మన ఊరి బడి - మన గౌరవం
- Patrayudu Kasi Viswanadham

- 3 minutes ago
- 5 min read
government school story, corporate school pressure, Telugu parenting stories, education awareness Telugu

Mana Vuri Badi Mana Gouravam - Telugu Inspirational Story | Patrayudu Kasi Viswanadham
మన ఊరి బడి - మన గౌరవం - తెలుగు ప్రేరణాత్మక కథ | పట్రాయుడు కాశీవిశ్వనాథం
Published In manatelugukathalu.com On 24/05/2026
“94 మార్కులు వచ్చినా… ఆ పిల్లాడు ఎందుకు ఏడ్చాడు?”
కాశీవిశ్వనాథం పట్రాయుడు గారి మన ఊరి బడి - మన గౌరవం కథలో తెలుసుకుందాం.
*****************************
సమయం సాయంత్రం ఐదు కాబోతోంది. రామారావు తన పదేళ్ల కొడుకు చేతన్ను మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి వస్తున్నాడు. చేతన్ ముఖం వాడిపోయి ఉంది.
వాడు చదువుతున్న కార్పొరేట్ పాఠశాల బ్యాగ్ బరువుకు వాడి వీపు వంగిపోయింది. ఆరో తరగతి చదువుతున్న ఆ పిల్లోడి కళ్లల్లో ఈ వయసులో ఉండాల్సిన చైతన్యం లేదు, కేవలం ఏదో కోల్పోయిన శూన్యత కనిపిస్తోంది.
"ఏరా చేతన్! ఇవాళ గణితం వారంతపు పరీక్షలో మార్కులు వచ్చాయా?" అడిగాడు రామారావు.
చేతన్ భయపడుతూ, "వచ్చాయి నాన్నా... వందకు తొంభై నాలుగు మార్కులు వచ్చాయి" అన్నాడు తక్కువ స్వరంతో.
రామారావు ఒక్కసారిగా బైక్ ఆపి, వెనక్కి తిరిగి చూశాడు. "తొంభై నాలుగేనా? మరి ఆ మిగతా ఆరు మార్కులు ఏమయ్యాయి? నీ క్లాస్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన హరీష్కి ఎన్ని వచ్చాయి?" అని గద్దించాడు.
"వాడికి తొంభై తొమ్మిది వచ్చాయి నాన్నా... టీచర్ అందరి ముందు నన్ను తిట్టారు. సరిగ్గా బట్టీ పట్టలేకపోయావు అన్నారు" అంటూ చేతన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఆ సమయంలో పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి పిల్లల నవ్వులు, కేరింతలు వినిపించాయి. రామారావు అటువైపు చూశాడు. అక్కడ పిల్లలు ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. వారిలో రామారావు పాత స్నేహితుడు, అదే ఊరిలో ఉంటున్న కృష్ణమూర్తి కనిపించాడు. కృష్ణమూర్తి కొడుకు అఖిల్ కూడా అదే ప్రభుత్వ బడిలో చదువుతున్నాడు.
వాడు చాలా ఉత్సాహంగా స్నేహితులతో కలిసి సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుతున్నాడు.
రామారావు బైక్ పక్కకు ఆపి, కృష్ణమూర్తి దగ్గరకు వెళ్లాడు. "ఏంటో కృష్ణా! ఈ రోజుల్లో పిల్లల్ని చదివించడం పెద్ద తలనొప్పి అయిపోయింది. లక్షల ఫీజులు పోసి కార్పొరేట్ స్కూల్లో వేసినా వీడేమో మార్కులు తగ్గించుకుంటున్నాడు. ఆ హరీష్ కంటే ఐదు మార్కులు తక్కువ వచ్చాయని నా గుండె మండిపోతోంది" అన్నాడు రామారావు ఆవేదనగా.
కృష్ణమూర్తి నవ్వి, చేతన్ తల నిమిరి, "రామారావు, నువ్వు అడుగుతోంది మార్కుల గురించా? లేక నీ కొడుకు భవిష్యత్తు గురించా?" అని అడిగాడు.
"రెండు ఒకటే కదా కృష్ణా! మార్కులు వస్తేనే కదా మంచి భవిష్యత్తు ఉండేది?" అన్నాడు రామారావు ఆశ్చర్యంగా.
"కాదు రామారావు, నువ్వు పప్పులో కాలేశావు" అంటూ కృష్ణమూర్తి చేతన్ చేతిలోని భారీ బ్యాగ్ను అందుకుని పక్కన పెట్టాడు. "నువ్వు వేలు, లక్షల ఫీజులు కట్టి మీ వాడ్ని ఇరుకు గదుల్లో కూర్చోబెడుతున్నావు. అక్కడ వాడికి కేవలం 'బట్టీ పట్టడం' నేర్పుతున్నారు. మార్కులే లక్ష్యంగా వాళ్లను మనుషులుగా కాకుండా, కేవలం ర్యాంకులు తెచ్చే 'మరమనుషుల్లా' తయారు చేస్తున్నారు. ఒక్క మార్కు తగ్గినా తట్టుకోలేక, ఒత్తిడి భరించలేక ఈ రోజుల్లో పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్లకు స్వతంత్రంగా ఆలోచించే శక్తే ఉండటం లేదు." అన్నాడు.
రామారావు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కృష్ణమూర్తి అన్న మాటల్లోని నిజం అతనికి తెలిసింది.
కృష్ణమూర్తి ప్రభుత్వ స్కూల్ భవనాన్ని చూపిస్తూ "ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే ఎలా ఉండేదో పక్కన పెట్టు. నేడు రోజులు మారాయి. మా 'మన బడి' చూడు. ఎంత విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాస్రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ఉన్నాయో! ఇక్కడ కేవలం పుస్తకాల్లోని చదువే కాదు... ఆటలు, పాటలు, సంస్కృతి, సైన్స్ ఎగ్జిబిషన్లు, నాయకత్వ లక్షణాలు కూడా నేర్పుతారు. అన్నింటికన్నా ముఖ్యం... ఇక్కడ చదువుకునే పిల్లవాడు ఒత్తిడి లేకుండా, సమాజంలో ఎలా బతకాలో నేర్చుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే... ప్రైవేట్ పాఠశాలలు రత్నాలకు మెరుగులు దిద్దడానికే పరిమితమైతే, ఈ ప్రభుత్వ పాఠశాలలు రాళ్లను సైతం రత్నాలుగా మారుస్తున్నాయి!"
అదే సమయానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాఘవరావు గారు అటుగా వచ్చారు. ఆయన రామారావు ఆందోళనను గమనించి సాదరంగా పలకరించారు.
"నమస్తే అండీ. కృష్ణమూర్తి గారు చెప్పింది అక్షరాలా నిజం. మా స్కూల్లో చదివే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, పుస్తకాలు, పాఠశాల దుస్తులు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం లభిస్తాయి. అంతేకాదు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా ఎంతో కష్టపడి, ఎన్నో పరీక్షలు పాసైన ఉత్తమ అర్హత కలిగిన వాళ్లు. వారు ప్రతి పిల్లవాడిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ప్రైవేట్ స్కూళ్లలో లక్షల మంది చేరితే వందల మంది మాత్రమే విజేతలు అవుతారు, మిగిలిన వాళ్లు ఫీజుల రూపంలో నష్టపోతారు. కానీ ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థి 'ఆల్ రౌండర్' గా తయారవుతాడు. ఇక్కడి నుండి చదువుకుని వెళ్లిన వాళ్లు గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, దేశాన్ని నడిపించే నీతిగల నాయకులు అయ్యారు" అని ఎంతో గర్వంగా వివరించారు ప్రధానోపాధ్యాయులు.
చేతన్ ఎంతో ఆశగా ఆ పెద్ద మైదానాన్ని, అక్కడ నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలను చూశాడు.
"నాన్నా! నాకు కూడా ఇలాంటి స్కూల్లోనే చదవాలని ఉంది. అక్కడ నన్ను మార్కుల కోసం ఎవరూ వేధించరు కదా? నేను కూడా అఖిల్లాగా సంతోషంగా ఉంటాను" అన్నాడు అమాయకంగా.
కొడుకు కళ్లల్లోని ఆనందాన్ని, కార్పొరేట్ చదువుల వెనుక ఉన్న నిస్సారమైన నిజాల్ని రామారావు గ్రహించాడు. కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజుల రూపంలో వృథా చేస్తూ, కొడుకు బాల్యాన్ని తాకట్టు పెడుతున్నానని అతనికి కనువిప్పు కలిగింది.
రామారావు ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కరిస్తూ, "చాలా పెద్ద తప్పు చేయబోయాను సార్. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) లోనే నా కొడుకును ఈ ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పిస్తాను. నా కష్టార్జితాన్ని ఫీజుల రూపంలో వృథా చేయకుండా, వాడి భవిష్యత్తు కోసం దాచుకుంటాను. మన బడి... మన ఊరి బడి... మన గౌరవం" అన్నాడు ఎంతో నమ్మకంతో.
కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయులు గారు సంతోషంగా నవ్వారు. చేతన్ ముఖంలో చాలా రోజుల తర్వాత ఒక ఉజ్వలమైన, స్వేచ్ఛాయుతమైన చిరునవ్వు కనిపించింది.
సమాప్తం
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి కొన్ని ఇతర రచనలు:
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi Viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
పట్రాయుడు కాశీవిశ్వనాథం, Goranta Deepam Kondanta Velugu, గోరంత దీపం - కొండంత వెలుగు, moral story telugu |









Comments