదురుమూడి రామారావు. M.Com; LLB;



జననం:- జనవరి1945 విజయనగరం.

Till B.com – M.R college vizianagaram,

M.COM at Andhra university college of commerce –

LL.B at Osmania University Hyderabad.

Some diplomas and certifications.

రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ - గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు / oriental bank of commerce– హైదరాబాద్

(21 years with Andhra Bank )–

4 years with a Bank in Oman and -10 years with a Global trust bank in various capacities.

Rich experience in Banking activities. Retired from active services in 2005.

Team member for campus recruitment of B.Tech students from various colleges for Infosys for 6 years.

Trainer in behavioral sciences. with Andhra bank training college and

Later a resource faculty at many organizations.

Played Tennis/ Hockey and basket ball.

రచనలు;

తెలుగు లో చాలా వ్యాసాలు :- సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం . వాణిజ్యము / న్యాయ శాస్త్రము మొదలైనవి.

ప్రచురణలు –

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ ,హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎచ్ ఆర్ డీ , లింక్డిన్ ,

అల్ ఇండియా రేడియో హైదరాబాద్ లో స్కూల్ విద్యార్థుల కు (telugu) కామర్స్ లో పాఠాలు.

గెస్ట్ లెక్చరర్ గ చాలా కంపెనీస్ అండ్ బిజినెస్ స్కూల్స్.

Study handouts and matters for Bankers in the banker’s training college.

Recently in December 2019, one short story in Telugu was published in ' Aavirbhava" online magazine.

Two short stories in Telugu were published in the online magazine ‘Madhura Vaani’ in 2021-2022


Two stories published in "mana Telugu kadhalu.com"

Trying / pencil sketches/ painting and story writing and being active.

ప్రస్తుతం అమెరికా లో పిల్లల తో .


19 views0 comments
bottom of page