కచదేవయాని - పార్ట్ 15
- T. V. L. Gayathri
- Oct 6
- 3 min read
Updated: 6 days ago
#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

Kachadevayani - Part 15 - New Telugu Web Series Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 06/10/2025
కచదేవయాని - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక
రచన: T. V. L. గాయత్రి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. చెలికత్తెలతో పురుష వేషంలో వేటకు వెళుతుంది శర్మిష్ఠ. అక్కడ ఆమెకు నహుష చక్రవర్తి కుమారుడైన యయాతి తారస పడతాడు.
తనపై దాడికి దిగిన శర్మిష్ఠ అనుచరులను ఓడించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు యయాతి. తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి ఆయనను ఆహ్వానిస్తాడు. శర్మిష్ట గీచిన చిత్రాన్ని బట్టి, ఆమెతో తలపడింది యయాతి అని గ్రహిస్తాడు ఆమె తండ్రి వృషపర్వుడు. యయాతికి సంబంధించిన ఊహల్లో అన్యమనస్కంగా ఉంటుంది శర్మిష్ఠ.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక కచదేవయాని పార్ట్ 15 చదవండి.
ఒక నెల గడిచింది.
నహుషచక్రవర్తి నిర్వహించే యజ్ఞానికి బయలుదేరటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు వృషపర్వుడు.
ఆయన వెంట రెండొందల మంది చెలికత్తెలతో సుమాలినీదేవి కూడా ప్రయాణమవుతోంది. వ్యాపారవేత్తలు, వైద్యులు, నాట్యకారిణులు, ,కవులు, గాయకులు, విదూషకులు, వంటవాళ్లు, పనివాళ్ళతో పాటు పెద్ద ఎత్తున సైన్యం కూడా బయలు దేరింది.
రేపే ప్రయాణం.
శర్మిష్ఠకు ఏమీ తోచటం లేదు. తనను యజ్ఞానికి తీసికెళ్లకూడదు. సంప్రదాయం కాదు. ఏదో తెలియని ఆరాటం ఆమెను నిలువ నీయటంలేదు. కాలుగాలిన పిల్లి లాగా తండ్రి కోసం ఎదురు చూస్తోంది. రోజంతా ఎదురు చూచినా ఆయన దర్శనం మాత్రం దొరకలేదు. ఆయన తన పనుల్లో మునిగిపోయి ఉన్నాడు.
ఏం చేద్దాం?
తండ్రి కోసం చూచి చూచి పడుకుంది శర్మిష్ఠ.
రెండో రోజు ఉదయాన్నేశర్మిష్ఠ కళ్లు విప్పేసరికి ఎదురుగ్గా నవ్వుతూ తల్లిదండ్రులు కనిపించారు.
ఒక్క ఉదుటున పక్క మీద నుండి లేచింది శర్మిష్ఠ.
"నాన్నగారు... మీరు... మీరు.." అంటోంది. ఆ తర్వాత ఏమి చెప్పాలో తెలియ లేదామెకు.
కూతురికి చెరో పక్కన కూర్చున్నారిద్దరూ.
"చూడు! మేము యయాతి గురించి పూర్తిగా కనుక్కొని వస్తాము! అతడు వ్యసనపరుడో, దుష్ప్రప్రవర్తన కలవాడో అయితే అతడి గురించి అస్సలు ఆలోచించే పనే లేదు. అతడి దగ్గర నీకు భద్రత ఉంటుందనుకుంటే మాత్రమే వాళ్ళను ఇక్కడికి ఆహ్వానిస్తాను. ఈ నెలరోజుల నుండి నేను వేగులను పంపించి అతడి గురించి కొంత సమాచారాన్ని సేకరించాను.
అతడు చదువులో చాలా చురుకైన వాడనీ, అన్ని శాస్త్రాలను నేర్చుకున్న వాడనీ, పెద్దలను గౌరవిస్తాడని తెలిసింది. ఇవి చాలవు!నిన్ను ఇచ్చి వివాహం చేయాలంటే యయాతి విషయంలో మాకు పూర్తిగా సంతృప్తి కలగాలి. ఫలానా రాజు కుమారుడనో, ఫలానా గురువుగారి శిష్యుడనో కాదు!... అతడి వ్యక్తిత్వం నచ్చాలి!..
మన రాజ్యానికి నువ్వు మాత్రమే వారసురాలివి. నిన్ను మాత్రమే సింహాసనం మీద మహారాణిగా కూర్చోబెడతాను. పరిపాలన నువ్వు మాత్రమే చేస్తావు.. ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు. దానికి అతడు కూడా ఒప్పుకోవాలి. నీ స్వాతంత్ర్యాన్ని, నీ అధికారాన్ని అతడు గౌరవించాలి. అదీ నా కోరిక!" మృదువుగా చెప్పినా స్థిరంగా చెప్పాడు వృషపర్వుడు.
తండ్రి చెప్పింది విని
"అలాగే నాన్నగారు! మీ నిర్ణయమే నా నిర్ణయం! స్త్రీకి గౌరవమర్యాదలు ముఖ్యం! ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు!" అంది శర్మిష్ఠ దృఢంగా.
ప్రేమగా కూతురి తలను నిమిరాడు వృషపర్వుడు.
"ఏదీ నీదొక చిత్రపటం ఇవ్వు! అన్నీ బాగుంటే వాళ్లకు చూపిస్తాను!" అంది సుమాలినీదేవి.
శర్మిష్ఠ లేచి మదనిక వేసిన తన చిత్రపటాన్నొక దాన్ని తీసికొచ్చి తల్లి కిచ్చింది.
కాసేపటికి శర్మిష్ఠకు అన్ని జాగ్రత్తలు చెప్పి పరివారంతో సహా నహుషచక్రవర్తి రాజ్యమైన ప్రతిష్ఠానపురానికి బయలుదేరాడు వృషపర్వుడు.
======================================================================
ఇంకా వుంది..
=======================================================================
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments