top of page
Original.png

చిన్నరాయే కదాని చిన్నచూపేల..?


Chinna Raye Kadaani Chinna Chupela - Telugu Poem | Polayya Kavi

చిన్నరాయే కదాని చిన్నచూపేల..? - తెలుగు కవిత |  పోలయ్య కవి 

Published In manatelugukathalu.com On 09/04/2026


చిన్న రాయే కదాని చిన్నచూపు ఏల?

ఓ మిత్రమా!చిన్న రాళ్లే కదానిచిన్నచూపు చూడకు.

కాలం చెక్కితే, రేపుఅవే కళాఖండాలవుతాయి.

గర్భగుడిలో మనం మొక్కేసుందర దేవతా శిల్పాలవుతాయి.

ఈ రత్నాల, వజ్ర వైడూర్యాల,మణి మాణిక్యాల మెరుపులునిద్రించేది భూగర్భంలోనే కదా!

ఓ మిత్రమా!

చిన్న మొక్కేకదాని పీకేయకు.

ఎవరికెరుక?

రేపు మహావృక్షం కావచ్చు

పచ్చని ఆకులతో చల్లని నీడనివ్వవచ్చు

కమ్మని ఫలాలతో కడుపులు నింపవచ్చు!

ఓ మిత్రమా!

చిన్న రాయే కదాని చిలిపిగా విసరకు.

అదినిశ్చల జలంలో పడినా

అందమైన అద్దంపై పడినా

నీ ప్రతిబింబమే ఛిద్రమై

నిన్ను నీవే కోల్పోతావు!

ఓ మిత్రమా!

చిన్న రాయే కదాని ఆకాశం వైపు విసరకు.

అది తిరిగి పడేదెక్కడ? నీపైనే కదా!

ఆపై పగిలేదేమిటి? నీ తలనే కదా!

ఓ మిత్రమా!

అద్దాల మేడలో నివసిస్తూ రాళ్లు విసరడం మానుకో.

అవి శత్రువులకు తగలకముందే పగిలి ముక్కలయ్యేదేమిటి?

అందమైన, సుందరమైన అద్దాల మేడే కదా!

అందుకే మిత్రమా,

రాతిగుండెల రాక్షసుడివై ఎన్నిరంగు రాళ్లు ధరించి లాభమేమి?

వెన్నలా కరిగే కరుణతో,

పూలలా పరిమళించే ప్రేమతో

మనసున్న మనిషిగా జీవించు.

మంచితనం, మానవత్వమే మనిషికి ఆభరణమని కలనైనా మరువకు!


రచన: కవి రత్న, సాహిత్య ధీర, సహస్ర కవి భూషణ్: పోలయ్య


చయిత పరిచయం: కూకట్లపల్లి పోలయ్య కవి


జన్మస్థలం : 

కందివారి పల్లె  : గ్రామం 

మార్కాపురం  : మునిసిపాలిటీ 

ప్రకాశం : జిల్లా  ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రం. 


తండ్రి పేరు. : కీ.శే.కూకట్లపల్లి ప్రకాశరావు

తల్లి పేరు    : శ్రీమతి కూకట్లపల్లి భాగ్యమ్మ

భార్య పేరు : శ్రీమతి పోతిరెడ్డి సుధారాణి


సంతానం        :ముగ్గురు

పెద్ద కూతురు   : ప్రతిభా లావణ్య

చిన్న కూతురు : లక్ష్మీ సౌజన్య

కుమారుడు     : వంశీ కృష్ణ


పొందిన డిగ్రీలు : M .Com, LLB, CAIIB, 

విద్యాభ్యాసం:

ప్రాథమిక విద్య - ప్రకాశం జిల్లా - తర్లుపాడులో


కాలేజీ చదువు - 1973 -78లో...

Inter‌mediate, B.Com 

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళాశాల...మార్కాపురంలో...


ఉన్నత విద్య - 1978 - 80లో...

M .Com, LLB, CAIIB, 

వాణిజ్య శాస్త్రంలో పట్టా...

నాగార్జునవిశ్వవిద్యాలయం...

గుంటూరులో...


ఉద్యోగవివరాలు:


1981 డిశంబర్ లో...

ఆంధ్రాబ్యాంకులో...ఉద్యోగం..

33 సంవత్సరాల...సుదీర్ఘ ప్రయాణం...

1995 జూన్ లో....హైదరాబాద్ లో...

సీనియర్ బ్రాంచి మేనేజర్ గా పదవీ విరమణ...


ప్రవృత్తి: వచన కవితారచన

పుస్తకపఠనం, కవితాగానం...నటన


వ్రాసిన వచన కవితా రచనల సంఖ్య:

...రమారమి 5000 వచన కవితలు

...దినపత్రికల్లో ప్రింట్ ఐన కవితలు: 

...దాదాపుగా 4600 (75 పత్రికల్లో)

...250 పద్య కవితలు (ద్విశతకం)

... అన్న పోలన్న సుభాషితం

...విన్న మీకు శుభోదయం అన్న

...మధురమైన మకుటంతో

...130 కరోనా కవితలు


స్వీయరచనలు :


(1) ముద్రిత రచనలు : 7

1. కవితా కిరణాలు 

2. సుభాషితాలు - సూర్యకిరణాలు(ద్విశతకం) 

"అన్న పోలన్న సుభాషితం 

"విన్న మీకు శుభోదయం"..

"అన్నమకుటంతో

3. కంప్యూటర్ యుగంలో కాకి

4. జయించడానికే నీవు జన్మించావు

5. స్వామి వివేకానందలా ఆలోచించు 

రామకృష్ణ పరమహంసలా జీవించు

6. Secret of Success.

7. అభిషిక్తుని అమృత వాక్కులు. 


అముద్రితాలు : 

ఇట్లు ప్రేమతో నాన్న ఆశతో అమ్మ

మరో15 పుస్తకాలు...


పొందిన సన్మానాలు/ సత్కారాలు :

1. రాగరమ్య కల్చరల్  ఆర్గనైజేషన్

2. సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ సొసైటీ

3. కవన కిరణాలు ముంబై

4. ఉదయం సాహితీ వేదిక

5. తెలుగు సాహిత్య సమితి

6. ఆరికపుడి పూర్ణ చంద్రారావు ఫౌండేషన్

7. సైమన్ ఫౌండేషన్

8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్

9. మహర్షి వాల్మీకి సాంస్కృతిక

సేవా సంస్థ

10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్


ప్రశంసాపత్రాలు...

అందించిన ప్రముఖ సంస్థలు 

 

1. తెలుగు వెలుగు సాహితీ వేదిక 

2. కవన కిరణాలు

3. ఉదయ  సాహితీ వేదిక

4 పున్నమి పత్రిక...

5..ఏ.కె‌ తెలుగుమీడియా ముంబై...

(ఆంధ్రరత్న అవార్డు) 

6. కర్నాటక తెలుగు రచయితల సంఘం...

7. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్

8. ఆరికపుడి పూర్ణచంద్రారావు ఫౌండేషన్

9. సైమన్ ఫౌండేషన్

10. మహర్షి వాల్మీకి

సాంస్కృతిక సేవా సంస్థ

11. తెలుగు సాహిత్య సమితి12. సీనియర్ సిటిజన్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

13. శ్రీ శ్రీ కళావేదిక

14. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్


సత్కరించిన ప్రముఖ వ్యక్తులు/కవులు


1. ఉదయ సాహితీ వేదిక పురస్కారం

(ప్రముఖ కవి ‌రచయిత)

నందిని సిధారెడ్డి గారిచే సన్మానం


2. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ పురస్కారం

(హాస్య బ్రహ్మ) శ్రీ గౌరీ శంకర్‌

(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్ గార్లచే సన్మానం


3. కవన కిరణాలు సాహితీ‌ వేదిక పురస్కారం

(ప్రముఖ కవి ‌రచయిత) నందిని సిధారెడ్డి

(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్

(ప్రముఖ విశ్లేషకులు)

నాళేశ్వరం శంకరం గార్లచే సన్మానం


4.ఆరికపుడి పూర్ణచంద్రారావు

ఫౌండేషన్ పురస్కారం

లయన్ శ్రీ విజయకుమార్ గారిచే సన్మానం


5. సైమన్ ఫౌండేషన్ పురస్కారం

(మాజీ సిబిఐ జేడీ )

లక్ష్మీనారాయణ గారిచే సన్మానం


6. మహర్షి వాల్మీకి సాంస్కృతిక

సేవా సంస్థ పురస్కారం

హిమాలయ శివసాయి గురూజీ గారిచే సన్మానం


7.సీనియర్ సిటిజన్

ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

పురస్కారం

(హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)‌

శ్రీ చంద్రయ్య గారిచే సన్మానం 


8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్‌ పురస్కారం

(ప్రముఖ గజల్ రచయిత)

కళారత్న బిక్కికృష్ణ గారిచే సన్మానం


9. తెలుగు సాహిత్య సమితి ‌మరియు

ఆరు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన

మాతృ భాషాదినోత్సవ పురస్కారం

శ్రీ నందినీ సిధారెడ్డి గారిచే సన్మానం


10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్

అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి

పండిట్ గారిచే సన్మానం...


ప్రముఖుల చేతులమీదుగా

సన్మానాలు సత్కారాలు...


1. నందిని సిధారెడ్డి (ప్రముఖ కవి ‌రచయిత)

2. చంద్రయ్య  హైకోర్టు (ప్రధాన న్యాయమూర్తి) 

3. మౌనశ్రీ మల్లిక్ (సినీ గేయ రచయిత)

4. నాళేశ్వరం శంకరం ( ప్రముఖ విశ్లేషకులు)

5. లక్ష్మీనారాయణ(మాజీ సిబిఐ జేడీ )

6. కళారత్న బిక్కి కృష్ణ (ప్రముఖ గజల్ రచయిత)

7. హిమాలయ శివసాయి గురూజీచే సన్మానం

8. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజగోపాల్ గారు


ప్రస్తుతనివాసం & చిరునామా :

పోలయ్య కవి కూకట్లపల్లి

మేనేజర్ ఆంధ్రా బ్యాంకు (రిటైర్డ్)

ప్లాట్ నె.201 

శ్రీ సాయిదత్తా అపార్ట్మెంటు. 

గుమ్మకొండ కాలనీ

గౌతం మోడల్ స్కూల్ వెనుక

అత్తాపూర్ హైదర్ గూడ  

రంగారెడ్డి జిల్లా

హైదరాబాద్ -500048


క్లుప్తంగా...నా గురించి...


మనసులోమాటగా, నా పేరు కూకట్లపల్లి పోలయ్య, కలం పేరు,పోలయ్య కవి కూకట్లపల్లి. ప్రస్తుత నివాసం...అత్తాపూర్ హైదరాబాద్ లో...పదవీవిరమణ జూన్ 2015లో. ఆంధ్రా బ్యాంక్ నుండి అధికారిగా...


ఐతే ఎన్నో ఏళ్ళ తర్వాత చిక్కిన ఒక చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విహారయాత్రలు చేసి వీలైనన్ని కొత్తప్రదేశాలను దర్శించాలన్న ఆలోచనలో వున్న ఉన్న నేను కరోనాకాలంలో ఇంట్లోనే బంధీనైపోవడంతో... నా ఊహలకు రెక్కలొచ్చాయి...అనేక నా కవితలు వెలుగు చూశాయి


క్లుప్తంగా... నాసాహితీ సేవ

1975 నుండి 2026 వరకు రమారమి - 51 సంవత్సరాల సాహితీ ప్రయాణం. వృత్తిరీత్యా బ్యాంకు అధికారి‌గా వుంటూ

ప్రవృత్తిరీత్యా కవితలు అల్లడం...నా హాబీ.అనేకానేక సామాజిక అంశాలమీద, సమాజంలోనిఅనేక సమస్యల మీద, మానవ సంబంధాలమీద,

5000 పైగా వచన కవితలు

రచించడంతో పాటు 4600 కవితలు

75 పాత్రికలలో ప్రచురితం

250 వేమనవంటి కవితా పద్యాలు...

130 కరోనా కవితలు...

200 సూక్తులు...

కొత్తగా వ్రాయడం జరిగింది...


నిన్నటి మొన్నటివరకు కారుచీకట్లో

ఉన్న నా కవితలన్ని అనేకమంది సహృదయులైన సంపాదకుల

ఆదరణతో ప్రోత్సాహంతో గత

6 సంవత్సరాలలో సుమారుగా

75 దినపత్రికల్లో

4600 కవితల పైచిలుకు ప్రచురించబడినాయి..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page