top of page

మనసు చెబుతుంది విను


'Manasu Chebuthundi Vinu' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

వెన్నెలకాసే పున్నమివేళ వీచేచల్లని గాలి

వెతలనుమరిపించి మనసును మురిపిస్తుంది


ఇంటి వాకిట పచ్చని మొక్కలు విరిసిన పూవులు

కనులకు విందు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి


పసిపాపకు లాలిపాట మనసును కదిలించే భావగీతం

ప్రియమైన వారికి పంపే సందేశాలు రచయితకు సార్ధకత


వినిపించే గొంతులో ఎన్నో రాగాలు నవరసాల గుళికలు

మరపురాని అనుభూతుల సారం గుండెలో దాచుకున్న నిధులు


మాటేఅవసరంలేదు కనులతో పలుకరించి

సందేశాలతో అలరించి మనసు దోచుకోగలవు


ఆకర్షణ క్షణికమైతే వివేకంతో చేసేఆలోచన మంచికలిగిస్తుంది

తొందరపాటు నిర్ణయాలుమనిషికి చేటు తెస్తాయి


అమ్మాయిని అవమానించవద్దు ఆమెలో అగ్నివుంది

అది నిన్ను ఏదోరకంగా కాల్చివేస్తుంది మిగిలేది భస్మం


అర్ధనారీశ్వరస్వరూపానికి ఎన్నో అర్ధాలు చెప్పుకోవచ్చు

అది పైకికనిపించని మంచికి చెడుకి ఉదాహరణం


పసివారిలో దైవాన్ని చూడు అది నీకు రక్షణగా ఉంటుంది

మరో నీచదృష్టితోచూసావంటే నీ పతనానికి పరాకాష్ట అవుతుంది


అందమైనపూవులను అపురూపంగా చూడాలి అది వివేకం

తాకాలనేఆలోచనవచ్చిందా ఆత్మహత్య చేసుకో అదేనీకుశిక్ష

నీ మనసేనీకు నిర్ణేత నీవివేకమే నీకు తీర్పుచెప్పే నాయదేవత

ఆమాటే నీకు దారిచూపే రాచబాట !

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

















57 views0 comments
bottom of page