దేవుడు కరుణిస్తే
- Nandyala Vijaya Lakshmi

- Dec 1
- 2 min read
#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #DevuduKarunisthe, #దేవుడుకరుణిస్తే, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Devudu Karunisthe - New Telugu Poem Written By - Nandyala Vijaya Lakshmi Published in manatelugukathalu.com on 01/12/2025
దేవుడు కరుణిస్తే - తెలుగు కవిత
రచన: నంద్యాల విజయలక్ష్మి
దేవుడు కరుణిస్తే ఎంత బాగుంటుందో
కాలుష్యము కరిగిపోతుంది
కారుణ్యము వెల్లివిరుస్తుంది.
ధర్మము రాజ్యమేలుతుంది.
అధర్మం అణిచివేయబడుతుంది.
దేవుడు కరుణిస్తే ఎంత బాగుంటుంది.
పూజలు చేస్తాము. గుడులు కట్టిస్తాము.
పాదయాత్రలు చేస్తాము. నోములు ఎన్నో చేస్తాము.
దేవుడు కరుణిస్తే ఎంత బాగుంటుందో.
మానవ ప్రయత్నము శూన్యమైతే దేవుడు ఎందుకు కరుణించాలి?
నీ వంతు కర్తవ్యము చెయ్యి. స్వధర్మాన్ని వీడకు.
తోటివారిని ప్రేమించు. నీ వంతు సేవ సమాజానికి చెయ్యి.
ఆ పైన దేవుడు చూసుకుంటాడు.
దేవుడే దిగిరావాలని ప్రభుత్వమే పని చేయాలనడము.
స్వార్థపరుల మూఢభక్తుల నినాదము.
దేశము నీకు ఏమి ఇచ్చింది? అనేది అర్థములేని వాదన.
దేశముకోసము నువ్వు ఏమి చేసావు? అనేది ముఖ్యము
దేవుడు కరుణిస్తే అనేది ఆశాభావము.
నా కర్తవ్యము నేను నిర్వర్తించాను అనేది స్వాభిమానము.
గాలిలో దీపము పెట్టి నీ చేయి అడ్డము పెట్టకుండా
దేవుడా నువ్వే దిక్కు అనకు.
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .




ఇతివృత్తం బావుంది. అయితే మరింతబాగా రాయవచ్చని అనిపించింది. రచయిత్రిలోని తపన ప్రసంశనీయం.