top of page

కచదేవయాని - పార్ట్ 18

Updated: Oct 24

#TVLGayathri, #TVLగాయత్రి, #Kachadevayani, #కచదేవయాని, #TeluguEpicStories, #తెలుగుకథలు

ree

Kachadevayani - Part 18 - New Telugu Web Series Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 18/10/2025

కచదేవయాని - పార్ట్ 18తెలుగు ధారావాహిక

రచన: T. V. L. గాయత్రి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. 


దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ. అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. 


తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహామునిని ఆహ్వానిస్తాడు యయాతి. ఆ యాగానికి వృషపర్వుడు కూడా వెళ్తాడు. మరీచి మహర్షి దగ్గర యయాతిని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు. నహుషునితో మాట్లాడుతానంటాడు మరీచి మహర్షి. 

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కచదేవయాని పార్ట్ 18 చదవండి. 


సలక్షణంగా యజ్ఞం పూర్తి అయ్యింది. యజ్ఞం జరుగుతున్న సమయంలో గురువుగారైన శుక్రాచార్యునితో మాట్లాడటానికి వృషపర్వుడు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆయన ఏకాంతంగా కనిపించటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన చుట్టూ ఉంటూనే ఉన్నారు. దానవరాజుకు కొద్దిగా నిరాశగా అనిపించింది. 


శర్మిష్ఠ వివాహం గురించి గురువుతో మాట్లాడదామని రెండు మూడు సార్లు తిరిగాడు. ఏం చెయ్యాలి? ఆయన ఒక్కడే దొరకటం లేదు మరి!


యజ్ఞం పూర్తయ్యాక శుక్రాచార్యుడు తాను నాగలోకానికి వెళుతున్నట్టు వృషపర్వునితో చెప్పాడు. అప్పుడు కూడా ఆయన దగ్గర నాగలోకవాసులు ఉన్నారు. 


'కూతురి వివాహ విషయాన్ని గురించి ఇప్పుడే అందరితో చెప్పుకోవడమెందుకు? అంతా కుదిరితే విషయాన్ని గురువుగారుతో చెప్పుకోవచ్చని' శుక్రాచార్యుడికి వీడ్కోలు పలికాడు వృషపర్వుడు. 


 రెండు రోజుల తర్వాత మరీచిమహర్షి వచ్చి దానవరాజును కలుసుకున్నాడు. 


" రాజా! నువ్వు సూచించిన విషయాలను నేను నహుష చక్రవర్తితో మాట్లాడాను. ఆ సమయానికి యయాతి రాకుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే మీ రాజ్యానికి సమీపంలో ఉన్న బృహదారణ్యాన్ని చదును చేసి కొత్త రాజ్యాన్ని నిర్మిద్దామని నహుషుని ఆలోచన. ఆ కొత్త రాజ్యాన్ని యయాతి పరిపాలిస్తాడు. 


నీ రాజ్యానికి పక్కనే ఉంటాడు కాబట్టి మీ అమ్మాయికి అవసరమైతే తాను సహాయ సహకారాలను అందజేస్తాడు. మీ అమ్మాయిని మీ రాజ్యానికి మహారాణిగా నియమించవచ్చు! ముందు వివాహం అయ్యాక రాజ్యవిస్తరణను చేయవచ్చు ఏమంటావు? "అంటూ చెప్పాడు. మహర్షి చెప్పింది విని సంతోషించాడు వృషపర్వుడు. 



ree

ఆ రోజు సాయంత్రం నహుషుని మందిరంలో కుటుంబ సభ్యులతో సహా సమావేశమయ్యాడు వృషపర్వుడు. 

ఒక ఉన్నతమైన ఆసనం మీద మరీచి మహర్షి కూర్చున్నాడు. ఆయన ప్రక్కనే నహుషచక్రవర్తి కూర్చొని ఉన్నాడు. సుమాలినీదేవి విరజాదేవితో పాటు కూర్చుంది. వృషపుర్వుని ప్రక్కన యాయాతి రాకుమారుడు కూర్చున్నాడు. మిగిలిన సభ్యులు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆసీనులయ్యారు. 


అప్పుడు నహుషుని పురోహితుడైన కంథుమహర్షి లేచి నిల్చున్నాడు. మొదట వృషపర్వునిని, అతడి కుటుంబాన్ని ఆశీర్వదించి ఇలా మాట్లాడసాగాడు. 


 "దానవరాజా! మా నహుష చక్రవర్తి తన యువరాజు అయిన యయాతి రాకుమారుడికి మీ రాజకుమారి శర్మిష్ఠకు వివాహం జరిపించాలని కోరుకుంటున్నారు. ఈ సంబంధం వలన మీ ఇరుకుటుంబాలకే కాకుండా మీ మీ రాజ్య ప్రజలకు కూడా శుభం కలిగుతుంది. " అంటూ మరలా ఆశీర్వదించి కూర్చున్నాడు. 


అప్పుడు నహుషచక్రవర్తి

 "రాజా! మీకు ఇప్పటికే మాన్యులైన మరీచి మహర్షుల వారు విషయాన్ని తెలిపే ఉంటారు. మా కుమారుడిని ఇల్లరికం పంపే సాంప్రదాయం మా కుటుంబంలో లేదు. మీకు వారసురాలు మీ కుమార్తె ఒక్కతే! కాబట్టి మీ రాజ్యానికి సమీపంలో ఉన్న బృహదారణ్యంలో క్రొత్త రాజ్యాన్ని నిర్మించాలని నిర్ణయించాము! మా నిర్ణయము మీకు కూడా సమ్మతమే కదా!" అన్నాడు. 


 వృషపర్వుడు లేచి చేతులు జోడించి


 "చాలా సంతోషం చక్రవర్తీ! నూతన రాజ్యనిర్మాణానికి మా కెటువంటి అభ్యంతరం లేదు. రాజ్య నిర్మాణానికి మా దానవ శిల్పి అయిన మయాచార్యునికి నేను కబురు పంపిస్తాను. అతడు రాజ్యనిర్మాణంలో సిద్ధహస్తుడు. మా రాజ్యంలోని ప్రసిద్ధమైన కట్టడాల నన్నింటినీ అతడే నిర్పించాడు. అతి త్వరగా కార్యాన్ని పూర్తి చేయడంలో మయాచార్యునికి సాటి దేవశిల్పి విశ్వకర్మ ఒక్కడే! 


ప్రస్తుతం మయాచార్యుడు పాతాళలోకంలో కొత్త రాజభవనాలను నిర్మిస్తున్నాడు. అవి ఇంకో రెండు నెలల్లో పూర్తి అయిపోతాయి. అయితే రాజ్యనిర్మాణ విషయాన్ని మనము మన మధ్య గోప్యంగా ఉంచితే మంచిది. 


ఎందుకంటే మన శత్రువులకు ఎవరికైనా విషయం తెలిస్తే మనం చేయబోయే కార్యానికి విఘ్నం కలిగించవచ్చు. ఇంకొక నెల రోజుల తర్వాత మా అమ్మాయి శర్మిష్ఠ పుట్టినరోజు వస్తుంది. ఆ ఉత్సవం సందర్భంగా మీరు మీ పరివారంతో మా రాజ్యానికి వచ్చి మా అమ్మాయిని చూచి ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను!" అంటూ అందరికీ నమస్కారం చేశాడు. 


అప్పుడు నహుషచక్రవర్తి ఒక్కసారిగా తన ఆసనం నుండి లేచి వచ్చి వృషపర్వుడిని కౌగలించుకున్నాడు. 


"తప్పకుండా దానవరాజా! మనిద్దరి బంధుత్వం మన శత్రువులకు కంటగింపుగా ఉండవచ్చు. అందుకని ఈ విషయాన్ని మీరు చెప్పినట్లుగా రహస్యంగానే ఉంచుదాం! మీ అమ్మాయి పుట్టినరోజుకి తప్పకుండా మేము మీ రాజ్యానికి వస్తాం!" అని చెప్పాడు. 


 అప్పుడు సుమాలినీదేవి శర్మిష్ఠ చిత్రపటాన్ని తెప్పించి విరజాదేవి చేతికిచ్చింది. 

చక్రవర్తి పరివార సభ్యులందరూ శర్మిష్ఠ చిత్రాన్ని చూసి ఎంతో ఆనందించారు. విందు వినోదాలతో ఆ సమావేశం సరదాగా ముగిసింది. //


======================================================================

ఇంకా వుంది..

=======================================================================

 T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.


Comments


bottom of page