top of page

భౌతిక శాస్త్ర ధృవ తార - సూరి భగవంతం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Pole Star Of Physics - Suri Bhagavantham' New Telugu


Article Written By N. Sai Prasanthi


రచన: N. సాయి ప్రశాంతి


భౌతిక శాస్త్రరంగంలో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు భారతదేశం లో పుట్టారు. పూర్వకాలంలో అణువులపై పరిశోధనలు చేసిన కణాదుడు, మొదటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అగస్త్యుడు మరియు తన పరిశోధనలతో నోబెల్ బహుమతిని సాధించిన సివి రామన్ అనేకులు ఉన్నారు


అయితే కొందరి గురించి మాత్రమే మనకు తెలుసు.

అలా ప్రపంచం మరిచిపోయిన శాస్త్రవేత్తలలో ఒకరు సూరి భగవంతం గారు

ఆయన శాస్త్ర రంగం అభివృద్ధికి ఎంతో సేవ చేసారు.

ఆయన చేసిన పరిశోధనలు ఇప్పుడు భౌతిక శాస్త్ర రంగంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.


జననం -విద్యాభ్యాసం :

సూరిభగవంతం గారు 1909లో

అగిరిపల్లి అనే ఊరిలో జన్మించారు గుడివాడ లో ప్రాథమిక విద్య అనంతరం నిజాం కాలేజీ లో బిఎస్సీ భౌతిక శాస్త్రం చదివారు

సివి రామన్ గారి పరిశోధనలకు ఆకర్షితులై 1928లో కలకత్తా వెళ్లారు అక్కడ ఆయన ప్రయోగశాలలో చేరారు. అయితే సివి రామన్ గారు నోబెల్ బహుమతి పొందిన తర్వాత భగవంతం గారిని తన ప్రయోగాలలో సహాయ పరిశోధకుడిగా చేరమని అడిగారు. ఈ సమయంలో ఆయన తన మాస్టర్స్ డిగ్రీని మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు


1933లో 22 సంవత్సరాల వయసులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. ఆయన బోధనా సామర్థ్యం అనుపమానమైనది. ఆయన తరగతులు వినడానికి ఇతర తరగతుల వారే కాక తన కంటే పెద్దవారైన అధ్యాపకులు వచ్చే వారు.


భౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా 1938లో ,ప్రిన్సిపాల్ గా 1941లో నియమించబడ్డారు.

డిఎస్సీ డిగ్రీ కూడా పొందారు.


స్వాతంత్య్రం అనంతరం వికె కృష్ణ మీనన్ గారికి శాస్త్రీయ సలహా దారుగా నియమించబడ్డారు, శాస్త్ర ప్రసంగాలు ఇవ్వడానికి అనేక యూరప్ దేశాలు కూడా తిరిగారు. 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర శాఖలో చేరారు

ఆయన మార్గదర్శనంలో 12 మంది విద్యార్ధులు డాక్టరేట్ పొందారు , 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ గా నియమితులయ్యారు.

1957లో IISc డైరెక్టర్ అయ్యారు, 5సంవత్సరాలు ఆ సంస్థ కి సేవలందించారు ఆ తర్వాత భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుగా సేవలందించారు


1962లో DRDO డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.


1969లో పదవీ విరమణ పొందారు

అయితే భౌతిక శాస్త్రంలో సుమారు 300 ల పత్రాలు ప్రచురించారు మరియు అనేక పుస్తకాలు రాసారు.


ఆయన గొప్ప మేధావి మాత్రమే కాదు పరిపాలన దక్షుడు, వక్త.

మరియు ఆయనకి తెలుగు సంస్కృత భాషలలో అపారమైన పాండిత్యం ఉండేది.


దేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికై అనేక ప్రాంతాలలో మరియు ఇతర ప్రాంతాలలో ఉపన్యాసాలు ఇచ్చారు.


ఇటువంటి గొప్ప శాస్త్రవేత్తల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం:


నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.



36 views0 comments
bottom of page